కాంగ్రెస్పై ‘మహామృత్యుంజయ’ అస్త్రం
పంజాబ్ లో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్డుపై 20 నిమిషాలు నిలిచిపోయిన అంశంపై బీజేపీ రాజకీయ గేమ్ ను ప్రారంభించింది. కాంగ్రెస్ పై మహా మృత్యుంజయ అస్త్రాన్ని బయటకు తీసింది. `ప్రాణాలతో తిరిగి వెళుతున్నా..మీ సీఎంకు చెప్పిండి..` అంటూ మోడీ పంజాబ్ పోలీస్ ఉన్నతాధికారులతో వ్యాఖ్యానించడం సంచలనం కలిగిస్తోంది
- By CS Rao Published Date - 02:04 PM, Thu - 6 January 22
పంజాబ్ లో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్డుపై 20 నిమిషాలు నిలిచిపోయిన అంశంపై బీజేపీ రాజకీయ గేమ్ ను ప్రారంభించింది. కాంగ్రెస్ పై మహా మృత్యుంజయ అస్త్రాన్ని బయటకు తీసింది. `ప్రాణాలతో తిరిగి వెళుతున్నా..మీ సీఎంకు చెప్పిండి..` అంటూ మోడీ పంజాబ్ పోలీస్ ఉన్నతాధికారులతో వ్యాఖ్యానించడం సంచలనం కలిగిస్తోంది. ప్రధాని మోడీని చంపాలని పంజాబ్ లో కుట్ర జరిగినట్టుగా బీజేపీ ఫోకస్ చేస్తోంది. అ క్రమంలోనే మోడీ సుదీర్ఘ జీవితం కోసం మహామృత్యంజయ మంత్రాన్ని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెరమీదకు తీసుకొచ్చాడు. ప్రధాని మోడీ భద్రత కోసం దేవాలయాల్లో మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించాలని బీజేపీ క్యాడర్కు దిశానిర్దేశం చేయడం గమనార్హం.
పంజాబ్లోని ఫిరోజ్పూర్లో ప్రధానమంత్రి షెడ్యూల్ చేసిన పర్యటన “భద్రతా లోపం” కారణంగా రద్దు అయింది. ఆ కారణంగా మోడీకి ప్రాణపాయం ఏర్పడేదని బీజేపీ ఫోకస్ చేస్తోంది. అందుకే, మధ్యప్రదేశ్ బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ లోకేంద్ర పరాశర్ భోపాల్లోని గుఫా ఆలయంలో ప్రధానమంత్రి భద్రత కోసం ప్రార్థనలకు దిగారు. మధ్యప్రదేశ్లోని మహాకాళేశ్వర్ , ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగాలతో సహా అన్ని పెద్ద శివాలయాలలో కూడా మహామృత్యుంజయ కీర్తనలు చేయాలని చౌహాన్ సూచించాడు.పంజాబ్లోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ మహిళా విభాగం రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ మహామృత్యుంజయ్ నినాదాలు చేస్తుంది. దేశ రాజధానిలోని కేంద్ర నాయకులలో, మాజీ ఎంపీ బైజయంత్ పాండా ఝండేవాలన్ ఆలయానికి, రాజ్యసభ ఎంపీ అరుణ్ సింగ్ ప్రీత్ విహార్లోని ఆలయానికి, ఎగువ సభ ఎంపీ దుష్యంత్ గౌతమ్ కన్నాట్ ప్లేస్లోని హనుమాన్ మందిర్కు వెళ్లారు. బీజేపీకి చెందిన యువమోర్చా దేశ వ్యాప్తంగా పాదయాత్రలకు దిగింది.
“కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా ప్రధాని జీవితాన్ని పణంగా పెట్టిందని బీజేపీ భావిస్తోంది. ప్రధాని కార్యాలయంపైనే కాదు ప్రజాస్వామ్యంపైనే దాడి అంటూ ఈ నేరపూరిత చర్యను బీజేవైఎం తీవ్రంగా ఖండిస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గురువారం సాయంత్రం 6 గంటలకు BJYM భారీ మషాల్ మార్చ్లను నిర్వహిస్తుంది” అని తేజస్వి సూర్య ట్వీట్ చేశారు. బిజెపి యువమోర్చా ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా మరియు రాష్ట్ర యూనిట్ యొక్క ఇతర సీనియర్ నాయకులు కూడా మహామృత్యుంజయను జపిస్తున్నారు.పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ ప్రధాని పర్యటన రద్దుపై “విచారాన్ని మరియు బాధను” వ్యక్తం చేశారు. తన ప్రభుత్వం వైపు నుండి ఎటువంటి భద్రతా లోపం లేదని సమర్థించారు.ఈ లోపాలపై విచారణ చేసేందుకు ఉన్నత స్థాయి కమిటీని పంజాబ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ, బీజేపీ మాత్రం మహామృత్యుంజయ మంత్రంతో దేశ వ్యాప్తంగా హోరెత్తిస్తోంది. మొత్తం మీద ప్రధాని మోడీ పంజాబ్ టూర్ వ్యవహారం కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ వార్ గా మారింది.
Related News
Rahul Gandhi: ఎలక్టోరల్ బాండ్స్ ఇండియాలో అతిపెద్ద స్కామ్ : రాహుల్ గాంధీ
Rahul Gandhi: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం ఎలక్టోరల్ బాండ్లను “అతిపెద్ద దోపిడీ కుంభకోణం”గా అభివర్ణించారు. బెదిరింపుల ద్వారా ప్రధానంగా కంపెనీలను లొంగదీసుకొని విరాళాలు సేకరించబడ్డాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బిజెపి) డబ్బు లూటీ చేసిందని ఆరోపించారు. చిల్లర గూండాలు డబ్బు దోచుకోవడంలో నిమగ్నమై ఉంటారని, సాధారణ భాషలో దీనిని దోపిడీ అని పిలుస్తారు ర