Attorney General of India : భారత అటార్నీ జనరల్గా సీనియర్ న్యాయవాది ఆర్ వెంకటరమణి నియామకం
సీనియర్ న్యాయవాది ఆర్ వెంకటరమణిని భారత అటార్నీ జనరల్గా నియమించినట్లు లా అండ్ జస్టిస్ మంత్రిత్వ...
- By Prasad Published Date - 07:34 AM, Thu - 29 September 22
సీనియర్ న్యాయవాది ఆర్ వెంకటరమణిని భారత అటార్నీ జనరల్గా నియమించినట్లు లా అండ్ జస్టిస్ మంత్రిత్వ శాఖ అధికారిక పేర్కొంది. 72 ఏళ్ల వెంకటరమణి లా కమిషన్ మాజీ సభ్యుడిగా ఉంటూ 40 ఏళ్లకు పైగా సుప్రీంకోర్టులో కొనసాగుతున్నారు. ఏప్రిల్ 13, 1950 న పుదుచ్చేరిలో జన్మించిన వెంకటరమణి, ప్రముఖంగా రాజ్యాంగ చట్టం, పరోక్ష పన్నుల చట్టం, మానవ హక్కుల చట్టం, పౌర మరియు క్రిమినల్ చట్టాలు, వినియోగదారుల చట్టం, అలాగే సేవలకు సంబంధించిన చట్టంలోని వివిధ శాఖలలో ప్రాక్టీస్ చేశారు. కేంద్ర ప్రభుత్వం, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలకు సుప్రీం కోర్టు మరియు వివిధ హైకోర్టులలో ప్రధాన వ్యాజ్యాలలో ఆయన ప్రాతినిధ్యం వహించారు. వెంకటరమణి జూలై, 1977లో తమిళనాడు బార్ కౌన్సిల్లో చేరారు. 1979లో సుప్రీంకోర్టుకు వెళ్లారు. 1997లో అత్యున్నత న్యాయస్థానం సీనియర్ న్యాయవాదిగా నియమించబడ్డారు.
అటార్నీ జనరల్ కేంద్రం యొక్క అత్యున్నత న్యాయ అధికారి, భారతదేశంలోని ఏ కోర్టులోనైనా హాజరయ్యే హక్కును కలిగి ఉంటారు. ప్రభుత్వ వ్యాజ్యాలను నిర్వహించడమే కాకుండా, సంక్లిష్టమైన న్యాయపరమైన సమస్యలపై కూడా అటార్నీ జనరల్ సలహా ఇస్తారు. భారత తదుపరి ఏజీగా ఉండాలన్న కేంద్రం ప్రతిపాదనను సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ తిరస్కరించిన మూడు రోజుల తర్వాత ఈ ప్రకటన వెలువడింది. కేకే వేణుగోపాల్ పదవీకాలం సెప్టెంబర్ 30తో ముగియనున్న రోహత్గీకి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రారంభంలో ఏజీ పదవిని ఆఫర్ చేసింది. రోహత్గీ జూన్ 2014 నుండి జూన్ 2017 వరకు ఏజీగా ఉన్నారు. ఆయన తర్వాత వేణుగోపాల్ నియమితులయ్యారు. అటార్నీ జనరల్ఖు మూడేళ్ల పదవీకాలం ఉంటుంది
Tags
Related News
WhatsApp: భారతదేశం నుండి వెళ్ళిపోతాం అంటున్న వాట్సాప్.. కారణం ఏంటి?
మెసేజ్ ఎన్క్రిప్షన్ను ఉల్లంఘించమని ప్రభుత్వం బలవంతం చేస్తే భారతదేశంలో తమ సేవలను ఉపసంహరించుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేసింది ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ఫారమ్ వాట్సాప్. దేశంలో మెసేజ్ ఎన్క్రిప్షన్ పై ఈ రోజు ఢిల్లీ కోర్టులో వాదనల అనంతరం వాట్సాప్ ఈ వ్యాఖ్యలకు పాల్పడింది.