Rampur: రామ్ పూర్ లో రాత్రుళ్ళు వచ్చి కాలింగ్ బెల్ కొడుతున్న స్త్రీ!
అర్ధరాత్రి (Midnight) సమయం. వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు.
- By Maheswara Rao Nadella Published Date - 01:03 PM, Sat - 4 February 23
అర్ధరాత్రి సమయం. వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఆ సమయంలో ఇంటి కాలింగ్ బెల్ మోగింది. ఉలిక్కిపడి లేచిన ఇంట్లోని వారు తలుపు తెరిచి చూడగా.. గుండె ఆగినంత పని అయింది. వంటిపై చిన్నపాటి వస్త్రం కూడా లేకుండా దిగంబరంగా స్త్రీ నిలుచుని ఉంది. ఉత్తరప్రదేశ్ లోని రామ్ పూర్ (Rampur) లో ఓ మహిళ కొన్ని రోజులుగా ఇదే చేస్తోంది.
పలు ఇళ్ల ముందుకు వెళ్లి కాలింగ్స్ బెల్స్ మోగిస్తున్నట్టు, డోర్లను తడుతున్నట్టు సీసీటీవీ కెమెరాల్లోనూ రికార్డు అయింది. ఈ వీడియో ఫుటేజీలు సామాజిక మాధ్యమాలపైకి చేరాయి. దీనిపై స్థానికుడు ఒకరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇందుకు సంబంధించి శనివారం రామ్ పూర్ (Rampur) పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. సదరు మహిళను గుర్తించామని, వారి తల్లిదండ్రులతో మాట్లాడిన అనంతరం.. మానసిక అనారోగ్యంతో ఆమె బాధపడుతున్నట్టు తెలుసుకున్నామని ప్రకటించారు. గత ఐదేళ్లుగా బరేలీలో ఆమెకు చికిత్స కొనసాగుతున్నట్టు చెప్పారు.
సంబంధిత మహిళ మరోసారి అలా వీధుల్లోకి రాకుండా చూసుకోవాలని ఆమె తల్లిదండ్రులకు పోలీసులు స్పష్టంగా చెప్పారు. అనవసరంగా వదంతులు వ్యాప్తి చేయవద్దని ప్రజలకు సూచించారు. ‘‘రామ్ పూర్ లోని రోడ్డుపై అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో మహిళ తిరుగుతోంది. ఎవరో తెలియడం లేదు. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూడండి? సీసీటీవీ ఫుటేజీలో ఆమె దిగంబరంగా తెల్లవారుజామున 3 గంటల వరకు తిరిగినట్టుంది. పోలీసులు ఎక్కడ ఉన్నారు అసలు? శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంది?’’ అంటూ పోలీసుల తీరును ట్విట్టర్ లో ఓ వ్యక్తి ఎండగట్టాడు.
Also Read: Spy Balloon: చిచ్చు పెట్టిన గూఢచర్య బెలూన్..
Related News
Polling Station: ప్రపంచంలోనే ఎత్తైన పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో తెలుసా.. ఓటు వేయాలంటే కష్టమే
Polling Station: మండి పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగమైన హిమాచల్ ప్రదేశ్ లోని లాహౌల్-స్పితి జిల్లాలో సముద్ర మట్టానికి 15,256 అడుగుల ఎత్తులో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్ తాషిగాంగ్ లో ఉంది. 52 మంది రిజిస్టర్డ్ ఓటర్లు ఉన్నారని అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ హర్ష్ నేగి శుక్రవారం తెలిపారు. 2019 లోక్సభ ఎన్నికల్లో తాషిగాంగ్లో 45 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 27 మంది పురుషులు, 18 మంది మహి�