BJP : బీజేపీని కలవరపెడుతున్న 74 వేల పోలింగ్ బూత్ లు, 100 లోక్ సభ నియోజకవర్గాలు
2024లో కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ పక్కా స్కెచ్ తో ముందుకెళుతోంది.
- By Hashtag U Published Date - 11:29 AM, Wed - 27 April 22
2024లో కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ పక్కా స్కెచ్ తో ముందుకెళుతోంది. ఏఏ లోక్ సభ స్థానాల్లో పార్టీ బలహీనంగా ఉందో ముందే అంచనా వేస్తోంది. దానిని బట్టి అక్కడ ఏ విధంగా విజయావకాశాలను మెరుగుపరుచుకోవాలో ఆలోచిస్తోంది. దీనికోసం జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, ఉపాధ్యక్షులు బైజయంత్ పాండా, దిలీప్ ఘోష్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు లాల్ సింగ్ ఆర్యలతో ఓ టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటుచేసింది.
దేశంలో బీజేపీ స్ట్రాటజీ అంతా పోలింగ్ బూత్ ల వారీగా ఉంటుంది. అలా లెక్క చూస్తే.. సుమారు 74 వేల పోలింగ్ బూత్ లలో పార్టీ పరిస్థితి ఎలా ఉందో బీజేపీకి అర్థమైంది. 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లో వెలువడిన ఫలితాలను బట్టి ఓ అంచనాకు వచ్చింది. అందుకే అలా బలహీనంగా ఉన్నచోట అక్కడ పార్టీని బలోపేతం చేసేలా చర్యలు చేపట్టింది. యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసింది. దీనిని త్వరలోనే అమలు చేయనుంది.
బీజేపీ దేశంలో ఇప్పటివరకు ఓ 100 లోక్ సభ నియోజకవర్గాల్లో అస్సలు గెలవలేదు. దానికి కారణాలు తెలుసుకోవడానికి ఈ బృందం ఓ మూడు నెలల పాటు పర్యటనలు చేయనుంది. స్థానిక బీజేపీ నేతలతో సమావేశాల తరువాత ఓ అంచనాకు రానుంది. అక్కడ గెలవడానికి అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి వీలుగా టాస్క్ ఫోర్స్ స్కెచ్ లు రెడీ చేస్తుంది. ఈ పర్యటనలు కూడా వచ్చే వారం నుంచి మొదలవ్వనున్నాయి.
బీజేపీ ఎక్కువగా దక్షిణాదిలోనే బలహీనంగా ఉంది. అందుకే అక్కడి నుంచే యాక్షన్ ప్లాన్ ను స్టార్ట్ చేయడానికి వీలుగా పావులు కదుపుతోంది. కానీ దక్షిణాదిలోని తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని పూర్తిస్థాయిలో నమ్మే పరిస్థితి లేదు. విభజన హామీల అమలు విషయంలో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని ప్రజలు భావిస్తున్నారు. మరి ఈ అసంతృప్తిని ఎలా అధిగమిస్తుందో చూడాలి. మొత్తానికి ప్రశాంత్ కిషోర్ ఎఫెక్ట్ తో బీజేపీ గ్రౌండ్ వర్క్ ని పెంచింది.
Related News
Annamalai: ఏపీలో కూటమి గెలుపును అధికారికంగా ప్రకటించడమే మిగిలింది: అన్నామలై
కోయంబత్తూరులో బీజేపీ ఎంపీ అభ్యర్థి అన్నామలై (Annamalai)తో కలిసి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.