Sugar Levels: ఉన్నపలంగా షుగర్ లెవెల్స్ పడిపోతే ఏం చేయాలో తెలుసా?
ప్రస్తుత సమాజంలో చిన్న, పెద్ద అని తేడా లేకుండా చాలామందిని పట్టిపీడిస్తున్న సమస్య డయాబెటీస్. ఈ డయాబెటిస్
- By Nakshatra Published Date - 06:00 AM, Wed - 5 April 23
ప్రస్తుత సమాజంలో చిన్న, పెద్ద అని తేడా లేకుండా చాలామందిని పట్టిపీడిస్తున్న సమస్య డయాబెటీస్. ఈ డయాబెటిస్ ఇదివరకు రోజుల్లో కేవలం ముసలివారికి అలాగే వయసు మీద పడిన వారికి మాత్రమే వచ్చేది. కానీ రాను రాను మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల జీవనశైలిలో మార్పులు రావడంతో పాటుగా ఆహారపు అలవాట్లలో మార్పులు రావడంతో షుగర్ వ్యాధి చిన్న వయసు వారికి వస్తోంది. దీంతో రక్తంలోని షుగర్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం కోసం ఎంతో ఇష్టమైన తిండిని కూడా తినలేక చాలామంది అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
డయాబెటిస్ ఉన్నవారు ఎటువంటి పదార్థాలు తినాలి అన్న కూడా సంకోచిస్తూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు ఉన్నపలంగా ఒక్కసారిగా షుగర్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి.. అటువంటి సమయంలో చాలామందికి ఏం చియాలో తెలియక గాబరా పడుతూ ఉంటారు. మరి ఉన్నఫలంగా షుగర్ లెవెల్స్ పడిపోతే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వారు తరచూ మెడిసిన్స్ యూస్ చేస్తూ ఉండాలి. రక్తంలో షుగర్ లెవెల్స్ పెంచే ఫుడ్స్ ని కాకుండా ఇతర ఫుడ్స్ ని తీసుకోవడం మంచిది. మరి రక్తంలో షుగర్ లెవెల్స్ ఎందుకు పడిపోతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మన శరీరంలో గ్లూకోజ్ స్థాయి 70 mg/dL కంటే తక్కువగా ఉంటే రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. టైప్ 1 మధుమేహ రోగుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా ఇన్సులిన్ తీసుకునే వారిలో ఈ రకమైన ఫలితాలు కనిపిస్తాయి. కొందరి రక్తంలో షుగర్ లెవల్స్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే ఏం చేయాలో తెలియదు. వైద్యులపై ఆధారపడకుండా తక్షణమే రక్తంలో చక్కెర స్థాయి పెంపొందించుకునేందుకు ప్రయత్నించాలి. వెంటనే ఒక చాక్లెట్, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్, కాసింత చక్కెర నోట్లో వేసుకోవాలి. షుగర్ లెవల్స్ పడిపోవడానికి అసలు కారణం టైంకు ఆహారం తీసుకోకపోవడం, ప్రొటీన్ ఫుడ్ తీసుకోకపోవడం, సరిపడా నిద్రలేకపోవడం, ఇన్సులిన్ మాత్రలను తీసుకోకపోవడం, అధిక పని ఒత్తిడి, నిద్రలేమి, ఆడవారిలో రుతుక్రమంలో మార్పులు వంటి కారణాల వలన రక్తంలో చక్కెర స్థాయి నిల్వలు తగ్గుతాయి. అందుకే తరచూ పండ్లు తినాలి. రక్తంలో షుగర్ లెవల్స్ సాధారణ స్థితికి వచ్చాక ఫైబర్ ,ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
Tags
Related News
Diabetes: అమ్మో.. మధుమేహం.. ఈ అలవాట్లు ఉంటే వెంటనే చెక్ పెట్టండి
Diabetes: రక్తంలో చక్కెర స్థాయి సాధారణం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మధుమేహం వస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధిగా పరిగణించబడుతుంది, ఎందుకంటే దీనికి చికిత్స లేదు. ఇది మాత్రమే నియంత్రించబడుతుంది. 2021 సంవత్సరంలో విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 537 మిలియన్లు అంటే 20-79 సంవత్సరాల వయస్సు గల 53.7 కోట్ల మందికి పైగా ఈ వ్యాధి బారిన పడ్డారు. 2045 నాటికి, ఈ సంఖ్య 783 మిలియన్లకు అంటే 78.3 కోట్లకు పెరుగుతుందన�