HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >2295 Indian Nationals Brought Home From Iran Under Operation Sindhu

Operation Sindhu: కొన‌సాగుతున్న ఆప‌రేష‌న్ సింధు.. భార‌త్‌కు ఎంత‌మంది వ‌చ్చారంటే?

ఈ ఆపరేషన్ గతంలో ఉక్రెయిన్, ఆఫ్ఘనిస్థాన్, సూడాన్‌ల నుంచి భారతీయులను తరలించిన ఆపరేషన్ గంగా, దేవీ శక్తి, కావేరి, అజయ్ వంటి మిషన్ల స్ఫూర్తితో కొనసాగుతోంది.

  • By Gopichand Published Date - 11:05 AM, Tue - 24 June 25
  • daily-hunt
Operation Sindhu
Operation Sindhu

Operation Sindhu: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణ నేపథ్యంలో భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ సింధు’ (Operation Sindhu) ద్వారా భారతీయ పౌరులను సురక్షితంగా స్వదేశానికి తరలిస్తోంది. గత ఆరు రోజుల్లో ఇరాన్ నుంచి 10 విమానాల్లో మొత్తం 2294 మంది భారతీయులు ఢిల్లీ చేరుకున్నారు. ఈరోజు తెల్లవారుజామున వచ్చిన విమానంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 16 మంది, వీరిలో తీర్థయాత్రలకు వెళ్లినవారు, కెర్మన్ మెడికల్ యూనివర్సిటీలో చదువుతున్న ఐదుగురు విద్యార్థులు ఉన్నారు.

కెర్మన్ మెడికల్ యూనివర్సిటీలో రెండో సంవత్సరం మెడిసిన్ చదువుతున్న విద్యార్థులు, టెహ్రాన్‌కు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ యూనివర్సిటీ ప్రాంతంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. సంఘర్షణ తగ్గిన తర్వాత తిరిగి చదువు కొనసాగించేందుకు ఇరాన్‌కు వెళ్తామని వారు చెప్పారు. విద్యార్థులను మొదట కెర్మన్ నుంచి బస్సుల ద్వారా మషాద్‌కు తరలించి, అక్కడి నుంచి విమానాల్లో భారత్‌కు పంపించారు. ఈ ఉదయం రెండు భారత వాయుసేన విమానాలు ఇరాన్ నుంచి ఢిల్లీకి మరికొందరు భారతీయులను తీసుకొస్తున్నాయి. ఇజ్రాయెల్ నుంచి కూడా భారతీయులను జోర్డాన్, ఈజిప్ట్ వంటి సరిహద్దు మార్గాల ద్వారా తరలిస్తున్నారు. గత రోజు 160 మంది భారతీయులు జోర్డాన్ సరిహద్దు ద్వారా సురక్షితంగా బయటకు వచ్చారు.

Also Read: TPCC Meetings: నేడు గాంధీ భవన్‌లో టీపీసీసీ కీలక సమావేశాలు!

విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక పోస్ట్‌లో “ఆపరేషన్ సింధు కొనసాగుతోంది. 23 జూన్ 2025న మషాద్ నుంచి 290 మంది భారతీయులు, ఒక శ్రీలంక పౌరుడు ఢిల్లీకి చేరుకున్నారు. ఇప్పటివరకు 2003 మంది భారతీయులను సురక్షితంగా తిరిగి తీసుకొచ్చాం” అని తెలిపారు. నేపాల్, శ్రీలంక పౌరులను కూడా భారత్ తరలిస్తోంది. వారి ప్రభుత్వాల అభ్యర్థన మేరకు ఈ చ‌ర్య‌లు చేప‌ట్టారు.

స్వదేశానికి చేరుకున్న భారతీయులు, ముఖ్యంగా విద్యార్థులు తమను సురక్షితంగా తరలించిన భారత ప్రభుత్వం, విదేశాంగ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. ఒక విద్యార్థి మాట్లాడుతూ.. “మేం భయపడ్డాం, కానీ భారత రాయబార కార్యాలయం త్వరగా స్పందించి మమ్మల్ని సురక్షితంగా తీసుకొచ్చింది” అని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తూ భారతీయుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఈ ఆపరేషన్ గతంలో ఉక్రెయిన్, ఆఫ్ఘనిస్థాన్, సూడాన్‌ల నుంచి భారతీయులను తరలించిన ఆపరేషన్ గంగా, దేవీ శక్తి, కావేరి, అజయ్ వంటి మిషన్ల స్ఫూర్తితో కొనసాగుతోంది. భారత్‌లోని 24/7 కంట్రోల్ రూమ్, టెల్ అవీవ్, టెహ్రాన్‌లోని రాయబార కార్యాలయాలు నిరంతరం పౌరులతో సంప్రదింపులు జరుపుతూ, సహాయం అందిస్తున్నాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Indian Air Force
  • Indian Citizens
  • Indian Evacuation
  • Iran- Israel Conflict
  • Kerman Medical University
  • Operation Sindhu
  • pm modi

Related News

Tensions in India-US relations: Modi absent from UN meetings!

PM Modi : భారత్‌–అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు : ఐరాస సమావేశాలకు మోడీ గైర్హాజరు!

అందులో భాగంగా, సెప్టెంబరు 9 నుంచి ప్రారంభం కానున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) సమావేశాలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకాకపోవచ్చని సమాచారం. ఇది UNGA 80వ సెషన్‌గా జరుగుతోంది. ఈ సమావేశాల్లో 23 నుంచి 29 తేదీల మధ్య ప్రపంచ దేశాధినేతల అత్యున్నత స్థాయి చర్చలు జరుగుతాయి.

  • Minister Lokesh meets Prime Minister Modi..these are the topics discussed..!

    Lokesh Delhi Tour : ప్రధాని మోడీతో మంత్రి లోకేష్ భేటీ..చర్చించిన అంశాలివే..!

  • New GST

    New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

  • Small chip made in India has the power to change the world: PM Modi

    PM Modi : భారత్ తయారు చేసిన చిన్న చిప్ ప్రపంచాన్ని మార్చే శక్తి కలిగి ఉంది: ప్రధాని మోడీ

  • Trump

    Trump: భార‌త్‌పై మ‌రోసారి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన ట్రంప్‌!

Latest News

  • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

  • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

  • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

  • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

  • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd