KFC In Ayodhya: అయోధ్యలో కేఎఫ్సీ.. కానీ నాన్ వెజ్కు మాత్రం నో ఎంట్రీ..!
ఇప్పుడు అమెరికన్ ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం కెంటకీ ఫ్రైడ్ చికెన్ (KFC In Ayodhya) కూడా అయోధ్యలో తన సొంత దుకాణాన్ని తెరవడానికి ప్రయత్నిస్తోంది.
- By Gopichand Published Date - 09:02 AM, Thu - 8 February 24
KFC In Ayodhya: జనవరి 22న అయోధ్యలో రాంలాలా మహా సంప్రోక్షణ జరిగింది. మరుసటి రోజు అంటే జనవరి 23వ తేదీ నుంచి దేశం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య ఐదు లక్షలకు చేరుకుంది. అప్పటి నుంచి పెద్ద సంఖ్యలో రామభక్తులు అయోధ్యకు చేరుకుని స్వామివారిని దర్శించుకుంటున్నారు. అనేక బహుళజాతి బ్రాండ్లు తమ ఔట్లెట్లను ఇక్కడ తెరవాలని కోరుకోవడానికి ఇదే కారణం.
ఇప్పుడు అమెరికన్ ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం కెంటకీ ఫ్రైడ్ చికెన్ (KFC In Ayodhya) కూడా అయోధ్యలో తన సొంత దుకాణాన్ని తెరవడానికి ప్రయత్నిస్తోంది. ఈ విషయమై అయోధ్య డీఎం నితీష్ కుమార్ మాట్లాడుతూ కేఎఫ్సీ సహా అన్ని బ్రాండ్లు అయోధ్యలో తమ ఔట్లెట్లను తెరవవచ్చని తెలిపారు. అయితే నాన్ వెజ, మద్యం అందించడం, అమ్మడంపై నిషేధం ఉన్న అయోధ్య ప్రాంతంలో కంపెనీలు తమ అవుట్లెట్లను తెరిస్తే వారు తమ మెనూలో మార్పులు చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
Also Read: Dark Circles: 3 రోజుల్లో డార్క్ సర్కిల్స్ మాయం అవ్వాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే?
శాఖాహార విధానాన్ని అనుసరించాలి- DM
అయోధ్యలోని నిషేధిత ప్రాంతాల్లో కేఎఫ్సీ నాన్వెజ్ వస్తువులను అందించదని డీఎం నితీశ్ కుమార్ తెలిపారు. అయోధ్యలోని మిగిలిన ప్రాంతాల్లో ఔట్లెట్లు తెరవడానికి ఎలాంటి పరిమితి లేదు. అమెరికన్ KFC దాని చికెన్కు ప్రసిద్ధి చెందింది. కానీ, అయోధ్యలో తన ఔట్లెట్లను తెరవాలంటే మాత్రం ఇక్కడ శాఖాహార విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది.
We’re now on WhatsApp : Click to Join
అయోధ్యలో పిజ్జా-పాస్తా దుకాణాలు తెరిచారు
పంచ కోసి పరిక్రమకు 15 కిలోమీటర్ల పరిధిలోని రామాలయానికి సంబంధించిన పవిత్ర స్థలాల్లో మాంసాహారం, మద్యం అమ్మకాలను నిషేధించడం గమనార్హం. అయోధ్యకు రోజుకు సగటున 2 లక్షల మంది భక్తులు దర్శనం కోసం వస్తున్నారు. అందువల్ల ఇక్కడ పెద్ద సంఖ్యలో హోటళ్లు, రెస్టారెంట్ల వ్యాపారం కూడా వేగంగా పెరుగుతోంది. స్థానిక వంటకాలతో పాటు పెద్ద సంఖ్యలో పిజ్జా, పాస్తా దుకాణాలు కూడా ఇక్కడ తెరవబడ్డాయి.
Related News
Ayodhya Ram Temple: మూడు నెలల్లో అయోధ్య రామయ్యను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా..?
జనవరి 22, 2024న రామజన్మభూమి అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగింది.