Air India: ఎయిర్ ఇండియా భారీ డీల్.. 840 విమానాల కొనుగోలు.. తొలుత 470 విమానాలు..!
విమానయాన రంగంలో ఎయిరిండియా (Air India) అతిపెద్ద ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎయిర్ ఇండియా యాజమాన్యంలోని టాటా సన్స్, ఎయిర్లైన్ భద్రత, కస్టమర్ సర్వీస్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, నెట్వర్క్, మానవ వనరుల దిశలో పెద్ద మార్పుల ప్రయాణంలో ఉందని పేర్కొంది.
- By Gopichand Published Date - 02:36 PM, Thu - 16 February 23
విమానయాన రంగంలో ఎయిరిండియా (Air India) అతిపెద్ద ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎయిర్ ఇండియా యాజమాన్యంలోని టాటా సన్స్, ఎయిర్లైన్ భద్రత, కస్టమర్ సర్వీస్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, నెట్వర్క్, మానవ వనరుల దిశలో పెద్ద మార్పుల ప్రయాణంలో ఉందని పేర్కొంది. టాటా గ్రూప్ ట్రిలియన్ డాలర్లు వెచ్చించి అత్యాధునిక బోయింగ్, ఎయిర్ బస్ విమానాలను కొనుగోలు చేయనుంది.
ఎయిర్ ఇండియా.. ఎయిర్బస్, బోయింగ్లతో 840 విమానాల కోసం ఆర్డర్లు చేసింది. వీటిలో 370 విమానాల కొనుగోలుకు సంబంధించిన ఆర్డర్ కూడా ఉంది. ఈ విషయాన్ని ఎయిరిండియా సీనియర్ అధికారి గురువారం వెల్లడించారు. లింక్డ్ఇన్ పోస్ట్లో ఎయిర్ ఇండియా చీఫ్ కమర్షియల్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫీసర్ నిపున్ అగర్వాల్ ఇలా రాశారు. విమానయాన సంస్థ నుండి ఆర్డర్లు ఇవ్వడానికి ప్రపంచవ్యాప్త ఆసక్తికి మేము కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. దాదాపు రెండేళ్ల క్రితం ఎయిరిండియా ప్రైవేటీకరణతో ప్రారంభమైన అద్భుత ప్రయాణంలో భాగమే తాజాగా విమానాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చిందని తెలిపారు. రాబోయే దశాబ్దంలో 470 తేలికపాటి విమానాలు, 370 విమానాలను కొనుగోలు చేసేందుకు ఎయిర్ ఇండియా బోయింగ్, ఎయిర్బస్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన చెప్పారు.
టాటా గ్రూప్ తొలుత మొత్తం 470 విమానాలను కొనుగోలు చేయాలనుకుంది. విమానయాన రంగంలో అగ్రశ్రేణి కంపెనీలైన అమెరికాకు చెందిన బోయింగ్, యూరప్కు చెందిన ఎయిర్బస్లతో టాటా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా భారత్ను అభినందించడాన్ని బట్టి ఈ డీల్ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. ఇది కాకుండా, UK ప్రధాని రిషి సునక్ కూడా ఈ ఒప్పందాన్ని తన దేశానికి మైలురాయిగా అభివర్ణించారు. భారత్తో వ్యాపార సంబంధాలను కొనసాగించాలని కూడా సునక్ నొక్కి చెప్పారు. మొత్తంగా చూస్తే, 470 విమానాలను కొనుగోలు డీల్ విలువ 80 బిలియన్ డాలర్లు అంటే 6.40 లక్షల కోట్ల రూపాయలు.
Also Read: Cylinder Blast: రైలులో పేలిన సిలిండర్.. ఇద్దరు మృతి
దీనికి అదనంగా వచ్చే పదేళ్లలో 370 విమానాల కొనుగోలుకు వీలుగా బోయింగ్, ఎయిర్బస్ సంస్థలతో ఆప్షన్స్ అండ్ పర్చేస్ రైట్స్ను కొనుగోలు చేశామని నిపుణ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఈ ఒప్పందాలు పూర్తిస్థాయిలో కార్యరూపం దాలిస్తే ప్రపంచంలోని ప్రధాన నగరాలన్నిటికీ భారత్ నుంచి సర్వీసులు నడిపే అవకాశం ఉంటుందని అన్నారు. తొలుత ఆర్డర్ ఇచ్చిన 470 విమానాలు వచ్చే ఆరేడు ఏళ్లలో సంస్థకు అందనున్నాయి.
ఆర్డర్లో 40 ఎయిర్బస్ A350లు, 20 బోయింగ్ 787లు, 10 బోయింగ్ 777-9s వైడ్-బాడీ ఎయిర్క్రాఫ్ట్లు, అలాగే 210 ఎయిర్బస్ A320/321 నియోస్, 190 బోయింగ్ 737 MAX సింగిల్ నడవ విమానాలు ఉన్నాయి. ఈ విధంగా ఎయిర్ ఇండియా తొలుత మొత్తం 470 విమానాలను కొనుగోలు చేయనుంది. వీటిలో బోయింగ్ నుండి 220 విమానాలు, ఎయిర్బస్ నుండి 250 విమానాలు ఉన్నాయి. ఎయిర్ ఇండియా ప్రకారం.. కొత్త విమానాలు 2023 చివరి నెలల్లో సేవలోకి వస్తాయి. 2025 మధ్య నాటికి చాలా కొత్త విమానాలు ఎయిర్ ఇండియా ఫ్లీట్లో చేరనున్నాయి. ఈ కొత్త విమానాలు ఎయిర్లైన్స్ ఫ్లీట్ను ఆధునీకరించడంతోపాటు గ్లోబల్ నెట్వర్క్ను విస్తృతంగా విస్తరిస్తాయని ఎయిరిండియా ఛైర్మన్ ఎన్ చంద్రశేఖర్ తెలిపారు.
Related News
Iconic Air Hostesses : ఓల్డ్ ఈజ్ గోల్డ్.. చీరకట్టులో ఎయిర్ హోస్టెస్ల ఆతిథ్యం.. వీడియో వైరల్
Iconic Air Hostesses : మనదేశంలోని విమానాల్లో ఎయిర్హోస్టెస్లను తొలిసారిగా 1946 సంవత్సరంలో ఎయిర్ ఇండియా ప్రవేశపెట్టింది.