Mahayuti Alliance : మహాయుతి కూటమిలో విభేదాలు?
Mahayuti Alliance : భాజపా నేతృత్వంలోని మహాయుతి కూటమి అంతర్గతంగా అఖండంగా ఉందని పలుమార్లు పునరుద్ఘాటించినా, ఇటువంటి సంఘటనలు ఆ భావనను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి
- Author : Sudheer
Date : 13-04-2025 - 3:23 IST
Published By : Hashtagu Telugu Desk
మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి భాగంగా ఉన్న మహాయుతి కూటమి( Mahayuti Alliance)లో విభేదాలు తలెత్తుతున్నాయనే వార్తలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ వార్తలకు బలం చేకూర్చే విధంగా ఛత్రపతి శివాజీ వర్ధంతి సందర్భంగా జరిగిన ఒక సంఘటన ఆసక్తికరంగా మారింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)కి చెందిన ఎంపీ సునీల్ తత్కరీ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు. కానీ మహాయుతిలో భాగస్వామి అయిన శివసేన నేతలు ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు.
Rajiv Yuva Vikasam 2025: రాజీవ్ యువ వికాసం పథకానికి రేపు ఒక్కరోజే ఛాన్స్?
తాను శివసేన నేతలందరినీ ఆహ్వానించినప్పటికీ ఎవరూ విందుకు రాలేదని సునీల్ తత్కరీ స్పష్టం చేశారు. ఇది మహాయుతి కూటమిలో పాతిపెట్టిన విభేదాలు మళ్లీ తెరపైకి వచ్చినట్లు సంకేతాలిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శివసేన నేతలు మౌనం పాటించడం కూడా ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. ఈ సంఘటన అనంతరం సోషల్ మీడియాలో మరియు వార్తా చానల్స్లో ‘మహాయుతిలో చీలిక’ అనే ప్రచారం ఊపందుకుంది.
భాజపా నేతృత్వంలోని మహాయుతి కూటమి అంతర్గతంగా అఖండంగా ఉందని పలుమార్లు పునరుద్ఘాటించినా, ఇటువంటి సంఘటనలు ఆ భావనను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయం తక్కువగా ఉండటం, ఈ రకమైన కార్యక్రమాల్లో అనుబంధత లోపించడం రాజకీయంగా గమనించదగ్గ పరిణామాలుగా మారుతున్నాయి. భవిష్యత్తులో ఈ విభేదాలు పరిష్కారమవుతాయా లేదా మహాయుతిలో గంభీరమైన సంక్షోభానికి దారితీస్తాయా అన్నది వేచి చూడాల్సిన విషయమే.