HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >90 Per Cent Of Crimes In Goa Due To Migrant Labourers

Goa CM Sawant: వలస కార్మికుల వల్లే గోవాలో నేరాలు : సీఎం ప్రమోద్ సావంత్

గోవాలో పెరుగుతున్న నేరాలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న నేరాలను దాదాపు 90 శాతం బీహార్, ఉత్తరప్రదేశ్ మరియు ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చిన కార్మికులే

  • Author : Praveen Aluthuru Date : 02-05-2023 - 1:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Goa CM Sawant
New Web Story Copy (65)

Goa CM Sawant: గోవాలో పెరుగుతున్న నేరాలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న నేరాలను దాదాపు 90 శాతం బీహార్, ఉత్తరప్రదేశ్ మరియు ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చిన కార్మికులే చేస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా వలస కూలీలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే లేబర్ కార్డును తప్పనిసరిగా పొందాలని సూచించారు.

ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి వలస కూలీ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన లేబర్ కార్డును కలిగి ఉండాలన్నారు. ప్రైవేట్, పారిశ్రామిక రంగాలలో పని చేస్తున్న వారి వివరాలు ప్రభుత్వ డేటాలో నమోదు చేస్తుందని అన్నారు. అలాగే సంక్షేమ పథకాలను ఈ రంగానికి విస్తరించడానికి లేబర్ కార్డులను జారీ చేస్తుందని సీఎం చెప్పారు.

గోవాలో నేరాలకు పాల్పడి కొందరు వలస కూలీలు తమ సొంత రాష్ట్రాలకు పారిపోతున్నారని, దీంతో వారిపై చర్యలు తీసుకోవడం చాలా కష్టమవుతోందని ప్రమోద్ సావంత్ అన్నారు. గోవాలో అత్యధికంగా 90 శాతం నేరాలకు పాల్పడింది వలస కూలీలే. బీహార్, ఉత్తరప్రదేశ్ లేదా ఇతర ప్రాంతాలకు చెందిన వారేనంటూ సీఎం అభిప్రాయపడ్డారు.

కార్మికులందరికీ కార్డులు జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వేతర సంస్థలను (ఎన్‌జిఓ) నియమించిందని సావంత్ తెలిపారు. త్వరలో కార్డుల కోసం కూలీల నమోదు సౌకర్యాన్ని ఆన్‌లైన్‌లోకి తీసుకువస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. కూలీలందరికీ కార్డులు జారీ చేసిన తర్వాత డేటాబేస్‌ను యాక్సెస్ చేయడం సులభతరం అవుతుందని చెప్పారు. ఇది కేసులను దర్యాప్తు చేయడానికి మరియు ట్రాక్ చేయడానికి పోలీసులకు సహాయపడుతుందని సావంత్ చెప్పారు.

Read More: WTC Final: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ.. మరో ఇద్దరు ఆటగాళ్లకు గాయాలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 90 per cent
  • crimes
  • Goa CM Sawant
  • labour cards
  • Migrant Labourers

Related News

    Latest News

    • గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

    • సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

    • నిధి అగర్వాల్ చేదు అనుభవం, మాల్ ఆర్గనైజర్లపై కేసు నమోదు

    • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • ఓజీ డైరెక్టర్ కు పవన్ కార్ ఇవ్వడం వెనుక అసలు కథ ఇదే !

    Trending News

      • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

      • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

      • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

      • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

      • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd