HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Battle For India Will Be Decided In 2024 Not In Any State Poll Prashant Kishors Jibe At Modi

Prashant Kishor : 2024పై ‘మాన‌సిక’ సిద్ధాంతం

ఐదు రాష్ట్రాల ఫ‌లితాల‌ను సెమీఫైన‌ల్ గా బీజేపీ భావిస్తోంది.

  • By CS Rao Published Date - 03:07 PM, Fri - 11 March 22
  • daily-hunt
Modi Prashant Kishor
Modi Prashant Kishor

ఐదు రాష్ట్రాల ఫ‌లితాల‌ను సెమీఫైన‌ల్ గా బీజేపీ భావిస్తోంది. 2024 ఎన్నిక‌ల‌కు ట్రైల‌ర్ గా పోల్చుతూ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ విజ‌యోత్స‌వ స‌భ‌లో వినిపించాడు. అంతేకాదు, 2017 ఎన్నిక‌ల్లో యూపీలో స్వీప్ చేసిన బీజేపీ 2019 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యాన్ని గుర్తు చేశాడు. ఇదంతా విప‌క్షాల‌ను మాన‌సికంగా కుంగ‌దీయ‌డానికంటూ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ అంటున్నాడు. ఐదు రాష్ట్రాల ఫ‌లితాల చుట్టూ రాజ‌కీయ ఉన్మాదాన్ని బీజేపీ అల్లుతోంద‌ని పీకీ ట్వీట్ చేశాడు. ఆ మాయంలో ప‌డొద్ద‌ని విప‌క్షాల‌కు హిత‌వు ప‌లికాడు.

Battle for India will be fought and decided in 2024 & not in any state #elections

Saheb knows this! Hence this clever attempt to create frenzy around state results to establish a decisive psychological advantage over opposition.

Don’t fall or be part of this false narrative.

— Prashant Kishor (@PrashantKishor) March 11, 2022

ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను దేనిక‌దే చూడాలి. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను అసెంబ్లీకి పోల్చ‌లేం. అలాగే, అసెంబ్లీ ఫ‌లితాల‌ను లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు అన్వ‌యించ‌లేం. ఆయా రాష్ట్రాల్లో వ‌చ్చిన పూర్వ‌పు ఫ‌లితాల‌ను అవ‌లోకిస్తే, చాలా కొద్ది చోట్ల మాత్ర‌మే అసెంబ్లీ, లోక్ స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఏక‌రీతిగా క‌నిపిస్తాయి. స్థానిక సంస్థ‌ల ఫ‌లితాల‌కు, అసెంబ్లీ ఫ‌లితాలు దాదాపుగా ఎక్క‌డా స‌రిపోల్చ‌లేం. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఐదు రాష్ట్రాల ఫ‌లితాల‌ను 2024 సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ఎందుకు పోల్చుతారంటూ పీకే ప్ర‌శ్నిస్తున్నాడు.

అస‌లైన యుద్ధం 2024లో ఉంద‌ని పీకే అంటున్నాడు. వచ్చే లోక్‌సభ ఎన్నికలపై ఫలితాలపై ఐదు రాష్ట్రాల ప్ర‌భావం ఉండ‌ద‌ని చెబుతున్నాడు. సమాజ్‌వాదీ పార్టీ నేతృత్వంలోని రెయిన్‌బో సంకీర్ణాన్ని బుల్‌డోజింగ్‌ చేస్తూ బీజేపీ ఉత్తరప్రదేశ్‌లో తిరిగి అధికారంలోకి వచ్చింది. ఉత్తరాఖండ్, మణిపూర్ , గోవాలను కూడా అధికారాన్ని నిలబెట్టుకుంది. అయితే, కేజ్రీ వాల్ ఆధ్వ‌ర్యంలోని AAP పంజాబ్‌లో అద్భుతమైన విజయాన్ని సాధించింది. మూడు వంతుల మెజారిటీని గెలుచుకుంది.

2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించిన మరుసటి రోజే పీకే కీల‌క వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. నాలుగు రాష్ట్రాల్లో తమ పార్టీ విజయం రాబోవు సార్వత్రిక ఎన్నికల తీర్పును కూడా స్పష్టం చేసిందని గురువారం మోడీ అన్నాడు. ఆ విష‌యాన్ని రాజకీయ పండితులు గమనించాల‌ని కూడా సూచించాడు. 2019లో బీజేపీ విజయాన్ని 2017లో ఉత్తరప్రదేశ్ ఎన్నికల స్వీప్‌తో మోడీ ముడిపెట్టాడు.
“భారతదేశం కోసం యుద్ధం 2024లో జరుగుతుంది. ఏ రాష్ట్ర #ఎన్నికల్లో కాదు అని సాహెబ్‌కు ఇది తెలుసు! అందుకే ప్రతిపక్షంపై నిర్ణయాత్మక మానసిక ప్రయోజనాన్ని ఏర్పరచుకోవడానికి రాష్ట్ర ఫలితాల చుట్టూ ఉన్మాదం సృష్టించడానికి ఈ తెలివైన ప్రయత్నం. పడిపోకండి లేదా ఇందులో భాగం అవ్వకండి. తప్పుడు కథనం.“ అంటూ కిషోర్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 5 state elections
  • bjp
  • pm modi
  • prashant kishor

Related News

Bhatti Vikramarka

Deputy CM Bhatti Vikramarka Mallu : ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పీచ్..!

సింగరేణి కార్మికులకు 400 కోట్ల రూపాయల బోనస్ ఈనెల 18న రాష్ట్రంలో బిజెపికి వ్యతిరేకంగా జరుగుతున్న బీసీ బందులో యావత్ ప్రజానీకం, సకల వర్గాలు పాల్గొనాలి ప్రధాని మోడీ, రాష్ట్రపతి వద్ద బీసీ బిల్లు కోసం బిజెపి నాయకులు సమయం తీసుకోండి సీఎం నాయకత్వంలో అఖిలపక్షం ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధం సుప్రీంకోర్టు తీర్పు కాపీ వచ్చాక చర్చించి ఈనెల 23న క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకుంటాం మీడియా

  • Folk Singer Maithili Thakur

    Bihar Elections : 25 ఏళ్ల సింగర్ కు బీజేపీ ఎమ్మెల్యే టికెట్

  • PM Modi

    PM Modi : రూ. 13వేల కోట్ల పనులకు రేపు ప్రధాని శ్రీకారం

  • Bihar Elections

    Bihar Elections : బిహార్ ఎలక్షన్స్.. బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్

  • PM Modi

    PM Modi: ఈ నెల 16న కర్నూలుకు ప్రధాని మోదీ!

Latest News

  • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

  • Shreyas Iyer: హీరోయిన్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ డేటింగ్‌.. వీడియో వైర‌ల్‌!

  • India Playing XI: రేపు ఆసీస్‌తో తొలి వ‌న్డే.. భార‌త్ తుది జ‌ట్టు ఇదేనా?

  • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

  • Deepotsav: ఢిల్లీ కర్తవ్య పథ్‌లో అద్భుత దీపోత్సవం.. ప్రారంభించిన సీఎం రేఖ గుప్తా!

Trending News

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd