186 Terrorists Killed: 2022లో 186 మంది ఉగ్రవాదులు హతం
2022లో 56 మంది పాకిస్థానీలతో సహా మొత్తం 186 మంది ఉగ్రవాదులు హతమయ్యారని (186 Terrorists Killed), 159 మందిని అరెస్టు (159 Arrested) చేశామని జమ్మూ కాశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) దిల్బాగ్ సింగ్ శనివారం తెలిపారు. ఇటీవలి కాలంలో ఈ ఏడాది అత్యంత విజయవంతమైన సంవత్సరం అని ఆయన పేర్కొన్నారు.
- By Gopichand Published Date - 07:53 AM, Sun - 1 January 23
2022లో 56 మంది పాకిస్థానీలతో సహా మొత్తం 186 మంది ఉగ్రవాదులు హతమయ్యారని (186 Terrorists Killed), 159 మందిని అరెస్టు (159 Arrested) చేశామని జమ్మూ కాశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) దిల్బాగ్ సింగ్ శనివారం తెలిపారు. ఇటీవలి కాలంలో ఈ ఏడాది అత్యంత విజయవంతమైన సంవత్సరం అని ఆయన పేర్కొన్నారు. సమైఖ్య రాష్ట్రంలో జీరో టెర్రర్ లక్ష్యాన్ని సాధించేందుకు పోలీసులు, ఇతర భద్రతా సంస్థలు సరైన దిశలో పయనిస్తున్నాయన్నారు. 2022లో సెలెక్టివ్, టార్గెట్ హత్యలు, గ్రెనేడ్, IED దాడులను నిర్వహించే పనిలో ఉన్న నలుగురి నుండి ఐదుగురు సభ్యులతో కూడిన 146 పాకిస్తాన్ నిర్మిత టెర్రర్ మాడ్యూల్స్ను కూడా ఛేదించినట్లు పోలీసు చీఫ్ విలేకరుల సమావేశంలో తెలిపారు.
జమ్మూకశ్మీర్లో ఈ ఏడాది 100 మంది యువకులు మిలిటెంట్లో చేరారని చెప్పారు. ఇది చాలా సంవత్సరాలలో అతి తక్కువ సంఖ్య. ప్రస్తుతం 100 కంటే కొంచెం ఎక్కువగా ఉన్న యాక్టివ్ టెర్రరిస్టుల సంఖ్యను రెండంకెల సంఖ్యకు తగ్గించేందుకు భద్రతా బలగాలు కృషి చేస్తున్నాయని, వారిలో చాలా మంది నిర్మూలించబడ్డారని ఆయన చెప్పారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు 2022లో లోయలో శాంతి, సుస్థిరతను సాధించడంలో 100 శాతం విజయాన్ని సాధించారు.
అయితే పాకిస్తాన్ ప్రయోజిత ఆన్లైన్ ఉగ్రవాదం ఇప్పుడు సవాలుగా మారింది. జమ్మూ కాశ్మీర్లోని మైనారిటీ వర్గాలకు చెందిన ఉద్యోగులను, ఇతరులను ఉగ్రవాదులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, అయితే అలాంటి చర్యలకు మనం భయపడవద్దని సింగ్ అన్నారు. కాశ్మీరీ పండిట్ వలస కార్మికులు తమ ఇద్దరు సహచరులు రాహుల్ భట్, రజనీ బాలా లక్ష్యంగా హత్యలు జరిగిన నేపథ్యంలో లోయ వెలుపల తమను బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ జమ్మూలో క్యాంప్ చేస్తున్నారు. ముఖ్యంగా లష్కరే తోయిబాలో భాగమైన ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ఇటీవల కాశ్మీరీ పండిట్ ఉద్యోగులపై దాడి చేస్తామని బెదిరించింది.
Also Read: Three Died: తెలంగాణలో తీవ్ర విషాదం.. ఆటోపై గ్రానెట్ రాయి పడి ముగ్గరు మృతి
కశ్మీర్ జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADGP) విజయ్ కుమార్ వరుస ట్వీట్లలో.. 24 మందికి పైగా అబ్బాయిలను తిరిగి సమాజంలోకి తీసుకువచ్చారని అన్నారు. హర్తాళ్లు, వీధి హింస, ఇంటర్నెట్ బంద్, రాళ్లదాడి ఘటనలు లేవని.. దీంతో సమాజంలోని అన్ని వర్గాల వారికి మేలు జరుగుతుందన్నారు. 2022లో పోలీసులు, కేంద్ర సాయుధ పారామిలటరీ బలగాల మరణాల సంఖ్య కూడా తగ్గిందని, ఇందులో 14 మంది పోలీసులు, 17 మంది సీఏపీఎఫ్ సిబ్బంది ఉగ్రదాడుల్లో అమరులయ్యారని దిల్బాగ్ సింగ్ చెప్పారు. ఏడాది కాలంలో పౌర మరణాల సంఖ్య కూడా తగ్గిందని, చిన్నపాటి శాంతిభద్రతల ఘటనలు 24 మాత్రమే జరిగాయన్నారు.
ఈ సంఖ్య సున్నా అయ్యేలా కృషి చేస్తున్నామన్నారు. సరిహద్దుల ఆవల నుంచి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కుట్రలు జరుగుతున్నాయని, అయితే స్థానిక యువతను హింసా మార్గంలో వెళ్లనీయకుండా చేయడంలో విజయం సాధించామని అన్నారు. 2016లో శాంతిభద్రతలకు సంబంధించి 2897 కేసులు, 2022లో 26 చిన్నపాటి కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో భద్రతా బలగాలు పెద్ద విజయాన్ని సాధించాయని ఆయన అన్నారు. ఈ ఏడాది ఉగ్రవాదానికి సంబంధించిన 49 కేసుల్లో ఆస్తులను జప్తు చేసినట్లు తెలిపారు.
Related News
Satyapal Malik: మాజీ గవర్నర్ ఇంటితో సహా 30కి పైగా ప్రాంతాల్లో సీబీఐ దాడులు..!
దేశంలోనే అతిపెద్ద దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) గురువారం (ఫిబ్రవరి 22) జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ (Satyapal Malik) ఇంటితో సహా 30కి పైగా ప్రదేశాలపై దాడులు చేసింది.