బీజేపీ, ఆర్ఎస్ఎస్ మధ్య కోల్డ్ వార్.. రైతు ఉద్యమ వేడిలో యూపీ బీజేపీ
- By Dinesh Akula Published Date - 03:12 PM, Fri - 22 October 21
జాతీయ వాద పార్టీ కన్నా, బీజేపీకి మతతత్త్వ పార్టీ అనే ముద్ర బలంగా ఉంది. దాన్ని దూరంగా పెట్టాలని ప్రధాని మోడీ యూపీ, పంజాబ్ బీజేపీ లీడర్లకు దిశానిర్దేశం చేశారు. అంతేకాదు, ఆర్ఎస్ఎస్ లీడర్లతోనూ ఆ విషయాన్ని పంచుకున్నారు. కానీ, హిందూ సమాజాన్ని ఏకం చేయడం ప్రధాన ఎజెండాగా ఆర్ఎస్ఎస్ తీసుకుంది. ఇటీవల పలుమార్లు ఢిల్లీలోని నోయిడా కార్యాలయంలో జరిగిన సమావేశం కూడా ఇదే అంశం మీద చర్చించినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతోంది. పంజాబ్, యూపీ, హర్యానా రాష్ట్రాల రైతులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఏడాదికిపైగా ఈ ఉద్యమం కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్లోని లకీపూర్ వద్ద ఇటీవల జరిగిన రైతుల మరణాలతో పంజాబ్, పశ్చిమ యూపీ రైతులు ఆగ్రహంగా ఉన్నారు. వ్యవసాయ చట్టాల ఉద్యమంలో పాల్గొంటోన్న రైతులను ఖలీస్తానీ ఉద్యమకారులుగా బీజేపీలోని ఒక వర్గం ప్రచారం చేస్తోంది. మరో వర్గం అలాంటి ప్రచారాన్ని లోలోన వ్యతిరేకిస్తోంది. ఈ అంశంపై బీజేపీ లీడర్ల మధ్య అంతర్గతంగా దూరం పెరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో ఇలాంటి ప్రచారం ఓటు బ్యాంకును దెబ్బతీస్తుందని వాదన. అందుకే, ప్రస్తుతం వ్యవసాయ చట్టాల క్రమంలో నెలకొన్ని ఉద్రిక్తత వాతావరణాన్ని తగ్గించాలని ఆర్ఎస్ఎస్ భావిస్తోంది.
వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీకి చాలా కీలకం. ఆ ఎన్నికలు సాధారణ ఎన్నికల సెమీ ఫైనల్స్ గా భావిస్తున్నారు. ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రావాలని భావిస్తోంది. ప్రస్తుతం రైతు చట్టాల ఉద్యమ నేపథ్యంలో పంజాబ్ ఫలితాల మీద ఆ పార్టీ పెద్దగా ఆశపెట్టుకోలేదు. కానీ, బీజేపీ ఉత్తరప్రదేశ్ ఫలితాల మీద భారీ అంచనాలను పెట్టుకుంది.
మతతత్త్వ ముద్ర నుంచి బీజేపీ బయట పడకుండా ఉంటే గెలుపు అసాధ్యమనే విషయాన్ని ఆ పార్టీ లీడర్లు సమావేశాల్లో బలంగా చెబుతున్నారు. అదే విషయాన్ని మోడీ, షా కూడా క్యాడర్ కు వివరిస్తోంది. అన్ని వర్గాల పార్టీగా బీజేపీని ప్రజల మధ్యకు తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. అందుకోసం బలహీన వర్గాలను కలుపుకుని బీజేపీ హిందూ సమాజాన్ని ఏకం చేయాలని ఆర్ఎస్ఎస్ సూచిస్తోంది.
వ్యవసాయంపై ఆధారపడ్డా జాట్ లు, సిక్కులు ఎక్కవగా పంజాబ్, పశ్చిమ యూపీల్లో ఉన్నారు. జాట్ ల మద్ధతు లేకుండా బీజేపీ గెలుపు పంజాబ్, యూపీల్లో అసాధ్యం. ఇప్పుడు వ్యవసాయ చట్టాలపై నెలకొన్ని ఉద్రిక్తతలను తగ్గించకపోతే బీజేపీ విజయం సాధ్యం కాదని ఆర్ఎస్ఎస్ భావిస్తోంది. మొత్తం మీద పశ్చిమ యూపీ ఫలితాలపై బీజేపీ బెంగ పెట్టుకుంది. ఆర్ఎస్ఎస్ చెబుతోన్న దిశానిర్దేశం, బీజేపీ అధిష్టానం వాలకం భిన్నంగా ఉండడం యూపీలో రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Tags
Related News
Akhilesh Yadav : విరాళాల కోసమే కరోనా వ్యాక్సిన్లకు అనుమతులిచ్చారు : అఖిలేష్
Akhilesh Yadav : తమ కంపెనీ కరోనా వ్యాక్సిన్ వల్ల కొందరిలో సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తిన మాట నిజమేనని ఇటీవల ఆస్ట్రాజెనెకా కంపెనీ ప్రకటించిన నేపథ్యంలో దానిపై అంతటా చర్చ జరుగుతోంది.