Evening Puja : సాయంత్రం దేవుడిని పూజించేటప్పుడు ఈ మంత్రాలు పఠించండి.. అదృష్టం కలిసి వస్తుంది..!!
హిందూ గ్రంధాల ప్రకారం, ఉదయం, సాయంత్రం దీపం వెలిగించి దేవుడిని ఆరాధించడంతో పాటు, మంత్రాలను పఠించడం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జీవితంలో సానుకూల శక్తిని పెంచుతుంది.
- By hashtagu Published Date - 01:30 PM, Thu - 21 July 22
హిందూ గ్రంధాల ప్రకారం, ఉదయం, సాయంత్రం దీపం వెలిగించి దేవుడిని ఆరాధించడంతో పాటు, మంత్రాలను పఠించడం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జీవితంలో సానుకూల శక్తిని పెంచుతుంది. ఆనందం ,శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు. సనాతన ధర్మంలో ఉదయం పూట మాత్రమే కాదు సాయంత్రం పూజకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. అదేవిధంగా, శాస్త్రం ప్రకారం, సాయంత్రం పూజ సమయంలో ఈ 4 మంత్రాలను జపించడం వల్ల మీ ఆనందం, అదృష్టం రెట్టింపు అవుతుంది.
సాయంత్రం పూజ
సాయంత్రం ఈ 4 మంత్రాలను పఠించడం ఫలవంతంగా పరిగణించబడుతుంది:
1. “కితః పతండః మషకః చ వృక్షః.”
జలే తోలహే యే నివాసంతి జీవాః
దృష్ట్వా ప్రదీపం చ జన్మ భజః
సుఖినః భవన్తు శ్వపచః హి విప్రాః”
ఈ మంత్రం అర్థం:
ఈ మంత్రోచ్ఛారణతో ఎవరైతే దీపం వెలిగిస్తారో, ఎవరైతే ఈ దీప దర్శనం పొందుతారో, వారు క్రిములు, చిమ్మటలు, పక్షులు, చెట్లు ,మొక్కలు, ఈ భూమిపై ఉన్న జీవులు లేదా నీటిలో కనిపించే జీవులు అనుగ్రహం పొందుతారు. అది మానవుడైనా లేదా ఏ జీవి అయినా, అతని పాపాలన్నీ నశిస్తాయి. అదే సమయంలో అతను జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతాడు. ఆ ఆత్మ ఎప్పుడూ ఆనందాన్ని పొందుతుంది.
పూజ:
2. “శుభం కరోతి కల్యాణం ఆరోగ్యం ధనసంపద”.
నేస్తుర్బుద్ధివినాశాయ దీపకాయ నమోస్తుతే ||”
ఈ మంత్రం అర్థం:
ఐశ్వర్యాన్ని ప్రసాదించే, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, సంపదలను ప్రసాదించే, శత్రువుల మేధస్సును నాశనం చేసే అద్భుతమైన దీప జ్వాలకి నమస్కరిస్తున్నాను.
3. ”అంతర్జ్యోతిర్బహిర్జ్యోతిః ప్రత్యగ్జ్యోతిః పరాత్పరః|
జ్యోతిర్జ్యోతిః స్వయంజ్యోతిరాత్మజ్యోతిః శివోస్మ్యహమ్||”
ఈ మంత్రం అర్థం:
నాలోపల ఉన్న దివ్యకాంతి , లోకంలో ప్రసరించిన కాంతి ఒకటే. అన్ని కాంతి కిరణాలకు మూలం ఆ పరమాత్ముడు, శివుడు. ఈ దీపాన్ని రోజూ వెలిగిస్తానని ప్రమాణం చేస్తున్నాను.
4. దీపో జ్యోతి పరం బ్రహ్మ దీపో జ్యోతిర్జనార్దనః.
దీపో హర్తు మే పాపం సంధ్యాదీప నమోస్తుతే||”
ఈ మంత్రంఅర్థం:
సాయంత్రం వెలిగించిన దీపం యొక్క జ్వాల ఆ పరమ బ్రహ్మకు ,సత్పురుషులకు అంకితం చేయబడింది. విష్ణువుకు అంకితం చేయబడింది. ఈ దీపం నా పాపాన్ని నాశనం చేయుగాక, ఓ సాయంత్రం దీపమా, నీకు నమస్కరిస్తున్నాను.
సాయంత్రం పూట దేవుడికి దీపం వెలిగిస్తూ ఈ 4 మంత్రాలను పఠించడం వల్ల ద్విగుణీకృత పూజలు చేసిన ఫలితం దక్కుతుంది. ఆరాధన సరైన ఆచారాలతో – పద్ధతితో పూర్తవుతుంది. సాయంకాల పూజలో పై 4 మంత్రాలను చేర్చడం చాలా ముఖ్యం.
Related News
Sunday: ఆదివారం రోజు ఈ వస్తువులను దానం చేస్తే చాలు.. మీ ఇంట కాసుల వర్షమే?
హిందువులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడిని ప్రత్యేకంగా భక్తి శ్రద్దలతోతో పూజిస్తూ ఉంటారు. ఒక్క వారం ఒక దేవుడికి అంకితం చేయబడింది. అలా ఆదివారం