HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >15 Million Tax Payers To Get Notices Soon For Not Filing Itrs

1.5 Crore IT Notices : కోటిన్నర మందికి ఐటీ నోటీసులు.. ఆ 6 ట్రాన్సాక్షన్లు చేశారా ?

1.5 Crore IT Notices : ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే చాలామంది ఉద్యోగులు, వ్యాపారస్తులు కూడా ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టడం లేదు.

  • By Pasha Published Date - 03:34 PM, Sun - 4 February 24
  • daily-hunt
Tax Audit Reports
Tax Audit Reports

1.5 Crore IT Notices : ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే చాలామంది ఉద్యోగులు, వ్యాపారస్తులు కూడా ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టడం లేదు. అలాంటి వారిపై ఇప్పుడు ఐటీ శాఖ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆ విధంగా పన్ను కట్టకుండా ఉండిపోతున్న దాదాపు 1.5 కోట్ల మందికి నోటీసులు పంపిస్తామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) ఛైర్మన్ నితిన్ గుప్తా వెల్లడించారు.  1 కోటి రూపాయలకుపైగా విలువ చేసే పన్ను వివాదాల పరిష్కారానికి కర్ణాటకలోని మైసూర్ లో డిమాండ్ మేనెజ్మెంట్ సెంటర్‌ను 2022లోనే  ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. పన్ను చెల్లింపుదారులు అంగీకరించిన నిర్దిష్ట సమయంలో వారు ఒక చార్టర్డ్ అకౌంటెంట్, మందిపు అధికారులు, పన్ను చెల్లింపుదారులను ఒక చోట చేరి వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఈ సెంటర్ అవకాశాన్ని కల్పిస్తోందన్నారు. 2022 నుంచి ఇప్పటివరకు ఈ కేంద్రం 2.50 లక్షల వివాదాలను పరిష్కరించిందని ఆయన తెలిపారు.  కేంద్ర బడ్జెట్‌లో పేర్కొన్న విధంగా రూ.25 వేల వరకు ఉన్న పాత ట్యాక్స్ డిమాండ్ల ఉపసంహరణపై సీబీడీటీ ఓ సర్క్యులర్ జారీ చేయనుందని నితిన్ గుప్తా(1.5 Crore IT Notices) వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join

6 ట్రాన్సాక్షన్లు చేస్తే.. ఐటీ నోటీసులు రావొచ్చు

పెద్ద మొత్తంలో ఆర్థికపరమైన లావాదేవీలు నిర్వహించే వారు ఇన్‌కమ్ ట్యాక్స్ గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. సరైన అవగాహన లేక కొంతమంది ఇబ్బందులు పడుతుంటారు. కొంత మంది ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు చేయడం కంటే డబ్బులను నేరుగా బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేస్తే ఐటీ విభాగం గమనించదని భావిస్తారు. కానీ ఆ అంచనా తప్పు. ముఖ్యంగా 6 రకాల లావాదేవీల నిర్వహిస్తున్న సమయంలో ఆదాయపు పన్ను శాఖ మీకు నోటీసు పంపే అవకాశం ఉంటుంది.

  • రూ.30 లక్షలు అంత కంటే ఎక్కువ విలువ కలిగిన స్థిరాస్తులు అంటే ఇల్లు, భూమి కొనుగోళ్ల వంటివి చేసినప్పుడు రిజిస్ట్రేషన్ శాఖ ఆ వివరాలను ఐటీ శాఖకు తెలియజేస్తుంది.
  • ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో రూ. 10 లక్షలు, అంతకు మించి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించినప్పుడు వాటికి సంబంధించిన వివరాలు ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగానికి తెలియ జేయాలి. మీ క్రెడిట్ కార్డు వివరాలు పాన్ కార్డుతో లింకై ఉంటాయి. దీంతో మీ ట్రాన్సాక్షన్లను ఎప్పటికప్పుడు ట్యాక్స్ అధికారులు ట్రాక్ చేస్తారని గుర్తుంచుకోవాలి.
  • ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు పొదుపు ఖాతాలో రూ. 10 లక్షల అంత కంటే ఎక్కువ డబ్బులు డిపాజిట్ చేయడం లేదా విత్ డ్రా చేసుకోవడం వంటివి చేస్తే ఐటీ శాఖకు వాటి వివరాలు తెలియ జేయాల్సి ఉంటుంది.
  • రూ. 10 లక్షలు ఆపైన చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్ల వివరాలను ఐటీ విభాగానికి తెలియ జేయాలి. మరోవైపు.. ఒకటి కంటే ఎక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఈ పరిమితి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు బ్యాంకులే ఐటీ శాఖకు వివరాలు అందిస్తాయి.
  • ఒక ఆర్థిక సంవత్సరంలో షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, బాండ్లు, లేదా డిబెంచర్లలో రూ. 10 లక్షలు అంత కంటే మించి పెట్టుబడి పెట్టినప్పుడు వాటికి సంబంధించిన వివరాలను ఐటీ శాఖకు ఇవ్వాలి. లేకుంటే మీకు నోటీసులు వస్తాయి.
  • ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలు లేదా అంత కంటే ఎక్కువ విలువ గల విదేశీ కరెన్సీతో లావాదేవీలు నిర్వహించినప్పుడు వాటికి సంబంధించిన వివరాలను ఇన్‌కమ్ ట్యాక్స్ శాఖకు తెలియ జేయాలి. వాటిని దాచాలని చూస్తే మీకు నోటీసులు వస్తాయి.

Also Read :KomatiReddy Venkat Reddy : నల్గొండ, భువనగిరి సీట్లపై ‘కోమటిరెడ్డి’ ఫ్యామిలీ గురి !


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 1.5 Crore IT Notices
  • 15 million tax payers
  • business
  • IT Notices
  • Not Filing ITRs

Related News

8th Pay Commission

8th Pay Commission: 8వ వేతన సంఘంపై కీలక అప్‌డేట్.. 2027 నుండి కొత్త జీతాల నిర్మాణం అమలు!

ఒక ఉద్యోగి ప్రస్తుత మూల వేతనం రూ. 50,000, కొత్త ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.0 అయితే కొత్త మూల వేతనం రూ. 50,000 × 2.0 = రూ. 1,00,000 అవుతుంది. దీనికి మకాన్ కిరాయి భత్యం (HRA), కరువు భత్యం (DA) వంటి ఇతర భత్యాలు కూడా జోడించబడతాయి.

  • PAN- Aadhaar

    PAN- Aadhaar: పాన్ కార్డు ఉన్న‌వారికి బిగ్ అల‌ర్ట్‌.. డిసెంబ‌ర్ 31 వ‌ర‌కే ఛాన్స్‌!

  • India Post Payments Bank

    India Post Payments Bank: ఇక‌పై ఇంటి నుండే ఆ సర్టిఫికేట్ పొందవచ్చు!

  • Rs 2,000 Notes

    Rs 2,000 Notes: మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా రూ. 2 వేల నోట్లు!?

  • Mobile Plans Prices

    Mobile Plans Prices: డిసెంబర్ 1 నుంచి మళ్లీ పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు?

Latest News

  • Caffeine: రోజుకు ఎన్ని కప్పుల కాఫీ/టీ తాగడం సురక్షితం?

  • Prevent Heart Attack: భారతదేశంలో పెరుగుతున్న గుండె జబ్బుల ప్రమాదం!

  • Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు ఘనంగా జాతీయ వేడుకలు!

  • Bihar Election: బీహార్ ఎన్నికలు 2025.. ముగిసిన‌ తొలి దశ పోలింగ్, రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు!

  • Sanju Samson: సంజూ శాంసన్ బ్యాటింగ్‌తో ఎందుకు ఆడుకుంటున్నారు?

Trending News

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

    • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

    • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd