HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Battle For India Will Be Decided In 2024 Not In Any State Poll Prashant Kishors Jibe At Modi

Prashant Kishor : 2024పై ‘మాన‌సిక’ సిద్ధాంతం

ఐదు రాష్ట్రాల ఫ‌లితాల‌ను సెమీఫైన‌ల్ గా బీజేపీ భావిస్తోంది.

  • By CS Rao Published Date - 03:07 PM, Fri - 11 March 22
  • daily-hunt
Modi Prashant Kishor
Modi Prashant Kishor

ఐదు రాష్ట్రాల ఫ‌లితాల‌ను సెమీఫైన‌ల్ గా బీజేపీ భావిస్తోంది. 2024 ఎన్నిక‌ల‌కు ట్రైల‌ర్ గా పోల్చుతూ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ విజ‌యోత్స‌వ స‌భ‌లో వినిపించాడు. అంతేకాదు, 2017 ఎన్నిక‌ల్లో యూపీలో స్వీప్ చేసిన బీజేపీ 2019 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యాన్ని గుర్తు చేశాడు. ఇదంతా విప‌క్షాల‌ను మాన‌సికంగా కుంగ‌దీయ‌డానికంటూ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ అంటున్నాడు. ఐదు రాష్ట్రాల ఫ‌లితాల చుట్టూ రాజ‌కీయ ఉన్మాదాన్ని బీజేపీ అల్లుతోంద‌ని పీకీ ట్వీట్ చేశాడు. ఆ మాయంలో ప‌డొద్ద‌ని విప‌క్షాల‌కు హిత‌వు ప‌లికాడు.

Battle for India will be fought and decided in 2024 & not in any state #elections

Saheb knows this! Hence this clever attempt to create frenzy around state results to establish a decisive psychological advantage over opposition.

Don’t fall or be part of this false narrative.

— Prashant Kishor (@PrashantKishor) March 11, 2022

ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను దేనిక‌దే చూడాలి. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను అసెంబ్లీకి పోల్చ‌లేం. అలాగే, అసెంబ్లీ ఫ‌లితాల‌ను లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు అన్వ‌యించ‌లేం. ఆయా రాష్ట్రాల్లో వ‌చ్చిన పూర్వ‌పు ఫ‌లితాల‌ను అవ‌లోకిస్తే, చాలా కొద్ది చోట్ల మాత్ర‌మే అసెంబ్లీ, లోక్ స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఏక‌రీతిగా క‌నిపిస్తాయి. స్థానిక సంస్థ‌ల ఫ‌లితాల‌కు, అసెంబ్లీ ఫ‌లితాలు దాదాపుగా ఎక్క‌డా స‌రిపోల్చ‌లేం. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఐదు రాష్ట్రాల ఫ‌లితాల‌ను 2024 సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ఎందుకు పోల్చుతారంటూ పీకే ప్ర‌శ్నిస్తున్నాడు.

అస‌లైన యుద్ధం 2024లో ఉంద‌ని పీకే అంటున్నాడు. వచ్చే లోక్‌సభ ఎన్నికలపై ఫలితాలపై ఐదు రాష్ట్రాల ప్ర‌భావం ఉండ‌ద‌ని చెబుతున్నాడు. సమాజ్‌వాదీ పార్టీ నేతృత్వంలోని రెయిన్‌బో సంకీర్ణాన్ని బుల్‌డోజింగ్‌ చేస్తూ బీజేపీ ఉత్తరప్రదేశ్‌లో తిరిగి అధికారంలోకి వచ్చింది. ఉత్తరాఖండ్, మణిపూర్ , గోవాలను కూడా అధికారాన్ని నిలబెట్టుకుంది. అయితే, కేజ్రీ వాల్ ఆధ్వ‌ర్యంలోని AAP పంజాబ్‌లో అద్భుతమైన విజయాన్ని సాధించింది. మూడు వంతుల మెజారిటీని గెలుచుకుంది.

2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించిన మరుసటి రోజే పీకే కీల‌క వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. నాలుగు రాష్ట్రాల్లో తమ పార్టీ విజయం రాబోవు సార్వత్రిక ఎన్నికల తీర్పును కూడా స్పష్టం చేసిందని గురువారం మోడీ అన్నాడు. ఆ విష‌యాన్ని రాజకీయ పండితులు గమనించాల‌ని కూడా సూచించాడు. 2019లో బీజేపీ విజయాన్ని 2017లో ఉత్తరప్రదేశ్ ఎన్నికల స్వీప్‌తో మోడీ ముడిపెట్టాడు.
“భారతదేశం కోసం యుద్ధం 2024లో జరుగుతుంది. ఏ రాష్ట్ర #ఎన్నికల్లో కాదు అని సాహెబ్‌కు ఇది తెలుసు! అందుకే ప్రతిపక్షంపై నిర్ణయాత్మక మానసిక ప్రయోజనాన్ని ఏర్పరచుకోవడానికి రాష్ట్ర ఫలితాల చుట్టూ ఉన్మాదం సృష్టించడానికి ఈ తెలివైన ప్రయత్నం. పడిపోకండి లేదా ఇందులో భాగం అవ్వకండి. తప్పుడు కథనం.“ అంటూ కిషోర్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 5 state elections
  • bjp
  • pm modi
  • prashant kishor

Related News

Railway Employees

Railway Employees: రైల్వే ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌.. బోన‌స్ ప్ర‌క‌టించిన కేంద్రం!

షిప్పింగ్, మారిటైమ్ రంగాల అభివృద్ధి, సంస్కరణల కోసం కేంద్ర కేబినెట్ రూ. 69,725 కోట్లు కేటాయించింది. ఈ నిధులు ముఖ్యంగా షిప్‌ల తయారీ, షిప్పింగ్ రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి.

  • PM Modi

    PM Modi: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ లేఖ..!

  • GST 2.0

    GST 2.0: ఇక‌పై అత్యంత త‌క్కువ ధ‌ర‌కే ల‌భించే వ‌స్తువులీవే!

  • Dhanyavaad Modi JI Padayatra

    Dhanyavaad Modi JI Padayatra: జీఎస్టీ స్లాబ్‌ల తగ్గింపుపై ‘ధ‌న్య‌వాద్‌ మోడీ జీ’ పాద‌యాత్ర.. పాల్గొన్న బీజేపీ ఎంపీ!

  • Jagan

    Jagan: కొత్త జీఎస్టీపై జ‌గ‌న్ కీల‌క ట్వీట్‌.. ఏమ‌న్నారంటే!

Latest News

  • Balakrishna Comments : బాలకృష్ణ వివాదంపై చంద్రబాబు సీరియస్

  • IPS Transfer : తెలంగాణ లో 23 మంది ఐపీఎస్‌లు బ‌దిలీ

  • ‎Papaya Juice: ఉదయాన్నే పరగడుపున బొప్పాయి జ్యూస్ తాగవచ్చా.. తాగితే ఏమవుతుందో మీకు తెలుసా?

  • MGBS : నీట మునిగిన ఎంజీబీఎస్..తాళ్ల సాయంతో బయటకు ప్రయాణికులు

  • Musi River : మూసీ ఉగ్రరూపం..కట్టుబట్టలతో పరుగులు తీస్తున్న స్థానికులు

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd