Rs. 500 Note : రూ.500 నోటుపై రాముడి చిత్రాన్ని ముద్రించాలని బిజెపి నేతల డిమాండ్
- By Sudheer Published Date - 10:06 AM, Sat - 20 January 24
మరికొద్ది గంటల్లో అయోధ్య రామ మందిరం (Ayodhya Ram Mandir) ప్రారంభం వేళ బిజెపి నేతలు సరికొత్త డిమాండ్ ను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇండియన్ కరెన్సీ నోట్ల ఫై ఉన్న గాంధీ స్థానంలో శ్రీరాముడి ఫోటో ముద్రించాలని..ఇది మా ఒక్క కోరిక కాదని , యావత్ 100 కోట్ల హిందువుల కోరిక అని వారంతా వాపోతున్నారు.
అయోధ్య రామమందిరం ప్రారంభం రేపు కానుంది. ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం దేశ వ్యాప్తంగా భక్తులు ఎదురుచూస్తున్నారు. శిల్పి అరుణ్ యోగ్రాజ్ చెక్కిన బాల రాముడి శిల్పం ఇప్పటికే గర్భగుడికి చేరింది. రామ నామ స్మరణతో అయోధ్య తో పాటు దేశం మొత్తం మునిగి తేలుతున్నారు. రామ మందిర ప్రారంభోత్సవంలో.. దేశం మొత్తం ఈ కార్యక్రమంలో పాలు పంచుకోనుంది. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం ఇప్పటికే చాలామందికి ఆహ్వానాలు అందాయి.
ఈ క్రమంలో గత వారం రోజులుగా శ్రీరాముని చిత్రాలతో ఉన్న రూ. 500 నోటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) విడుదల చేయబోతుందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం, శ్రీరాముని చిత్రాలతో పాటు రూ. 500 నోటు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ నోటు పై మహాత్మ గాంధీ బొమ్మ ఉన్న చోట రాముని బొమ్మ…ఎర్ర కోట ఫోటో ఉన్న చోట రామ మందిరం ఫోటో తో కూడిన కొన్ని ఫేక్ నోట్స్ వైరల్ గా మారాయి. దీంతో చాలామంది నిజంగానే RBI ఈ నోట్స్ ను రిలీజ్ చేయబోతోందని అంత భావిస్తున్నారు. ఈ క్రమంలో RBI క్లారిటీ ఇచ్చింది. రాముడితో కూడిన నోట్స్ ముద్రించడం లేదని..సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలో బిజెపి నేతలు సరికొత్త డిమాండ్ను తెరమీదకు తీసుకొస్తున్నారు. భారత కరెన్సీ నోట్లపైనా రాముడి బొమ్మ ముద్రించాలని డిమాండ్ చేస్తున్నారు.తాజాగా.. ఈ అంశంపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. రూ.500 నోటుపై రాముడి చిత్రాన్ని ముద్రించాలని డిమాండ్ చేశారు. ఇది తన ఒక్కడి డిమాండ్ కాదని.. 100 కోట్ల మంది హిందువుల అభిప్రాయమని చెప్పారు. అమెరికా, థాయ్లాండ్, ఇండోనేషియా వంటి దేశాల కరెన్సీ నోట్లపై హిందూ దేవతల ఫొటోలు ముద్రించుకున్నారని గుర్తుచేశారు. ఇండియాలో 80 శాతానికి పైగా హిందువులు ఉన్న మన దేశంలో కరెన్సీ నోట్లపై రాముడి బొమ్మ ఎందుకు ముద్రించకూడదని ఆయన ప్రశ్నించారు. మరి దీనిపై కేంద్రం ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా అనేది చూడాలి.
Read ALso : Ayodhya Ram Mandir: జనవరి 22న ఏయే రాష్ట్రాలు సెలవు ప్రకటించాయో తెలుసా..? ఈ సంస్థలకు హాఫ్ డే సెలవు..!
Related News
Ayodhya Ram Temple: మూడు నెలల్లో అయోధ్య రామయ్యను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా..?
జనవరి 22, 2024న రామజన్మభూమి అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగింది.