Congress :ఎన్నికలకు రాహుల్ గుడ్ బై?న్యాయ,శాసన సమరం!
(Congress) రాహుల్ పై అనర్హత వేటు వేసిన లోక్ సభ సచివాలయం నిర్ణయం శాసన,
- By CS Rao Published Date - 12:10 PM, Sat - 25 March 23
(Congress) రాహుల్ పై అనర్హత వేటు (Disqualified) వేసిన లోక్ సభ సచివాలయం నిర్ణయం శాసన, న్యాయ వ్యవస్థల మధ్య సున్నితమైన గ్యాప్ ను గుర్తు చేయనుంది. వాయనాడ్ ఎంపీగా అనర్హత పొందిన రాహుల్ స్థానంలో ఉప ఎన్నిక ఖాయమా? ఈ మొత్తం ఎపిసోడ్ ఎటు వైపు తిరగనుంది? రెండేళ్లు జైలు శిక్ష పడిన వాళ్లు ఎన్నికల్లో పోటీకి కూడా అనర్హులా? ఇలాంటి ఎన్నో అంశాలు తెరమీదకు వస్తున్నాయి. వాటికి స్పష్టత రావాలంటే కొంచెం వెనక్కు వెళ్లి గతంలో జరిగిన అనర్హతలను పరిశీలించాల్సిందే. ప్రధానంగా లక్షదీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్ కేసును పరిశీలిస్తే రాహుల్ విషయంలో ఏమి జరగనుంది? అనే దానిపై కొంత మేరకు స్పష్టతకు రావచ్చు.
రాహుల్ 8 ఏళ్లపాటు ఎన్నికలకు దూరం(Congress)
కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష ఖరారైన 24 గంటల్లోపు ఆయనపై లోక్సభ సచివాలయం అనర్హత వేటు (Disqualified)వేసింది. అంటే, ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రాహుల్ 8 ఏళ్లపాటు ఎన్నికలకు దూరంగా ఉండాలి. కానీ, పైకోర్టులో అప్పీలు చేసుకుంటే అనర్హత వేటు తొలగిపోయే అవకాశాలేమైనా ఉన్నాయా? అనే ప్రశ్న ఇప్పుడు ప్రధానంగా తలెత్తుతోంది. ఆ క్రమంలో రాహుల్ తరహా పరిస్థితులు ఎదుర్కొన్న లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్ కేసును నిశితంగా పరిశీలిస్తే కొంత వరకు సమాధానం దొరుకుతుంది.
అనర్హత వేటు పడిన ఫైజల్ కేసు ఇలా..(Disqualified)
పి.పి. మహమ్మద్ ఫైజల్ నేషనలిస్ట్ కాంగ్రెస్(Congress) పార్టీ (ఎన్సీపీ) నేత. ఆయన 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో లక్షద్వీప్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. అయితే 2009 లోక్సభ ఎన్నికల సమయంలో మహమ్మద్ సలీహ్ అనే కాంగ్రెస్ నాయకుడిపై దాడి చేశారన్న ఆరోపణలపై ఫైజల్పై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులో విచారణ సుదీర్ఘంగా సాగింది. చివరకు ఈ ఏడాది జనవరి 10న కవరత్తీ సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. హత్యాయత్నం కేసులో ఫైజల్ను దోషిగా తేల్చింది. పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దీంతో ఆయనపై అనర్హత వేటు (Disqualified)వేస్తున్నట్లు లోక్సభ సచివాలయం ఈ ఏడాది జనవరి 13న ఓ ప్రకటన వెలువడింది. ఫైజల్పై వేటు కారణంగా ఖాళీ అయిన లక్షద్వీప్ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.
హైకోర్టులో ఫైజల్ ట్విస్ట్
సెషన్స్ కోర్టు తీర్పుపై వెంటనే కేరళ హైకోర్టులో ఫైజల్ సవాలు చేశారు. అక్కడ ఆయనకు ఉపశమనం లభించింది. సెషన్స్ కోర్టు తీర్పును ఉన్నత న్యాయస్థానం నిలిపివేసింది. స్టే కారణంగా ఆయనకు అనర్హత వేటు వర్తించదని తెలిపింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఫైజల్పై అనర్హత వేటు(Disqualified)తో తలెత్తే అసాధారణ పరిణామాల దృష్ట్యా తాము ఆ నిర్ణయం తీసుకున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. దేశ ఖజానాకు భారమయ్యే ఉప ఎన్నికను నివారించేందుకు ఇలా చేయడం అవసరమని చెప్పింది. ఉప ఎన్నికల వల్ల లక్షద్వీప్లో అభివృద్ధి పనులు కొన్ని వారాలపాటు ఆగిపోతాయంది. కొత్తగా ఎన్నికయ్యే ఎంపీ పదవీకాలం కూడా తక్కువే ఉంటుందని వ్యాఖ్యానించడం గమనార్హం.
Also Read : Rahul Disqualified : చింపిన ఆర్డినెన్స్ రాహుల్ పై వేటేసింది.!
ప్రజాప్రతినిధులకు రెండేళ్లు, అంతకంటే ఎక్కువ శిక్ష పడితే అనర్హత వేటు ఆటోమేటిక్గా అమల్లోకి వస్తుంది. పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించలేమని ఆనాడు కేంద్రం చేసిన వాదనలను హైకోర్టు నిరాకరించింది. లోక్ప్రహారీ వర్సెస్ కేంద్ర ఎన్నికల సంఘం కేసులో 2018 నాటి సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ఉన్నత న్యాయస్థానం గుర్తుచేసింది. అప్పటి నిర్ణయం ప్రకారం ప్రజాప్రతినిధిని దోషిగా తేల్చడంపై స్టే విధిస్తే, అనర్హత వేటు (Disqualified)వర్తించదని స్పష్టం చేసింది. మరోవైపు లక్షద్వీప్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని ఫైజల్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఫలితంగా ఉప ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది.
న్యాయం చెప్పినా శాసనం మారలేదు
ఫైజల్కు అనర్హత వేటు వర్తించదని హైకోర్టు స్పష్టం చేసినప్పటికీ ఆయన సభ్యత్వాన్ని లోక్సభ సచివాలయం పునరుద్ధరించలేదు. ఫలితంగా ఈ కేసులో ఉన్నత న్యాయస్థానం ఆదేశాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధులు దోషిగా తేలి రెండేళ్లు, అంతకంటే ఎక్కువ శిక్ష పడితే అనర్హత వేటు పడుతుందని ఓ తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేయగా, అప్పీలుపై స్పష్టత వచ్చేవరకూ అది వర్తించదని హైకోర్టు పేర్కొంది. ఈ సందిగ్ధత నడుమ రాహుల్ అప్పీలుకు వెళ్తే ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
జైలు శిక్ష తర్వాత లోక్సభకు రాహుల్
మోదీ ఇంటిపేరును కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకుగానూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి జైలుశిక్ష పడిన నేపథ్యంలో శుక్రవారం ఆయన పార్లమెంటుకు వస్తారా? దూరంగా ఉంటారా? అనే ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఉదయమే పార్లమెంటు ప్రాంగణంలో జరిగిన పార్టీ ఎంపీల సమావేశానికి రాహుల్ హాజరయ్యారు. ఆ తర్వాత లోక్సభకూ వెళ్లారు. అదానీ వ్యవహారంపై ఆందోళనలు కొనసాగడంతో సభ సమావేశమైన కొన్ని క్షణాలకే వాయిదా పడింది. దీంతో రాహుల్ పార్లమెంటును విడిచి వెళ్లారు. అప్పుడే రాహుల్ మీద అన్హత వేటు వేస్తూ లోక్ సభ సచివాలయం నిర్ణయాన్ని వెల్లడించింది. ఇదంతా చకచకా జరిగపోవడాన్ని రాజకీయ కోణం నుంచి కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తోంది. సానుభూతి కోసం కాంగ్రెస్ పలు రకాల ఆందోళనలకు దిగింది.
Also Read : Rahul Gandhi Disqualified: రాహుల్ పై అనర్హత వేటు
Related News
Chandrachud : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సీఎం రేవంత్రెడ్డి భేటీ
Chandrachud: సుప్రీంకోర్టు(Supreme Court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్(Chief Justice is Justice DY Chandrachud)ను తెలంగాణ(telangana)ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(CM Revanth Reddy) మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని తాజ్ ఫలక్నుమా(Taj Falaknuma)లో ఉన్న ఆయనను కలిసిన రేవంత్రెడ్డి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాజేంద్రనగర్లో వంద ఎకరాల్లో నిర్మించనున్న నూతన హైకోర్టుకు సంబంధించి ఇద్�