Indian Railways: ఎలాంటి ఛార్జీలు లేకుండా రైల్వే టికెట్లను వేరే తేదీ, సమయానికి ఇలా మార్చుకోండి!
దేశంలో ఎక్కువ మంది వాడే, ఇష్టపడే రవాణా వ్యవస్థ రైల్వేలు. అతి తక్కువ ఖర్చుతో పాటు ఎంతో సుఖవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని రైల్వేలు అందిస్తాయి.
- By Nakshatra Published Date - 07:26 PM, Fri - 6 January 23
Indian Railways: దేశంలో ఎక్కువ మంది వాడే, ఇష్టపడే రవాణా వ్యవస్థ రైల్వేలు. అతి తక్కువ ఖర్చుతో పాటు ఎంతో సుఖవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని రైల్వేలు అందిస్తాయి. అందుకే దేశంలో ఎక్కువ మంది రైల్వేలో ప్రయాణించడానికి ఇష్టపడుతుంటారు. అయితే రైల్వేల్లో చాలా మార్పులు వస్తున్నాయి. గతంలో మాదిరిగా కాకుండా అవసరాలకు తగ్గట్టుగా రైల్వేలో మార్పులు వస్తున్నాయి.
రైల్వేలో ప్రయాణించే వారు ముందుగా అనుకున్న తేదీకి తమ టికెట్లను బుక్ చేసుకుంటూ ఉంటారు. అయితే కొన్నిసార్లు అనుకున్న సమయానికి ప్రయాణించడం కుదరకపోతే.. ఆ టికెట్లను క్యాన్సిల్ చేసి, వేరే తేదీకి టికెట్లను బుక్ చేసుకుంటారు. దీని వల్ల క్యాన్సిలేషన్ ఛార్జీలను ప్రయాణికులు భరించాల్సి వచ్చేది. కానీ రైల్వే తాజాగా కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రకారం క్యాన్సిలేషన్ ఛార్జీలు లేకుండా టికెట్లను వేరే తేదీకి మార్చుకునే అవకాశం కలుగుతోంది.
రైల్వే అందిస్తున్న కొత్త సేవల ప్రకారం ఆఫ్ లైన్ లో టికెట్లను కొంటే ఈ సదుపాయం ఉంటుంది. ఇ-టికెటింగ్ విభాగం ఆన్ లైన్ బుకింగ్ తేదిని మార్చుకునే సదుపాయం ఉంది. ఇందు కోసం రైలు ప్రయాణానికి 48గంటల ముందు రిజర్వేషన్ కౌంటర్ కి వెళ్లి టికెట్ ని సరెండర్ చేయాలి. అదే సమయంలో మీరు ఏ రోజు, ఏ సమయంలో ప్రయాణించాలని అనుకుంటున్నారో రిజర్వేషన్ కౌంటర్ లో తెలియజేయలి.
ఇక రైల్వే కౌంటర్ లో తేదీ మార్పు గురించి చెప్పడంతో పాటు ఒకవేళ మీరు మీరు బుక్ చేసుకున్న టికెట్ క్లాస్ ని అప్ గ్రేడ్ చేయాలనుకుంటే అది కూడా చేసుకోవచ్చు. ఇక రైల్వే అధికారులు మీరు అడుగుతున్న సమాయానికి టికెట్లు అందుబాటులో ఉంటే అదే రోజు, అదే సమయానికి టికెట్లను సర్దుబాటు చేస్తారు. దీని కోసం ఎలాంటి ఛార్జీలను వేయరు. ఈ సదుపాయాన్ని కన్ఫర్మ్ టికెట్ ఉన్న వారితో పాటు ఆర్ఏసీ, వెయిటింగ్ లిస్ట్ లోని వాళ్లు సైతం వినియోగించుకోవడానికి రైల్వే అనుమతిస్తోంది. మరి మీరు కూడా ఒకవేళ టికెట్లు బుక్ చేసుకొని, ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటే.. క్యాన్సిల్ చేయకుండా ఇలా చేస్తే సరిపోతుంది.
Related News
Vistadome Coach: ప్రయాణికులకు భిన్నమైన అనుభూతి.. విస్టాడోమ్ కోచ్ల గురించి తెలుసా..?
భారతీయ రైల్వేలను ఆధునీకరించే రేసు శరవేగంగా సాగుతోంది. దేశానికి జీవనాడి అని పిలుచుకునే రైల్వేలు ఇప్పుడు కొత్త రైళ్లు, ఆధునిక సౌకర్యాలతో కూడిన స్టేషన్లతో ప్రజల హృదయాలను కొల్లగొడుతున్నాయి.