CRPF : రైల్లో మహిళని వేధించిన సీఆర్పీఎఫ్ జవాన్.. తన సీట్లో…?
బీహార్లోని బక్సర్లో రైల్లో ప్రయాణిస్తున్న ఓ మహిళాని సీఆర్పీఎఫ్ జవాన్ వేధించాడు
- By Prasad Published Date - 07:25 AM, Sun - 24 July 22
బీహార్లోని బక్సర్లో రైల్లో ప్రయాణిస్తున్న ఓ మహిళాని సీఆర్పీఎఫ్ జవాన్ వేధించాడు. ఆమె కూర్చున్న సీటును ఆక్రమించి, ఆమెను అదే సీటుపై బలవంతంగా పడుకోవాలని వేధించాడు. బాధితురాలు ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ నుంచి గౌహతి వెళ్లే నార్త్ ఈస్ట్ సూపర్ ఫాస్ట్ రైలులో ప్రయాణిస్తోంది.
రైలు మధ్యాహ్నం ప్రయాగ్రాజ్ జంక్షన్కు చేరుకోగానే నీరజ్ కుమార్ అనే సీఆర్పీఎఫ్ సిబ్బంది తాగిన మత్తులో రైలు ఎక్కినట్లు బాధితురాలు తెలిపింది. బాధితురాలి పేరిట రిజర్వు చేసిన సీటు వద్దకు వెళ్లి.. సీటుపై కూర్చొని బలవంతంగా నిద్రించేందుకు ప్రయత్నించాడు. సీఆర్పీఎఫ్ జవాన్ చర్యపై మహిళ అభ్యంతరం వ్యక్తం చేసి వేరే చోటికి వెళ్లమని కోరగా.. నిందితుడు నిరాకరించాడు.
తరువాత మహిళను సగం సీటులో పడుకోమని, మిగిలిన స్థలంలో తాను కూడా పడుకుంటానని చెప్పాడు. తనకు సౌకర్యంగా లేదని వేరే సీటుకు వెళ్లమని మహిళా అభ్యర్థిస్తూనే ఉంది. రైలు సాయంత్రం 6.45 గంటలకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ రైల్వే స్టేషన్ (మొఘల్సరాయ్) చేరుకున్నప్పుడు మహిళా ప్రయాణికురాలు రైలు దిగి పోలీసు కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసింది. దీంతో రైలులో ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్ ని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు.
Tags
Related News
Majlis In Bihar : బిహార్లో ‘మజ్లిస్’ పార్టీ టఫ్ ఫైట్ ఇస్తున్న స్థానాలివే..
Majlis In Bihar : మజ్లిస్ పార్టీ బిహార్ లోక్సభ ఎన్నికల్లోనూ పోటీ చేస్తోంది. ముస్లిం జనాభా అత్యధికంగా ఉండే సీమాంచల్ ప్రాంతంలో ఆ పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగారు.