Indian Railways: “పుణ్య్ తీర్థ యాత్ర” : పూరి – అయోధ్య – వారణాసి టూర్ కోసం ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ
భక్తుల కోసం ఐఆర్సీటీసీ సరికొత్త టూర్ ప్యాకేజీతో ముందుకు వచ్చింది. దీని పేరు "పుణ్య్ తీర్థ యాత్ర".
- By Hashtag U Published Date - 07:30 AM, Wed - 24 August 22
భక్తుల కోసం ఐఆర్సీటీసీ సరికొత్త టూర్ ప్యాకేజీతో ముందుకు వచ్చింది. దీని పేరు “పుణ్య్ తీర్థ యాత్ర”. ఇందులో భాగంగా పూరి, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ రాజ్ సహా పలు తీర్థ యాత్రా ప్రదేశాలను చూసి రావచ్చు. ఈ ప్యాకేజీలోనే రైలు ఖర్చులు, బస్సు ఖర్చులు, భోజన ఖర్చులు, టూరిస్ట్ గైడ్ సౌకర్యం, బీమా వంటివన్నీ కలిసి ఉంటాయి.దీని గురించి పూర్తి వివరాలు ఇవి..
కేంద్ర రైల్వేశాఖ కార్యక్రమం స్వదేశ్ దర్శన్ లో భాగంగా “పుణ్య్ తీర్థ యాత్ర” ప్యాకేజీ అందిస్తున్నారు. ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఎందుకంటే.. అన్ని ఖర్చులు ఒకే ప్యాకేజీ లో కలిసి ఉంటాయి. మొత్తం 9 రాత్రులు.. 10 రోజుల పాటు ఈ టూర్ కొనసాగుతుంది.
కంఫర్ట్ కేటగిరి : కంఫర్ట్ కేటగిరి అంటే థర్డ్ ఏసీ.ఇందులో టికెట్ల రేట్లు కొంచెం ఎక్కువ. థర్డ్ ఏసీలో సింగిల్ కేటగిరి సీటు ధర రూ.32050.డబుల్ కేటగిరి సీటు ధర రూ.30800.ట్రిపుల్ కేటగిరి సీటు ధర రూ.30200.
స్టాండర్డ్ కేటగిరి : స్టాండర్డ్ కేటగిరి అంటే స్లీపర్ క్లాస్. ఇందులో టికెట్ల రేట్లు కొంచెం తక్కువే. దీనిలోని సింగిల్ కేటగిరి సీటు ధర రూ.23400.డబుల్ కేటగిరి సీటు ధర రూ.22150.ట్రిపుల్ కేటగిరి సీటు ధర రూ.21550.
ఎక్కడ ఎక్కాలి? టూర్ ఎలా ?
* ఈ టూర్ కు సంబంధించిన రైలు కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు నుంచి అక్టోబర్ 9న ప్రారంభం అవుతుంది.
* 10వ తారీఖు మొత్తం ట్రైను ప్రయణంలోనే గడపాలి.
* అక్టోబర్ 11న పూరికి చేరుకుంటారు. అక్కడ దిగి..జగన్నాధ్ మందిరం, కోణార్క్ మందిరం దర్శించుకుంటారు.
* అక్టోబర్12న మధ్యాహ్నం ఇదే ట్రైన్ లో బయలుదేరి తొలుత గయకు.. ఆ తర్వాత వారణాసికి చేరుకుంటారు.
* అక్టోబర్14న వారణాసిలోని గంగా నదిలో పుణ్య స్నానం చేయొచ్చు. కాశీలోని అన్ని ఆలయాలను దర్శించుకుంటారు.
* అక్టోబర్ 15న రైలు అయోధ్యకు చేరుకుంటుంది. అక్కడ సరయూ నది, రామాజన్మ భూమిని భక్తులు దర్శించుకుంటారు.
* అక్టోబర్16న టూర్ ప్రయాగ రాజ్ కు చేరుతుంది. అక్కడ త్రివేణి సంగమంలో పుణ్య స్నానం చేయొచ్చు.
* అక్టోబర్17న రైల్ వెనక్కి మళ్లుతుంది. బెంగళూరు, మైసూరుకు చేరుకుంటుంది.
Related News
Photo of The Day : మోడీ నామినేషన్ లో చంద్రబాబు & పవన్ కళ్యాణ్
2047కు వికసిత్ భారత్ లక్ష్యంగా మోదీ కృషిచేస్తున్నట్లు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్టీఏకు 400కు పైగా సీట్లు వస్తాయని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు