Pomegranate: దానిమ్మ పండ్లు ఎక్కువగా తింటున్నారా.. అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాల్సిందే?
దానిమ్మ పండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. దానిమ్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కాగా ప్రస్తుతం మనకు మా
- By Nakshatra Published Date - 10:30 AM, Fri - 9 February 24
దానిమ్మ పండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. దానిమ్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కాగా ప్రస్తుతం మనకు మార్కెట్లో ఈ దానిమ్మ పండ్లు ఏడాది పొడవునా లభిస్తూ ఉంటాయి. వీటి ధర కాస్త ఎక్కువే అయినప్పటికి వీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో. ఇది గుండె పనితీరును మెరుగుపరచడం దగ్గర నుంచి రోగనిరోధక శక్తిని పెంచే వరకు దానిమ్మ పండు మనకు చేసే మేలు అంతా కాదు. అయితే దానిమ్మ పండు శరీరం లోపలికి కాదు బయటికి కూడా ఎంత హెల్ప్ చేస్తుంది. చర్మం మృదువుగా చేస్తుంది. ముడతలు రాకుండా చూస్తుంది.
చర్మం మీద ఉండే మచ్చల్ని పోగొడుతుంది. కాబట్టి దానిమ్మ పండుని మీరు మీ స్కిన్ కేర్ రొటీన్ లో భాగం చేసుకోవడం వల్ల న్యాచురల్ ఆయిల్ పోకుండా మురికి జిడ్డు మాత్రమే పోతాయి. దానిమ్మ పండు మంచిదే కదా అని అధికంగా తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవు అంటున్నారు నిపుణులు. మరి దానిమ్మ పండు అతిగా తీసుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శరీరంలో రక్త కొరతను తీర్చడానికి దానిమ్మను ఉపయోగిస్తారు. కానీ దానిమ్మ పండును అధికంగా తీసుకుంటే అది శరీరానికి చాలా హాని కలిగిస్తుంది. దానిమ్మ పండును ఎక్కువగా తినడం వల్ల దగ్గు అలర్జీ, వంటి అనేక సమస్యలు వస్తాయి.షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా దానిమ్మను ఎక్కువగా తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది.
దానిమ్మ తీసుకోవడం వల్ల శరీరంపై ఎర్రటి దద్దుర్లు రావడంతో పాటు అలర్జీలు కూడా రావచ్చు ఇది సకాలంలో నియంత్రించబడకపోతే కొన్నిసార్లు తీవ్రమైన వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అలాగే ఎనర్జీ తో బాధపడేవారు కూడా దానిమ్మకు దూరంగా ఉండాలి. శరీరానికి దాని సొంత స్వభావం ఉంటుంది. మరి చల్లగా ఇస్తే నష్టం. వేడిగా ఇస్తే కూడా నష్టమే. దానిమ్మ పండు రుచి చల్లదనాన్ని ఇస్తుంది. దానిమ్మ పండును ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎసిడిటి వస్తుంది. కాబట్టి దానిమ్మ ఆరోగ్యానికి మంచిదే కదా అని ఎక్కువ తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవు.
Related News
Summer Care: ఎండాకాలంలో అదే పనిగా టీ, కాఫీ తాగుతున్నారా.. అయితే జర జాగ్రత్త
Summer Care: దేశంలోని పలు రాష్ట్రాల్లో విపరీతమైన వేడిగా ఉంది. ఎండ వేడిమిని తట్టుకునేందుకు ప్రజలు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా, ఆహార పానీయాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఒక సలహా జారీ చేసింది. కాఫీ, టీ మరియు ఆల్కహాల్ వంటి పానీయాలు తాగడం వల్ల డీహైడ్రేషన్ (నీటి కొరత) ఏర్పడుతుందని పేర్కొంది. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినకూడదని సలహాలో పేర్కొన్నారు. అలాగే స్�