Ganesha Stotram : అప్పుల బాధ ఈ ఒక్క మంత్రంతో మాయం అవుతాయి…ప్రతి బుధవారం ఈ పని చేయండి…
అప్పుల బాధ తట్టుకోలేకపోతున్నారా, రుణం తీర్చాలని ఎంత ప్రయత్నించినా తీరడం లేదా, అయితే ఆధ్యాత్మికంగా కొన్ని పరష్కారాలు మీ కోసం మన పెద్దలు సూచించారు.
- By hashtagu Published Date - 06:00 AM, Sun - 19 June 22
అప్పుల బాధ తట్టుకోలేకపోతున్నారా, రుణం తీర్చాలని ఎంత ప్రయత్నించినా తీరడం లేదా, అయితే ఆధ్యాత్మికంగా కొన్ని పరష్కారాలు మీ కోసం మన పెద్దలు సూచించారు. అందులో ముఖ్యమైనది శ్రీ గణేష రుణ విమోచన స్తోత్రం, ఈ స్తోత్రాన్ని నిష్టతో ప్రతి బుధవారం, తెల్లవారు జామున లేచి తల స్నానం చేసి, తడిబట్టలతో మడి కట్టుకొని, మనస్సులో గణేషుడిని తలచుకొని రుణ విమోచన గణేశ స్తోత్రం చదవాలి, ఈ స్తోత్రం 21 బుధవారాలు చదివితే, మీ కష్టాలు నెమ్మదిగా దూరం అవుతాయి. సంతోషం మీ ఇంట తాండవిస్తుంది.
రుణ విమోచన గణేశ స్తోత్రం
ధ్యానం
సిందూరవర్ణం ద్విభుజం గణేశం లంబోదరం పద్మదళే నివిష్టం
బ్రహ్మాదిదేవైః పరిసేవ్యమానం సిద్ధైర్యుతం తం ప్రణమామి దేవం ||
స్తోత్రం
సృష్ట్యాదౌ బ్రహ్మణా సమ్యక్పూజితః ఫలసిద్ధయే
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే
త్రిపురస్యవధాత్పూర్వం శంభునా సమ్యగర్చితః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే
హిరణ్యకశ్యపాదీనాం వదార్థే విష్ణునార్చితః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే
మహిషస్యవధే దేవ్యా గణనాథః ప్రపూజితః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే
తారకస్య వధాత్పూర్వం కుమారేణ ప్రపూజితః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే
భాస్కరేణ గణేశోహి పూజితశ్చ సుశిద్ధయే
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే
శశినా కాంతివృద్ధ్యర్థం పూజితో గణనాయకః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే
పాలనయ చ తపసాం విశ్వామిత్రేణ పూజితః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే
ఇదం ఋణహరం స్తోత్రం తీవ్ర దారిద్ర్య నాశనం
ఏకవారం పఠేన్నిత్యం వర్షమేకం సమాహితః
దారిద్ర్యం దారుణం త్యక్త్వా కుబేర సమతాం వ్రజేత్
పఠంతోఽయం మహామంత్రః సార్థ పంచదశాక్షరః
శ్రీ గణేశం ఋణం ఛింది వరేణ్యం హుం నమః ఫట్
ఇమం మంత్రం పఠేదంతే తతశ్చ శుచిభావనః
ఏకవింశతి సంఖ్యాభిః పురశ్చరణ మీరితం
సహస్రవర్తన సమ్యక్ షణ్మాసం ప్రియతాం వ్రజేత్
బృహస్పతి సమో జ్ఞానే ధనే ధనపతిర్భవేత్
అస్యైవాయుత సంఖ్యాభిః పురశ్చరణ మీరితః
లక్షమావర్తనాత్ సమ్యగ్వాంఛితం ఫలమాప్నుయాత్
భూత ప్రేత పిశాచానాం నాశనం స్మృతిమాత్రతః
Related News
Diwali 2023: లక్ష్మీ దేవి, గణేశుడి విగ్రహాలకు ఈ మార్కెట్ ఉత్తమం
దీపావళి రోజున లక్ష్మీ దేవిని, గణేశుడిని పూజించడం ఆనవాయితీ. ఈ పూజ కోసం కొత్త విగ్రహాలను కొనుగోలు చేస్తారు. దీపావళి రోజు సాయంత్రం రంగోలీని తయారు చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.