G20 Logo Issue : G20 సదస్సు `లోగో` లడాయి
భారత్ దేశం ఈ ఏడాది నిర్వహించబోయే G20 సదస్సు `లోగో` కాంగ్రెస్, బీజేపీ మధ్య వివాదాన్ని రేపుతోంది.
- By CS Rao Published Date - 05:20 PM, Wed - 9 November 22
భారత్ దేశం ఈ ఏడాది నిర్వహించబోయే G20 సదస్సు `లోగో` కాంగ్రెస్, బీజేపీ మధ్య వివాదాన్ని రేపుతోంది. కమలంతో కూడిన `లోగో`ను విడుదల చేయడాన్ని కాంగ్రెస్ వెటరన్ లీడర్లు తప్పుబడుతున్నారు. అంతేకాదు, 70 ఏళ్ల క్రితం రూపొందించిన కాంగ్రెస్ జెండా జాతీయ జెండాను పోలి ఉందని నెహ్రూ వ్యతిరేకించిన విషయాన్ని మాజీ కేంద్ర మంత్రి జైరామ్ రమేష్ గుర్తు చేస్తున్నారు. కానీ, మోడీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రమోషన్ కోసం జీ 20 `లోగో`ను వాడుకోవడం సిగ్గుచేటని ట్వీట్ చేయడం వివాదానికి దారితీసింది.
బీజేపీ ఎన్నికల గుర్తు G20 అధ్యక్ష పదవికి అధికారిక చిహ్నంగా మారిందని జై రామ్ రామేష్ విమర్శించారు. అందుకు ప్రతిగా కేంద్ర సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు కంచన్ గుప్తా రంగంలోకి దిగారు. “70 సంవత్సరాల క్రితం జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కమలాన్ని భారతదేశ జాతీయ పుష్పంగా ప్రకటించారు. @Jairam_Ramesh మీకు కూడా అది ‘షాకింగ్’ అనిపించిందా? ఆ తరువాత కాంగ్రెస్ ప్రభుత్వాలు కమలం గుర్తుతో కరెన్సీ నాణేలను విడుదల చేశాయి. అప్పుడు కూడా జాతీయ చిహ్నం కమలం ఉంది.` అంటూ ట్వీట్ చేశారు.
Over 70 years ago, Nehru rejected the proposal to make Congress flag the flag of India. Now,BJP's election symbol has become official logo for India's presidency of G20! While shocking,we know by now that Mr.Modi & BJP won’t lose any opportunity to promote themselves shamelessly!
— Jairam Ramesh (@Jairam_Ramesh) November 9, 2022
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం భారత జి 20 అధ్యక్ష పదవికి సంబంధించిన లోగోను ఆవిష్కరించారు, అందులో కమలం పువ్వు (ఇది కూడా బిజెపి పార్టీ చిహ్నం)లోని ఏడు రేకులు భూగోళంలోని ఏడు ఖండాలను, ఏడు సంగీత స్వరాలను సూచిస్తాయని, జీ20 ప్రపంచాన్ని సామరస్యంగా తీసుకువస్తుందని మోదీ అన్నారు. “భారతదేశం G20 ప్రెసిడెన్సీ చారిత్రాత్మక సందర్భంగా నేను దేశప్రజలను అభినందిస్తున్నాను. ‘వసుధైవ కుటుంబం’ ప్రపంచం పట్ల భారతదేశం కరుణకు సంతకం. లోటస్ భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని మరియు ప్రపంచాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో విశ్వాసాన్ని చిత్రీకరిస్తుంది, ”అని మోడీ అన్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా, కమలం ఇంకా వికసిస్తుందని ప్రధాని మోదీ చెప్పడాన్ని రాజకీయ కోణం నుంచి కాంగ్రెస్ చూస్తోంది.
Also Read: Rahul Gandhi Look Viral: హిందూత్వ లుక్ లో రాహుల్.. ఫొటో వైరల్!
Related News
PM Modi: కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల శక్తి బీజేపీ-ఎన్డీయేకు మాత్రమే ఉంది : ప్రధాని మోదీ
PM Modi: తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలకు దూరదృష్టి లోపించిందని, బీజేపీ-ఎన్డీయే మినహా మరే రాజకీయ శక్తి ఈసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ 15 సీట్లకు మించి గెలవదు. కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా హాఫ్ సెంచరీ మార్కును కూడా దాటలేకపోతోంది. పశ్చిమబెంగాల్ లో కూడా వామపక్షాల పరిస్థితి ఏంటో �