Jaggery: గోరు వెచ్చని నీటిలో బెల్లం కలిపి తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?
ప్రతిరోజు ఉదయాన్ని బెల్లం కలిపిన ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో ప్రారంభించడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. దీనివల్ల శీతాకాలంలో వచ్చే సీజ
- By Nakshatra Published Date - 05:30 PM, Sun - 14 May 23
ప్రతిరోజు ఉదయాన్ని బెల్లం కలిపిన ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో ప్రారంభించడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. దీనివల్ల శీతాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులను బెల్లం నివారిస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యంగా ఉండడం కోసం ఈ నీటిని తాగవచ్చు. బెల్లం శరీరంలో వేడిని ఉత్పత్తి చేసే అత్యంత శక్తివంతమైన ఆహారం, చల్లటి వాతావరణం నుండి మనలను కాపాడుతుంది. శీతాకాలంలో ఉదయాన్నే వెచ్చని బెల్లం నీరు త్రాగటం వలన శరీరం వెచ్చగా ఉంటుంది.
బెల్లం రక్తనాళాలలో నెలకొన్న బ్లాకేజెస్ను నివారించడానికి శరీరంలో వెచ్చదనాన్ని ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది కాబట్టి శీతాకాలంలో బెల్లం వాడకం చాలా అవసరం. అలా అని బెల్లం కలిపిన గోరువెచ్చని నీటిని ఎండాకాలం తాగితే శరీరంలో వేడి మరింత పెరుగుతుంది. బెల్లం చెరకు నుండి లేదా ఖర్జూరం నుండి తయారవుతుంది. బెల్లంలో చాలా ముఖ్యమైన విటమిన్లు ఖనిజాలు ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. అలాగే జలుబు, దగ్గును దూరం చేస్తుంది, శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది.
ఇది సహజ స్వీటెనర్. బెల్లం వివిధ ఆరోగ్య ప్రయోజనాల కారణంగా, దానిని వెచ్చని నీటిలో కరిగించి, ఖాళీ కడుపుతో తాగాలి. ఈ పానీయం ద్వారా బరువు తగ్గడంతో పాటు జీర్ణక్రియకు తోడ్పడుతుంది. బెల్లంలో ఇనుము, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి లభిస్తాయి. కాబట్టి ఈ తీపి వెచ్చని నీటిని తాగడం వల్ల శ్వాసకోశ సమస్యలను, గొంతు సమస్యలను నివారించవచ్చు. ఇందుకోసం కొన్ని వేడి నీటిలో బెల్లం వేస్తే అది కరుగుతుంది. కొద్దిగా చల్లబడినప్పుడు వడకట్టి త్రాగాలి. లేదా బెల్లం పొడిని తయారు చేసి పెట్టుకుంటే నేరుగా గ్లాసు వెచ్చని నీటిలో కలపి తాగేయవచ్చు. బెల్లం చాలా శక్తివంతమైనది, ఎక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది.
Related News
Water: రాత్రిపూట నీరు ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలు పాడవుతాయా..?
జీవించడానికి నీరు అవసరం. అయితే రాత్రిపూట నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలు పాడవుతాయని తరచుగా వార్తలు వస్తున్నాయి.