400 Paar : ఈసారి బీజేపీకి 200 సీట్లు కూడా అతికష్టమే.. శశిథరూర్ జోస్యం
400 Paar :ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లను సాధిస్తుందా ?
- By Pasha Published Date - 03:31 PM, Thu - 2 May 24
400 Paar :ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లను సాధిస్తుందా ? ఇప్పటివరకు జరిగిన రెండు విడతల పోలింగ్లో ప్రజల మూడ్ ఎలా ఉంది ? ఈ ఎన్నికల్లో బీజేపీకి ఎదురవుతున్న ప్రధాన సవాళ్లు ఏమిటి ? అనే అంశాలపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ మాట్లాడారు. ప్రముఖ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ టాపిక్స్పై ఆయన తనదైన శైలిలో విశ్లేషణ చేశారు. వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
శశిథరూర్ ఏమేం అన్నారంటే..
- ‘‘బీజేపీ 400కుపైగా లోక్సభ సీట్లు(400 Paar) సాధించడం అనేది ఒక జోక్. కనీసం 300కు పైగా సీట్లు సాధించడం అసాధ్యం. ఈసారి 200 సీట్లను బీజేపీ దాటడం కూడా పెద్ద సవాలే’’ అని శశిథరూర్ పేర్కొన్నారు.
- ‘‘కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు. 2019 ఎన్నికల కంటే ఈసారి దక్షిణాదిలో బీజేపకి అధ్వానమైన ఫలితాలు వస్తాయి’’ అని థరూర్ తెలిపారు.
- తిరువనంతపురం లోక్సభ స్థానంలో తాను ఈజీగా గెలుస్తానని థరూర్ చెప్పారు.
- ‘‘ఇప్పటివరకు రెండు విడత పోలింగ్ ఇండియా కూటమికి అనుకూలంగా జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఓటింగ్ ట్రెండ్ లేదు. 2014, 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీజేపీ క్యాడర్లో జోష్ లేదు’’ అని శశిథరూర్ తెలిపారు.
- ‘‘ఈ ఎన్నికల్లో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మెజారిటీని కోల్పోనుంది. గత ఎన్నికల తరహా సునామీ ఫలితాలను బీజేపీ అంచనా వేసుకుంటోంది. కానీ అలా జరిగే ఛాన్సే లేదు’’ అని థరూర్ చెప్పారు.
- ‘‘ఈ ఎన్నికల్లో కర్ణాటక, హర్యానా సహా చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పుంజుకోబోతంది. కచ్చితంగా మా లోక్సభ సీట్లు పెరుగుతాయి’’ అని థరూర్ పేర్కొన్నారు.
Also Read :Modi Vs Rahul : ‘యువరాజు’ను భారత ప్రధాని చేయాలని పాక్ తహతహ : ప్రధాని మోడీ
- ‘‘ బీజేపీ హయాంలో ఉద్యోగాలకు నోచుకోని.. ఆర్థిక వ్యవస్థ కుదేలై ఇబ్బందిపడుతున్న పేదలు తప్పకుండా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారు. ఇలాంటి ఓట్లే బీజేపీని ఓడించబోతున్నాయి’’ అని థరూర్ విశ్లేషించారు.
- ‘‘2019 లోక్సభ ఎన్నికల్లో పుల్వామా ఉగ్రదాడితో ఓటర్లలో ఎమోషన్ను రగిల్చి మోడీ గెలిచారు. ఈసారి అలాంటి పాయింట్స్ మోడీ దగ్గర లేవు. అందుకే రామమందిరం, ముస్లింల అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. ఈసారి అవన్నీ పనిచేయవు’’ అని థరూర్ అభిప్రాయపడ్డారు.
Also Read :Vijay Devarakonda : బాలకృష్ణ కాదు రౌడీ హీరోని లైన్ లో పెడుతున్న డైరెక్టర్..!
Related News
TS : హరీశ్ రావు-రేవంత్ రెడ్డిల విద్యుత్ కోతల వివాదం
Power cuts controversy:మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) గురువారం మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్ కోతల(Power cuts) విషయంతో మరోసారి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పై విమర్శలు గుప్పించారు. అందరూ తనలాగే కుట్రలు, కుతంత్రాలు పన్నుతారనే భ్రమల్లోనే రేవంత్ రెడ్డి ఉన్నారని కానీ అలాంటి ఆలోచనలు మానుకొని ముఖ్యమంత్రి పాలనపై దృష్టి సారించాలని అన్నారు. విద్యుత్ కోతల విషయంలో ప్రభుత్వ ఉద్యోగ