CAA Decoded : సీఏఏ వచ్చేసింది.. పౌరసత్వంపై గైడ్ లైన్స్.. టాప్ పాయింట్స్
CAA Decoded : ‘పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)-2019’ ఎట్టకేలకు మన దేశంలో అమల్లోకి వచ్చింది.
- By Pasha Published Date - 07:43 AM, Tue - 12 March 24
CAA Decoded : ‘పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)-2019’ ఎట్టకేలకు మన దేశంలో అమల్లోకి వచ్చింది. వాస్తవానికి 2019 సంవత్సరంలోనే ‘సీఏఏ-2019’ చట్టం పార్లమెంటు, రాష్ట్రపతి నుంచి ఆమోదం పొందింది. సీఏఏ-2019 చట్ట రూపం దాల్చిన నాలుగేళ్ల తర్వాత… సోమవారం (మార్చి 11న) సాయంత్రం దాని అమలుపై కేంద్ర సర్కారు గైడ్ లైన్స్ విడుదల చేసింది. ఆ గైడ్ లైన్స్లోని టాప్ పాయింట్స్ను ఇప్పుడు చూద్దాం..
We’re now on WhatsApp. Click to Join
- పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ల నుంచి భారత్కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు మనదేశ పౌరసత్వాన్ని కల్పించడమే సీసీఏ-2019(CAA Decoded) లక్ష్యం. తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరం మన పౌరసత్వం ఇచ్చేస్తారు.
- 2014 డిసెంబరు 31 కంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఈ రూల్స్ వర్తిస్తాయి.
- వీరికి పౌరసత్వం మంజూరుకు సంబంధించిన ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది.
- పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ల నుంచి వచ్చినవారికి చట్టపరంగా పౌరసత్వం దక్కనున్నందున వారికి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోతాయి.
- నూతన చట్టం ప్రకారం మూడు దేశాల నుంచి భారత్కు వచ్చిన ఆరు మతాల వారిని చట్టవ్యతిరేక వలసదారులుగా గుర్తించరు. ఈ చట్టం కింద ప్రయోజనం పొందడానికి వీలుగా వారిని విదేశీయుల చట్టం- 1946, పాస్పోర్ట్ (ఎంట్రీ ఇన్ టు ఇండియా) చట్టం- 1920 నుంచి మినహాయించారు.
Also Read : Hussainsagar : రేపు హైదరాబాద్లో మరో అద్భుతం అవిష్కృతం కాబోతుంది..
- పౌరసత్వం మంజూరుకు 30 జిల్లాల కలెక్టర్లకు, 9 రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులకు ఇదివరకే అధికారాలిచ్చారు.
- అస్సాం, పశ్చిమబెంగాల్లలో సున్నిత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అక్కడ మాత్రం ఏ జిల్లా అధికారులకూ ఇలాంటి అధికారం ఇవ్వలేదు.
- సీఏఏ కింద భారత పౌరసత్వాన్ని కోరుతూ వచ్చే దరఖాస్తులపై నిర్ణయం తీసుకునే సాధికార కమిటీకి జనాభా లెక్కల డైరెక్టర్ నేతృత్వం వహిస్తారు.
- ఆ మూడు దేశాల నుంచి వచ్చిన ముస్లిమేతర మైనారిటీలు ఇక మన దేశంలో ఎక్కడికైనా రాకపోకలు సాగించొచ్చు. ఆస్తులు కొనొచ్చు.
- మతపరమైన వేధింపులను తట్టుకోలేక 3 దేశాల్లో హింసకు గురవుతూ భారత్లో తప్పితే ప్రపంచంలో మరెక్కడా ఆశ్రయం పొందలేనివారికి రక్షణ కల్పించడానికి ఈ చట్టం తీసుకొచ్చినట్లు కేంద్ర సర్కారు చెబుతోంది.
- సీఏఏ చట్టం బయటి నుంచి వచ్చినవారికి పౌరసత్వం ఇస్తుందేగానీ.. భారతీయ పౌరుల పౌరసత్వాన్ని రద్దు చేయదు.
- సాధారణ పరిస్థితుల్లో పౌరసత్వం పొందాలంటే దరఖాస్తు చేసుకోవడానికి ముందు కనీసం 11 ఏళ్లపాటు భారత్లో నివసించాలి. లేదంటే కేంద్ర ప్రభుత్వ సర్వీసులలో పనిచేయాలి.
- అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ నుంచి వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు మాత్రం నివాస అర్హతను అయిదేళ్ల కాలానికి కుదించారు. వారిపై అక్రమ వలస కేసులన్నీ మూసేస్తారు.
Also Read :Dharani Portal: ధరణి దరఖాస్తుల గడువు పెంపు
Related News
Lok Sabha Polls 2024: ఒవైసీ సంచలన నిర్ణయం.. అన్నా డీఎంకేతో పొత్తు ఖరారు
లోకసభ ఎన్నికల ముందు ఎంఐఎం పార్టీ అధినేత ఒవైసీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు ఉంటుందని, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వరకు పొత్తు కొనసాగుతుందని అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు.