Dry Eyes : మీ కళ్లు పొడిబారుతున్నాయా? అయితే ఈ చిట్కాలు పాటించండి
Dry Eyes : ప్రతీ 20 నిమిషాలకు 20 సెకన్ల పాటు కళ్లను మూసి విశ్రాంతి ఇవ్వడం మంచిది. స్క్రీన్ను కళ్లకు తక్కువ ఎత్తులో ఉంచుకోవడం
- By Sudheer Published Date - 05:31 PM, Wed - 12 March 25

ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు ఎక్కువగా ఉపయోగించడం వల్ల చాలా మందికి కళ్ల పొడిబారడం (Dry Eyes) సమస్యగా మారుతోంది. దీని వల్ల కళ్లు ఎర్రబడడం, మంట, నీరు కారడం, తిప్పలు, కంటి దురద వంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా కంప్యూటర్ ముందు ఎక్కువ సమయం పనిచేసేవారికి ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది.
PhonePe : కస్టమర్లు షాక్ ఇస్తున్న ఫోన్ పే
దీన్ని తగ్గించుకోవాలంటే మధ్య మధ్యలో కళ్లకు విరామం ఇవ్వాలి. ప్రతీ 20 నిమిషాలకు 20 సెకన్ల పాటు కళ్లను మూసి విశ్రాంతి ఇవ్వడం మంచిది. స్క్రీన్ను కళ్లకు తక్కువ ఎత్తులో ఉంచుకోవడం, రాత్రివేళల్లో మొబైల్ ఫోన్ వాడకాన్ని తగ్గించడం ద్వారా కంటిచూపును మెరుగుపరచుకోవచ్చు. చాలా మంది ఏసీ, కూలర్ గాలిని నేరుగా కళ్లపైకి అనుమతిస్తారు, ఇది పొడిదనాన్ని మరింత పెంచుతుంది. అందుకే వాటిని తగ్గించడం లేదా దారిమార్చడం అవసరం.
Amaravati Relaunch : మోడీ చేతుల మీదుగా అమరావతి రీ లాంఛ్
కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి గోరువెచ్చని నీటితో కళ్లను శుభ్రపరచడం మంచి అలవాటు. అలాగే బ్లూ లైట్ ఫిల్టర్ గ్లాసెస్ వాడటం వల్ల స్క్రీన్ వెలుతురి ప్రభావం తగ్గుతుంది. విటమిన్ A, C, E సమృద్ధిగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల కంటి పొడిదనాన్ని నివారించుకోవచ్చు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే డ్రై ఐస్ సమస్య నుండి బయటపడవచ్చు.