Gold And Silver Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. వరుసగా మూడో రోజు తగ్గిన ధరలు..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు మరింత దిగి వచ్చాయి. దేశంలో బంగారం ధరలు (Gold Price Today) ఈ విధంగా ఉన్నాయి. శుక్రవారం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.50,900గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.55,530గా నమోదైంది.
- Author : Gopichand
Date : 10-03-2023 - 8:50 IST
Published By : Hashtagu Telugu Desk
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు మరింత దిగి వచ్చాయి. దేశంలో బంగారం ధరలు (Gold Price Today) ఈ విధంగా ఉన్నాయి. శుక్రవారం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.50,900గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.55,530గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 67,400 పలుకుతోంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.
బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక శుక్రవారం (మార్చి 10, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!
Also Read: New iPhones: కొత్త కలర్స్ లో ఐఫోన్14, ఐఫోన్14 ప్లస్.. ధర, ఫీచర్స్ ఇవే?
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,050 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.55,680గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.51,550 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,250గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,900 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.55,530 వద్ద ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.50,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,530గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,580గా ఉంది.
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 65,450 ఉండగా, ముంబైలో రూ.65,450గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.67,400 ఉండగా, కోల్కతాలో రూ.65,450గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.67,400 ఉండగా, కేరళలో రూ.67,400గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.67,400 ఉండగా, విజయవాడలో రూ.67,400 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.