25 People Died : బస్సులో మంటలు.. 25 మంది సజీవ దహనం
- By Pasha Published Date - 07:02 AM, Sat - 1 July 23
25 People Died : మహారాష్ట్రలోని బుల్దానా సిటీ పరిధిలోని సమృద్ధి మహామార్గ్ ఎక్స్ప్రెస్ వేపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. యావత్మాల్ నుంచి పూణెకు వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగడంతో అందులో ప్రయాణిస్తున్న 25 మంది సజీవ దహనమయ్యారు. శనివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రోడ్డు డివైడర్ ను బస్సు ఢీకొట్టిన తర్వాత బోల్తా పడటంతో.. ఇంధనం లీకేజీ జరిగి అందులో మంటలు చెలరేగాయని అంటున్నారు.
Also read : Modi- Amit shah: యాక్షన్లోకి అమిత్ షా, నడ్డా.. ఆరోజే ఫుల్ క్లారిటీ వచ్చేస్తోందా?
బస్సు నుంచి 25 మృతదేహాలను(25 People Died) వెలికితీశారు. అందులో మొత్తం 33 మంది ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. మిగితా 8 మంది గాయపడినట్లు తెలుస్తోంది. వారిని బుల్దానా సివిల్ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు బుల్దానా పోలీస్ డిప్యూటీ ఎస్పీ బాబూరావు మహాముని వెల్లడించారు.
Related News
Lok Sabha Elections 2024: ఖమ్మంలో రోడ్డు ప్రమాదం.. కట్ చేస్తే వెలుగులోకి భారీ నగదు
తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు ముందు ఖమ్మం మండలం కూసుమంచిలో జరిగిన ప్రమాదంలో భారీగా నగదు బయటపడింది. అతివేగంగా వచ్చిన వాహనం బోల్తా పడగా, అందులో భారీగా డబ్బు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 1.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.