Eye Sight: కంటిచూపు తగ్గడానికి ఆ రెండు విటమిన్ల లోపమే కారణం.. అవి ఏంటంటే?
మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన శరీర భాగాలలో కళ్ళు కూడా ఒకటి. ఈ కళ్ళు మానవునికి అత్యంత కీలకమైనవి.
- By Nakshatra Published Date - 06:00 AM, Sat - 9 July 22
మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన శరీర భాగాలలో కళ్ళు కూడా ఒకటి. ఈ కళ్ళు మానవునికి అత్యంత కీలకమైనవి. కాగా ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా కంటి చూపు మందగిస్తుంది అంటూ ఆస్పత్రిల చుట్టు తిరుగుతున్నారు. అయితే కంటి చూపు తగ్గడానికి వివిధ కారణాలతో పాటుగా రెండు కీలక విటమిల లోపం కూడా అయి ఉండవచ్చు అని నిపుణుల అభిప్రాయపడుతున్నారు. మరి ఆ రెండు విటమిన్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. మానవ శరీరానికి విటమిన్లు, ఖనిజాల లవణాలు,సూక్ష్మ పోషకాలు ఎంతో అవసరం. మొత్తం 13 విటమిన్లు శారీరక ఆరోగ్యానికి ఉపకరిస్తాయి.
ఈ విటమిన్ లలో విటమిన్ ఏ, విటమిన్ బి12 లోపిస్తే కంటి చూపు మందగిస్తుందట. ఈ రెండు విటమిన్ల లోపం కళ్ళపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది అని నిపుణులు సూచిస్తున్నారు. విటమిన్ ఏ లోపం వల్ల కంటి లోని కార్నియా ఎండిపోయినట్టుగా మారడం వల్ల దాంతో రెటీనా కూడా దెబ్బతింటుందని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. దాని ద్వారా కళ్ళు సరిగా కనిపించకపోవడం జరుగుతుందట. ప్రతి సంవత్సరం 2.5 లక్షల నుంచి 5 లక్షల మంది వరకు చిన్నారులు విటమిన్ ఏ లోపంతో అంధత్వం బారిన పడుతున్నారు. అంతేకాకుండా ఆ చిన్నారులల్లో సగం మంది ఏడాదిలోపే మృత్యువాత పడుతున్నారు అని డబ్ల్యూహెచ్ఓ సంచలన విషయాలను వెల్లడించింది.
అలాగే విటమిన్ ఏ తో పాటు విటమిన్ బి12 కూడా చూపు కోల్పోవడానికి కారణం అవుతుందట. మెదడు నాడీ కణాల అభివృద్ధిలో విటమిన్ బి 12 కీలక పాత్ర అని ఈ విటమిన్ లోపించడం వల్ల ఆప్టిక్ న్యూరోపతి సంభవిస్తుందట. ఆప్టిక్ న్యూరోపతి అంటే కంటి నరాల వాపు లేదా నాడీ కణజాలం దెబ్బ తినడం. ఈ తాత్కాలికంగా కంటిచూపులు కోల్పోయే విధంగా చేస్తుందట. కాబట్టి కంటిచూపు తగ్గిన వారు వెంటనే విటమిన్ బి12 లోపించింది ఏమో అని పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కాగా గుడ్లు కొవ్వుతో ఉన్న చేపలు జున్ను, పాలు,పెరుగు వంటివి ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆ విటమిన్ ఏ లోపం నుంచి బయటపడవచ్చని, ఇక విటమిన్ బి12 ప్రధానంగా గొడ్డు మాంసం,పంది మాంసం,కోడి మాంసం, గుడ్లు,మటన్, చేపలు, నత్తలు, పీతలు అదేవిధంగా పాలు పాల ఉత్పత్తుల్లో కూడా విటమిన్ బి12 సమృద్ధిగా లభిస్తుందట.
Related News
Sukanya Story: ముసలి మునితో కన్నెపిల్ల సుకన్య వివాహం
పురాణాల్లో భృగు మహర్షి వృత్తాంతం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు. ఆయన కుమారుడు చ్యవనుడు. ముసలి వయసులో చ్యవనుడు కన్నెపిల్ల సుకన్యను పెళ్లి చేసుకుంటాడు. మొదటి చూపులోనే తన అందానికి పరవశితుడవుతాడు. తన అందాన్ని కామించి, ప్రేమించి ఆమె తండ్రిని ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు.