HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Bihar Assembly Elections 2025 Survey Trends Tejashwi Vs Nitish

InkInsight : బీహార్ లో మరోసారి ఎన్డీయేనే.. తాజా సర్వే రిపోర్ట్..

InkInsight : బీహార్ రాష్ట్ర రాజకీయ రంగస్థలం ఇప్పుడు హీటెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ, రాజకీయం కుదిపేసే ఎత్తులు, ఎన్నికల ప్రచార రణనీతులు, అంచనాలు.. అన్నీ కలగలిసి ఒక ఆసక్తికర రాజకీ యుద్ధానికి రంగం సిద్ధమవుతోంది.

  • By Kavya Krishna Published Date - 03:22 PM, Mon - 7 July 25
  • daily-hunt
Inkinsight
Inkinsight

InkInsight : బీహార్ రాష్ట్ర రాజకీయ రంగస్థలం ఇప్పుడు హీటెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ, రాజకీయం కుదిపేసే ఎత్తులు, ఎన్నికల ప్రచార రణనీతులు, అంచనాలు.. అన్నీ కలగలిసి ఒక ఆసక్తికర రాజకీ యుద్ధానికి రంగం సిద్ధమవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేస్తుందా? అన్న ఉత్కంఠ మధ్య, పార్టీలు మాత్రం ప్రచార యంత్రాన్ని ఇప్పటికే వేగంగా ఆరంభించాయి.

ఈసారి ఎన్నికలు కేవలం ఓట్ల పందెం మాత్రమే కాదు… గద్దెకు వెళ్లే దారిలో ‘తేజస్వి vs నితీష్’ పోరుగా మారుతోంది. మున్ముందు ఎవరు బీహార్ ముఖ్యమంత్రి అవుతారు? అనే ప్రశ్న ప్రస్తుతం రాజకీయంగా అత్యంత హాట్ టాపిక్. ఇందులో తాజాగా విడుదలైన ఓ అభిప్రాయ సర్వే కొత్త వింతలను బయటపెట్టింది.

సర్వే చెబుతున్నదేమిటి?

ఇంక్ ఇన్‌సైట్ సంస్థ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం, బీహార్‌ ప్రజలు మళ్లీ ఎన్డీఏ కూటమికే పట్టం కడుతున్నట్లే కనిపిస్తోంది. సర్వే ఫలితాల ప్రకారం.. ఎన్డీఏ కూటమికి 48.9% ప్రజలు మద్దతు ఇస్తున్నారని వెల్లడైంది. అంటే బీజేపీ, జేడీయూ, ఇతర మిత్రపక్షాలు కలసి మరోసారి అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.

అయితే, ఆసక్తికర విషయం ఏమిటంటే.. ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాత్రం ప్రజలు తేజస్వి యాదవ్ వైపు మొగ్గు చూపుతున్నారు. సర్వే ప్రకారం 38.3% మంది తేజస్విని సీఎంగా చూడాలనుకుంటున్నారు, అయితే నితీష్ కుమార్‌కు మద్దతు ఇచ్చింది కేవలం 35.6% మంది మాత్రమే.

మరిన్ని వివరాల్లోకి వెళితే.. మహాఘటబంధన్ (ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు) కు 35.8% ఓటు శాతం ఉందని సర్వే చెబుతోంది. తేజస్వి, ప్రధానంగా యువత, ముస్లింలు, షెడ్యూల్డ్ తెగల మద్దతును గట్టిగా సంపాదించుకున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు, నితీష్ నేతృత్వంలోని ఎన్డీఏకి మహిళలు, ఇతర సామాజిక వర్గాలు మద్దతిస్తున్నట్లు సర్వే అంచనా వేసింది.

యువతే కీ రోల్

ఈసారి బీహార్ ఎన్నికల్లో 90% పైగా ఓటింగ్ ప్రభావం యువత నుంచే వచ్చే అవకాశముంది. నూతన ఓటర్లు, విద్యార్థులు, ఉపాధి కోసం ఎదురు చూస్తున్న యువత – వీరిలో ఎవరి పక్షంలో గాలి వీస్తుందనేది ఎన్నికల ఫలితాల్ని శాసించే అంశం. ఈ నేపథ్యంలో పార్టీలు అన్నీ యువతనే టార్గెట్ చేస్తూ హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఉపాధి, ఉచిత ల్యాప్‌టాప్‌లు, స్కాలర్‌షిప్‌లు, యువ పారిశ్రామికవేత్తల ప్రోత్సాహక పథకాలు.. ఇవన్నీ ఎన్నికల ప్రచారంలో హాట్ టాపిక్స్ అయ్యాయి.

మరి ప్రశాంత్ కిషోర్?

తేజస్వి, నితీష్ పోరులో మరొక కీలక పాత్రధారి ప్రశాంత్ కిషోర్ కూడా పటిష్టంగా నిలవాలనుకుంటున్నాడు. కేవలం 2.3% మంది మాత్రమే ఆయనను సీఎంగా కోరుకున్నా, యువతలో ఆయన ప్రసార శక్తి ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చిరాగ్ పాశ్వాన్ కు 4.6% మద్దతు ఉంది.

తాజా పరిస్థితి ఏమిటంటే…

బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకుగాను నవంబర్-డిసెంబర్ లో ఎన్నికలు జరగనున్నట్లు ఊహిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వేడి పెరిగింది. అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలు, సామాజిక వర్గాల లెక్కలు అన్నీ పార్టీలను బిజీగా మార్చేశాయి.

అంతిమంగా చెప్పాలంటే.. ఈసారి బీహార్ ఎన్నికల్లో పోటీ కఠినంగా మారనుంది. ఓ వైపు తేజస్వి యువత ఆకర్షణగా ఎదుగుతుండగా, మరోవైపు ఎన్డీఏకి ఉన్న బలమైన కూటమి ఆధిక్యం మళ్లీ అధికారం తెచ్చేలా కనిపిస్తోంది. ఏ పార్టీ నాయ‌కత్వం అగ్రస్థానంలో నిలుస్తుందో చూడాలంటే మాత్రం ఎన్నికల వేళ వచ్చేదాకా వేచి చూడాల్సిందే..!

Kingdom : ‘రౌడీ’ ఫ్యాన్స్ రావాలమ్మ.. ఈరోజే రిలీజ్ డేట్ పై క్లారిటీ..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bihar 2025 assembly
  • bihar cm race
  • Bihar Elections
  • bihar opinion poll
  • bjp nda alliance
  • mahagathbandhan
  • nitish kumar
  • prashant kishor politics
  • Tejashwi Yadav
  • youth voters

Related News

Why the eight-year delay? ..Chidambaram's response on the Centre's reduction in GST rates..

Chidambaram : ఎనిమిదేళ్ల ఆలస్యం ఎందుకు? ..కేంద్రం జీఎస్టీ రేట్లు తగ్గింపు పై చిదంబరం స్పందన..

ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం సరికొత్త మార్గాన్ని చూపిస్తున్నప్పటికీ, దీని అవసరం 2017లోనే ఉన్నది. అప్పటినుంచి జీఎస్టీ డిజైన్, రేట్లు ప్రజా ప్రయోజనానికి విరుద్ధంగా ఉన్నాయని మేము అనేకసార్లు హెచ్చరించాం.

    Latest News

    • MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల

    • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

    • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

    • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

    • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd