Sashtanga Namaskara: స్త్రీలు సాష్టాంగ నమస్కారం ఎలా చేయాలో తెలుసా?
సాధారణంగా మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు దేవుడు ఎదురుగా నమస్కారం లేదంటే సాష్టాంగ నమస్కారం చేస్తూ
- By Nakshatra Published Date - 06:00 AM, Sun - 20 November 22
సాధారణంగా మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు దేవుడు ఎదురుగా నమస్కారం లేదంటే సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటారు. సాష్టాంగ నమస్కారం చేయడం వల్ల అది మీ మానసిక శారీరక సామర్ధ్యాలను పెంచుతుంది. అయితే సాష్టాంగ నమస్కారం విషయంలో కొన్ని రకాల నియమాలను తప్పకుండా పాటించాలి. మరి నమస్కారం ఏ విధంగా చేయాలి? మరి ముఖ్యంగా మహిళలు ఏ విధంగా సాష్టాంగ నమస్కారం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాష్టాంగ నమస్కారం అంటే మన శరీరంలోని ఎనిమిది భాగాలను ఉపయోగించి చేసే నమస్కారాన్ని సాష్టాంగ నమస్కారం అని అంటూ ఉంటారు.
శాస్త్రంలో స్త్రీలు సాష్టాంగం నుండి పరిమితం చేయబడ్డారు. ఎందుకంటే వారి ఛాతీ ప్రాంతం, పొట్ట భాగాలు నేలను తాకకూడదు. స్త్రీలు పంచాంగ నమస్కారం చేయాలి. ఎందుకంటె స్త్రీ తన బిడ్డకు పాలిచ్చి తన కడుపులోని బిడ్డను 9 నెలల పాటు కాపాడుతుంది. ఇది భూమిని తాకకూడదు, ఎందుకంటే ఇవి జీవం, పెరుగుదలను ఇవ్వగల అవయవాలు. అలాగే పూర్వం స్త్రీలు రుతుక్రమం కాగానే పెళ్లి చేసుకునేవారు. పెళ్లయినప్పటి నుంచి ఏటా పిల్లలు పుట్టారు. దీని కారణంగా, ఆమె తన జీవితంలో ఎక్కువ భాగం ఎల్లప్పుడూ బసురి బాలింత పాలిచ్చేది.
ఈ సమయంలో సాష్టాంగ నమస్కారం చేయడం కష్టమని హేతుబద్ధమైన కారణం కూడా ఉందంటున్నారు. అలాగే ఆలయంలో దేవుడి ముందు సాష్టాంగ నమస్కారం చేయడం వల్ల భక్తుల పాద దూళి మన శరీరాన్ని తాకుతుంది. మన శరీరాన్ని తాకిన ధూళికణాల సంఖ్యకు సమానంగా విష్ణులోకం లో ఏళ్ల తరబడి నివసించే చోటు లభిస్తుంది. వంద జన్మలలో చేసిన పాపాలు తొలగిపోతాయి. సాష్టాంగ నమస్కారం గరిష్ట, సరైన ఫలితాలను పొందడానికి ప్రతిరోజూ క్రమం తప్పకుండా సాష్టాంగ నమస్కారం చేయాలి.
Related News
Free Bus : సీటు కోసం బస్సులో కొట్టుకున్న మగవారు
తొర్రూర్ నుంచి ఉప్పల్ వైపు వస్తున్న బస్సులో భర్తలు తమ భార్యలకు సీటు కోసం కర్చీఫ్ వేశారు