HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >15 Million Tax Payers To Get Notices Soon For Not Filing Itrs

1.5 Crore IT Notices : కోటిన్నర మందికి ఐటీ నోటీసులు.. ఆ 6 ట్రాన్సాక్షన్లు చేశారా ?

1.5 Crore IT Notices : ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే చాలామంది ఉద్యోగులు, వ్యాపారస్తులు కూడా ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టడం లేదు.

  • By Pasha Published Date - 03:34 PM, Sun - 4 February 24
  • daily-hunt
Tax Audit Reports
Tax Audit Reports

1.5 Crore IT Notices : ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే చాలామంది ఉద్యోగులు, వ్యాపారస్తులు కూడా ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టడం లేదు. అలాంటి వారిపై ఇప్పుడు ఐటీ శాఖ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆ విధంగా పన్ను కట్టకుండా ఉండిపోతున్న దాదాపు 1.5 కోట్ల మందికి నోటీసులు పంపిస్తామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) ఛైర్మన్ నితిన్ గుప్తా వెల్లడించారు.  1 కోటి రూపాయలకుపైగా విలువ చేసే పన్ను వివాదాల పరిష్కారానికి కర్ణాటకలోని మైసూర్ లో డిమాండ్ మేనెజ్మెంట్ సెంటర్‌ను 2022లోనే  ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. పన్ను చెల్లింపుదారులు అంగీకరించిన నిర్దిష్ట సమయంలో వారు ఒక చార్టర్డ్ అకౌంటెంట్, మందిపు అధికారులు, పన్ను చెల్లింపుదారులను ఒక చోట చేరి వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఈ సెంటర్ అవకాశాన్ని కల్పిస్తోందన్నారు. 2022 నుంచి ఇప్పటివరకు ఈ కేంద్రం 2.50 లక్షల వివాదాలను పరిష్కరించిందని ఆయన తెలిపారు.  కేంద్ర బడ్జెట్‌లో పేర్కొన్న విధంగా రూ.25 వేల వరకు ఉన్న పాత ట్యాక్స్ డిమాండ్ల ఉపసంహరణపై సీబీడీటీ ఓ సర్క్యులర్ జారీ చేయనుందని నితిన్ గుప్తా(1.5 Crore IT Notices) వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join

6 ట్రాన్సాక్షన్లు చేస్తే.. ఐటీ నోటీసులు రావొచ్చు

పెద్ద మొత్తంలో ఆర్థికపరమైన లావాదేవీలు నిర్వహించే వారు ఇన్‌కమ్ ట్యాక్స్ గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. సరైన అవగాహన లేక కొంతమంది ఇబ్బందులు పడుతుంటారు. కొంత మంది ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు చేయడం కంటే డబ్బులను నేరుగా బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేస్తే ఐటీ విభాగం గమనించదని భావిస్తారు. కానీ ఆ అంచనా తప్పు. ముఖ్యంగా 6 రకాల లావాదేవీల నిర్వహిస్తున్న సమయంలో ఆదాయపు పన్ను శాఖ మీకు నోటీసు పంపే అవకాశం ఉంటుంది.

  • రూ.30 లక్షలు అంత కంటే ఎక్కువ విలువ కలిగిన స్థిరాస్తులు అంటే ఇల్లు, భూమి కొనుగోళ్ల వంటివి చేసినప్పుడు రిజిస్ట్రేషన్ శాఖ ఆ వివరాలను ఐటీ శాఖకు తెలియజేస్తుంది.
  • ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో రూ. 10 లక్షలు, అంతకు మించి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించినప్పుడు వాటికి సంబంధించిన వివరాలు ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగానికి తెలియ జేయాలి. మీ క్రెడిట్ కార్డు వివరాలు పాన్ కార్డుతో లింకై ఉంటాయి. దీంతో మీ ట్రాన్సాక్షన్లను ఎప్పటికప్పుడు ట్యాక్స్ అధికారులు ట్రాక్ చేస్తారని గుర్తుంచుకోవాలి.
  • ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు పొదుపు ఖాతాలో రూ. 10 లక్షల అంత కంటే ఎక్కువ డబ్బులు డిపాజిట్ చేయడం లేదా విత్ డ్రా చేసుకోవడం వంటివి చేస్తే ఐటీ శాఖకు వాటి వివరాలు తెలియ జేయాల్సి ఉంటుంది.
  • రూ. 10 లక్షలు ఆపైన చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్ల వివరాలను ఐటీ విభాగానికి తెలియ జేయాలి. మరోవైపు.. ఒకటి కంటే ఎక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఈ పరిమితి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు బ్యాంకులే ఐటీ శాఖకు వివరాలు అందిస్తాయి.
  • ఒక ఆర్థిక సంవత్సరంలో షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, బాండ్లు, లేదా డిబెంచర్లలో రూ. 10 లక్షలు అంత కంటే మించి పెట్టుబడి పెట్టినప్పుడు వాటికి సంబంధించిన వివరాలను ఐటీ శాఖకు ఇవ్వాలి. లేకుంటే మీకు నోటీసులు వస్తాయి.
  • ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలు లేదా అంత కంటే ఎక్కువ విలువ గల విదేశీ కరెన్సీతో లావాదేవీలు నిర్వహించినప్పుడు వాటికి సంబంధించిన వివరాలను ఇన్‌కమ్ ట్యాక్స్ శాఖకు తెలియ జేయాలి. వాటిని దాచాలని చూస్తే మీకు నోటీసులు వస్తాయి.

Also Read :KomatiReddy Venkat Reddy : నల్గొండ, భువనగిరి సీట్లపై ‘కోమటిరెడ్డి’ ఫ్యామిలీ గురి !


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 1.5 Crore IT Notices
  • 15 million tax payers
  • business
  • IT Notices
  • Not Filing ITRs

Related News

World Largest City

World Largest City: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన అతిపెద్ద నగరం ఏదో తెలుసా?!

ఈ జాబితాలో ఇండోనేషియాకు చెందిన జకార్తా దాదాపు 42 మిలియన్ల మంది జనాభాతో ఇప్పుడు అగ్రస్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌కు చెందిన ఢాకా దాదాపు 36 మిలియన్ల మంది జనాభాతో రెండవ స్థానంలో ఉంది.

  • Billionaire List

    Billionaire List: స్టాక్ మార్కెట్‌లో భారీ లాభాలు.. ప్రపంచ కుబేరుల జాబితాలో పెను మార్పులు!

  • Bank

    Bank: రేపు ఈ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయా?

  • Luxury Cities

    Luxury Cities: ప్రపంచంలోని 10 అత్యంత విలాసవంతమైన నగరాలు ఇవే!

Latest News

  • Earthquake: హిందూ మహాసముద్రంలో భూకంపం.. 5.3 తీవ్రత నమోదు!

  • WPL Auction: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం.. దీప్తి శర్మకు భారీ ధర, అలిస్సా హీలీ అన్‌సోల్డ్!

  • Tata Sierra: టాటా సియెర్రా.. కేవలం డిజైనే కాదు, సేఫ్టీలోనూ ‘సుప్రీమ్’!

  • Pensioners: పెన్షనర్లకు శుభవార్త.. రూ. 1,000 నుండి రూ. 9,000 వరకు పెరిగే అవకాశం!

  • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

Trending News

    • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

    • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

    • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

    • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

    • Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్‌లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd