Anand Mahindra: ఈ హోటల్ వర్కర్ పనితనానికి ఆనంద్ మహీంద్రా ఫిదా
పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మరో ఆకర్షణీయమైన వీడియోని తన ట్విట్టర్ (Twitter) ఫాలోవర్ల ముందుకు తీసుకొచ్చారు.
- By Maheswara Rao Nadella Published Date - 03:58 PM, Fri - 3 February 23
పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) మరో ఆకర్షణీయమైన వీడియోని తన ట్విట్టర్ ఫాలోవర్ల ముందుకు తీసుకొచ్చారు. ఓ హోటల్ వర్కర్ పనితీరు నైపుణ్యాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. హోటల్లో పెద్ద పెనంపై ఒకేసారి 16 దోశలు వేయగా.. ఆ 16 దోశలను విడిగా ఒక్కో ప్లేట్ లో పెట్టుకుని, ఆ ప్లేట్లు అన్నింటినీ వెయిటర్ తీసుకెళ్లి ఆర్డర్ చేసిన వారికి ఇవ్వడాన్ని గమనించొచ్చు.
మనం వెయిటర్ ఉత్పాదకత రేటును ఒలింపిక్ క్రీడ మాదిరిగా గుర్తించాలి. ఈ విభాగంలో ఈ జెంటిల్ మెన్ నిజంగా బంగారు పతకానికి అర్హుడే’’ అని ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ లో ఈ వీడియోతోపాటు పోస్ట్ చేసిన ట్వీట్ లో పేర్కొన్నారు. వెయిటర్ తన చేతినిండా వరుసగా ప్లేట్లను పెట్టుకుని బ్యాలన్స్ గా తీసుకెళ్లడం చూస్తే ఎవరైనా సరే మెచ్చుకోకుండా ఉండలేరు.
We need to get ‘Waiter Productivity’ recognised as an Olympic sport. This gentleman would be a contender for Gold in that event… pic.twitter.com/2vVw7HCe8A
— anand mahindra (@anandmahindra) January 31, 2023
Also Read: BBC Documentary: బీబీసీ డాక్యుమెంటరీ వివాదం.. కేంద్రానికి నోటీసులు పంపిన సుప్రీం
Related News
WhatsApp: భారతదేశం నుండి వెళ్ళిపోతాం అంటున్నవాట్సాప్.. కారణం ఏంటి?
మెసేజ్ ఎన్క్రిప్షన్ను ఉల్లంఘించమని ప్రభుత్వం బలవంతం చేస్తే భారతదేశంలో తమ సేవలను ఉపసంహరించుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేసింది ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ఫారమ్ వాట్సాప్. దేశంలో మెసేజ్ ఎన్క్రిప్షన్ పై ఈ రోజు ఢిల్లీ కోర్టులో వాదనల అనంతరం వాట్సాప్ ఈ వ్యాఖ్యలకు పాల్పడింది.