Re-Heat: ఈ ఫుడ్స్ని మళ్ళీ వేడి చేసి తింటే డేంజర్..!
రాత్రి వండిన ఆహారం చాలా ఇళ్ళల్లో మిగులుతుంటుంది. అన్నింటినీ బయట పారేయలేం.
- By Maheswara Rao Nadella Published Date - 12:09 PM, Thu - 1 December 22

రాత్రి వండిన ఆహారం చాలా ఇళ్ళల్లో మిగులుతుంటుంది. అన్నింటినీ బయట పారేయలేం. కాబట్టి మీరైతే ఏం చేస్తారు? ఓ కంటెయినర్లో వేసి ఫ్రిజ్లో పెట్టి ఉదయాన్నే వేడి చేస్తారు. కొంతమంది నార్మల్గా వేడి చేస్తే మరికొంత మంది మైక్రోవేవ్ వాడతారు. అయితే, మైక్రోవేవ్లో కొన్ని ఫుడ్ ఐటెమ్స్ని అస్సలు మళ్ళీ వేడి చేయకూడని ఫుడ్స్ కొన్ని ఉన్నాయి. మళ్ళీ వేడి చేయడం వల్ల మీకు హాని జరుగుతుంది. అవి వేడి చేసి తినే బదులు పారేయడం మంచిది. అలా వేడి చేయకూడని పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
బంగాళాదుంప:
బంగాళాదుంపలను మళ్ళీ వేడిచేయొద్దు. ఎందుకంటే దీనిని వేడి చేయడం వల్ల అది కొన్నిసార్లు పాయిజన్లా మారుతుందట. దీనిని వేడి చేయడం వల్ల ఓ రకమైన బ్యాక్టీరియా వస్తుందట.
చికెన్:
మీరు వండిన చికెన్ మిగిలి ఉంటే, దానిని మరుసటి రోజు అలానే తినాలి. ఒక వేళ వేడి చేయాలనుకుంటే చిన్న మంటపై కొద్దిగా వేడి చేయాలి. చికెన్ని ఫ్రిజ్లో నుంచి తీసి మైక్రోవేవ్లో ఒకేసారి వేడి చేస్తే చికెన్లోని ప్రోటీన్స్ మారతాయి. ఇది కడుపులో సమస్యని సృష్టిస్తుంది.
అన్నం:
అన్నాన్ని మళ్ళీ వేడి చేయడం మంచిది కాదు. ఇది బ్యాక్టీరియాకు కారణంగా మారుతుంది. మీరు వేడి చేయాలనుకుంటే ముందు గది ఉష్ణోగ్రత వచ్చే వరకూ ఉండనివ్వండి. ఫ్రిజ్ నుంచి బయటకు తీసినప్పుడు నేరుగా మైక్రోవేవ్లోనే ఉంచండి. ఇంకా మంచిది. దీన్ని ఒకేసారి తినండి. ఇంకా మిగిలి ఉంటే పారేయడం మంచిది.
సెలెరీ:
మీరు చాలా సూప్స్లో సెలెరీ వాడతారు. కానీ, మీకు ఏదైనా సూప్ మిగిలి ఉంటే, సెలెరీని తీసేయడం ఉత్తమం. సెలెరీలో నైట్రేట్స్ ఉంటాయి. అవి వేడి చేసినప్పుడు పాయిజన్లా మారతాయి. దీని వల్ల గుండెకి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
గుడ్లు:
గుడ్లు మళ్ళీ వేడి చేసిన వెంటనే తినడం మంచిది. లేదా వాటిని పారేయండి. మళ్ళీ వేడి చేసి తినడం వల్ల శరీరానికి హాని కలిగించే టాక్సిన్స్ విడుదలవుతాయి.