HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Devotional
  • >Prayagraj Maha Kumbh Mela Is Over These Are The Details Of Next Kumbh Melas

Upcoming Kumbh Melas: ముగిసిన మహా కుంభమేళా.. తదుపరి కుంభమేళాలు ఇవే..

కుంభమేళా(Upcoming Kumbh Melas) అనేది  ప్రతి నాలుగేళ్లకు ఓసారి జరుగుతుంది. మహా కుంభమేళా  144 సంవత్సరాలకు ఓసారి జరుగుతుంది.

  • By Pasha Published Date - 05:33 PM, Wed - 26 February 25
  • daily-hunt
Upcoming Kumbh Melas Prayagraj Maha Kumbh Mela 2025

Upcoming Kumbh Melas:  పరమ పవిత్రమైన ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా ఈరోజు(ఫిబ్రవరి 26)తో ముగియనుంది.  144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మేళాలో 65 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు. జనవరి 13న మొదలైన ఈ మేళాలో ఎంతోమంది వీఐపీలు కూడా భక్తిభావంతో పాల్గొన్నారు.  ఈ మేళా కోసం ఉత్తరప్రదేశ్‌లోని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అద్భుతమైన ఏర్పాట్లు చేసింది. తదుపరిగా జరగబోయే కుంభ మేళాల గురించి తెలుసుకుందాం..

Also Read :PK Vs Dhoni : ధోనీని దాటేస్తా.. విజయ్‌ను గెలిపిస్తా.. ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు

తదుపరి కుంభమేళాల గురించి.. 

  • కుంభమేళా(Upcoming Kumbh Melas) అనేది  ప్రతి నాలుగేళ్లకు ఓసారి జరుగుతుంది. మహా కుంభమేళా  144 సంవత్సరాలకు ఓసారి జరుగుతుంది.
  • ప్రయాగ్‌రాజ్‌లో తదుపరి మహా కుంభమేళా 2169 సంవత్సరంలో జరుగుతుంది.
  • రాబోయే ఐదేళ్లలో నాలుగు కుంభమేళాలు మన దేశంలో జరుగుతాయి.
  • 2027లో ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌‌లో,  మహారాష్ట్రలోని నాసిక్‌లో కుంభమేళాలు జరుగుతాయి.
  • 2027లో హరిద్వార్‌‌లో జరగబోయేది అర్ధ కుంభమేళా.  నాసిక్‌లో  జరగబోయేది  పూర్ణ కుంభమేళా. గోదావరి నది పవిత్ర ఒడ్డున నాసిక్ నుంచి 38 కి.మీ దూరంలోని త్రయంబకేశ్వర్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది.
  • అర్ధ కుంభమేళా ఆరేళ్లకు ఒకసారి వస్తుంది.
  • పూర్ణ కుంభమేళా 12 ఏళ్లకు ఒకసారి వస్తుంది.
  • 2028లో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో కుంభమేళా జరుగుతుంది. ఇది పూర్ణ కుంభమేళా.  శిప్రా నది ఒడ్డున సింహస్థ కుంభమేళాను నిర్వహించనున్నారు.ఇందుకోసం ఉజ్జయినిలో 3,300 హెక్టార్ల విస్తీర్ణంలో ఆధ్యాత్మిక నగరాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
  • 2030లో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌‌లో అర్ధ కుంభమేళా జరుగుతుంది.

Also Read :MLC Vote : ‘ఎమ్మెల్సీ’ ఓటు వేయబోతున్నారా ? ఇవి తప్పకుండా తెలుసుకోండి

తదుపరి మహాకుంభ మేళా మట్టి మీదే.. ప్రధానికి వాంగ్​చుక్  లేఖ

మహా కుంభమేళా నేపథ్యంలో లద్దాఖ్​కి చెందిన పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్​ వాంగ్​చుక్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాశారు. 144ఏళ్ల తర్వాత మహా కుంభమేళా జరిగే సమయానికి నదులు ఎండిపోయే ముప్పు ఉందని ఆయన హెచ్చరించారు.  మట్టి మీద మహాకుంభ మేళాను చేసుకోవాల్సి రావొచ్చన్నారు. భార‌త్‌లోని ప్రధాన నదులకు మూలమైన హిమాలయ హిమానీనదాలు కరిగిపోతున్నాయనే విషయాన్ని ప్రధాని మోడీ గుర్తుంచుకోవాలని వాంగ్ చుక్ సూచించారు. హిమానీనదాలను కాపాడుకోవాలని కోరారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Kumbh Melas
  • Maha Kumbh
  • prayagraj
  • Prayagraj Maha Kumbh Mela
  • Upcoming Kumbh Melas

Related News

Crime

Shocking : మనవడినే బలి ఇచ్చిన తాతయ్య.. షాకింగ్ నిజాలు

Shocking : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో చోటు చేసుకున్న ఘోర హత్యా ఘటన ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. 11వ తరగతి విద్యార్థి పీయూష్ సింగ్ అలియాస్ యశ్‌ను అమానుషంగా హత్య చేసిన ఈ కేసు రోజురోజుకు కొత్త కొత్త విషయాలను బయటపెడుతోంది.

    Latest News

    • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

    • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

    • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

    • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

    • CM Revanth Reddy : నిమజ్జనంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd