Thursday: గురువారం రోజు శంఖంతో ఇలా చేస్తే చాలు.. జీవితంలో అలాంటి మార్పులు!
గురువారం రోజు శంఖంతో కొన్ని రకాల పరిహారాలు చేయడం వల్ల అనేక సమస్యలు తీరుడంతో పాటు జీవితంలో సంతోషం నెలకొంటుందని చెబుతున్నారు.
- By Anshu Published Date - 11:34 AM, Tue - 11 February 25

వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. అలా గురువారం రోజు విష్ణువు, బృహస్పతి, సాయిబాబా, రాఘవేంద్ర స్వాములకు అంకితం చేయబడింది. జాతకంలో బృహస్పతి దోషం ఉన్నవారు లేదా బృహస్పతి బలహీన స్థితిలో ఉన్నవారు గురువారం బృహస్పతిని పూజించాలట. గురువారాల్లో పూజ చేయడం, శంఖానికి సంబంధించిన పనులు చేయడం వల్ల మీ జీవితం కూడా మారిపోతుందట. శంఖానికి మన జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలను దూరం చేసే శక్తి ఉంటుందని పండితులు చెబుతున్నారు. అయితే మరి అందుకోసం గురువారం రోజు శంఖంతో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
విష్ణువును పూజించేటప్పుడు శంఖం పెడితే త్వరలో విష్ణువు ప్రసన్నుడవుతాడట. ఈ రోజున శంఖంపై తిలకం వేయాలి. ప్రత్యేకించి, కుంకుమ తిలకం పూయడం ద్వారా శంఖాన్ని పూజించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుందట. శంఖాన్ని పూజించడం ద్వారా, విష్ణువుతో పాటు లక్ష్మీ మాత మీకు తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందట. గురువారం నాడు విష్ణుమూర్తికి పూజ, హారతి చేసేటప్పుడు మీరు తప్పనిసరిగా శంఖాన్ని ఉపయోగించాలని చెబుతున్నారు. ఇలా చేస్తే అది జాతకంలో బృహస్పతి స్థానాన్ని బలపరుస్తుంట. హిందూ మతంలో ఆరాధన సమయంలో శంఖం ఊదడం శుభప్రదంగా పరిగణించబడుతుందట. ముఖ్యంగా విష్ణువును పూజించేటప్పుడు తప్పకుండా చేస్తారు. శంఖాన్ని ఊదినప్పుడు అది చేసే శబ్దం ఇంట్లో సానుకూలతను తెస్తుందట. ఇంటి నుండి ప్రతికూలతను తొలగిస్తుందని చెబుతున్నారు.
అలాగే విష్ణువు అనుగ్రహం దక్కాలి అనుకుంటే గురువారం రోజు పూజ సమయంలో పూజలో తులసి ఆకులు, నీటితో నిండిన శంఖాన్ని ఉంచాలట. ఇలా చేయడం వల్ల జాతకంలో గ్రహాల స్థితిని బలోపేతం చేయవచ్చట. ఈ శంఖ పరిహారాన్ని గురువారం రోజున ఆచరిస్తే, విష్ణువుకు తులసి చాలా ప్రీతికరమైనది కనుక ఆ వ్యక్తి విష్ణువు అనుగ్రహాన్ని పొందుతాడట. గురువారాల్లో విష్ణువు ఆశీర్వాదం కోసం, ఒక శంఖాన్ని స్వచ్ఛమైన నీటితో నింపి, ఆ నీటిని సూర్య భగవానుడికి అర్ఘ్యంగా సమర్పించాలట. ఇది మీ ఇంటికి ఆనందం, శ్రేయస్సు, సంపదను తెస్తుందని పండితులు చెబుతున్నారు.