HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >How Offer Food Naivedyam God Rules Follow

Naivedyam: దేవుడికి నైవేద్యం సమర్పించే సమయంలో పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయకండి?

దేవుళ్లకు నైవేద్యం సమర్పించే సమయంలో కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదని చెబుతున్నారు పండితులు.

  • Author : Anshu Date : 19-09-2024 - 11:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Naivedyam
Naivedyam

మామూలుగా మనం ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రకమైన నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉంటాం. గుడిలో దేవుడికైనా ఇంట్లోని పూజ మందిరంలో ఉన్న దేవుడి కైనా మనం నైవేద్యాన్ని తప్పకుండా సమర్పిస్తూ ఉంటాం. ఇక దేవుళ్లకు ఇష్టమైన నైవేద్యాలను సమర్పించడం మంచిదే కానీ తెలిసి తెలియకుండా నైవేద్యాలు సమర్పించే సమయంలో కొన్ని తప్పులు అస్సలు చేయకూడదని చెబుతున్నారు పండితులు. నైవేద్యం ఎప్పుడూ వెండి, బంగారం, లేదా రాగి పాత్రల్లోనే పెట్టాలి. అలాగే నైవేద్యం ఎప్పుడు కూడా ప్లాస్టిక్, స్టీల్, లేదా గ్లాస్ గిన్నెలలో పెట్టకూడదు. నైవేద్యం ఎప్పుడు కూడా వేడిగా అస్సలు ఉండరాదు. అలా ఉంటే అది మహా పాపమే అవుతుంది. చాలా ముందుగా తయారు చేసినవి బాగా చల్లారి పోతాయి కనుక వాటిని నైవేద్యంగా పెట్టరాదని శాస్త్రం చెబుతోంది.

అప్పటికప్పుడు సిద్ధం చేసినవి చాలా వేడిగా వుంటాయి కనుక వాటిని నైవేద్యం పెట్టకూడదని అంటోంది. నైవేద్యం పెట్టేటప్పుడు ఎప్పుడూ మధ్యలో నీళ్ళు చల్లుతూ ఉండాలి. నైవేద్యం ఎప్పుడు కూడా చేసింది చేసినట్టుగా పెట్టాలి. కానీ దేవుడు కోసం విడిగా పెడితే అది మంచిది కాదు. ఈ నేపథ్యంలో కొంతమంది ముందుగానే నైవేద్యాలను తయారు చేసి పెట్టుకుంటే, మరికొందరు అప్పటికప్పుడు సిద్ధంచేసి పెడుతుంటారు. అయితే ఈ రెండు విధానాలు కూడా సరైనవికావని శాస్త్రం చెబుతోంది. బయట కొన్న వంటకాల్ని నైవేద్యం పెట్టకూడదట. అలాగే నిలవ ఉన్నవీ, పులిసిపోయినవనీ అయిన పదార్థాల్ని ఇంట్లో వండినా సరే నైవేద్యానికి పనికిరావు. తమ సొంత ఇంట్లోనూ, తమ సొంత ఆఫీసులోనూ నైవేద్యాన్ని యజమానులు మాత్రమే మాత్రమే స్వయంగా గానీ, తాము నియమించిన వేదబ్రాహ్మణుడు గానీ సమర్పించాలి.

ఇతరులు పనికిరారట. అలాగే అతి పులుపు,అతికారం గల నైవేద్యాలను కూడా దైవానికి సమర్పించకూడదట. ఇకపోతే నైవేద్యం పెట్టిన తర్వాత తప్పనిసరిగా హారతి ఇవ్వాలి. అది కూడా ఎవరైతే నైవేద్యం దేవుడికి పెడతారో వాళ్లే హారతి కూడా ఇవ్వాలి. నైవేద్యం ఇలా పెడితే చాలా మంచిది. నైవేద్యం పెట్టిన తర్వాత ఒక 5 నిముషాలు అలాగే వదిలేసి మనం పూజగదిలో నుండి వచ్చేయాలి. ఇలాగా చేస్తే దేవుడి చూపు ఆ ప్రసాదం పైన పడుతుంది. నైవేద్యం ఇలా పెడితే చాలా మంచిది. నైవేద్యం ఎవరైతే వండుతారో వాళ్లే నైవేద్యం దేవుడికి సమర్పించాలి. ఒక వేళ అల అవ్వని స్థితిలో స్వామివారిని నేను చేసిన ప్రసాదం నా తరపున ఫలానా వ్యక్తి పెడుతున్నారు. నైవేద్య అపరాదం ఉంటే క్షమించని అడగాలి. నైవేద్యంలో బెల్లం ముక్క, నేతి అభిఘారమూ తప్పనిసరిగా ఉండేట్లు చూసుకోవాలని చెబుతున్నారు. నైవేద్యం పెట్టే సమయంలో ఆహారా పదార్థాల చుట్టూ కుడిచేత్తో నీళ్ళు చిలకరించి సంబంధిత దేవతా స్త్రోత్రం చదవాలి.

ఏ కులస్థులైనా సరే, ఏ దేవీ దేవతలకైనా నైవేద్యం పెట్టేటప్పుడు ‘ఓం సత్యమ్ చిత్తేన పరిషించామి/ అమ్రుతమస్తు /అమ్రుతోపస్తరణమసి స్వాహా/ అని నైవేద్యం చుట్టూ నీటి బిందువుల్లి చిలకరించాలి. తర్వాత ఓం ప్రాణాయ స్వాహా ! ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా , ఓం సమానాయ స్వాహా , ఓమ్ బ్రహ్మణే స్వాహా , అని కుడిచేత్తో ఆహారపదార్థాల్ని దేవుడికి దేవతలకు చూపించాలి. మధ్యే మద్యదే పానీయం సమర్పయామి, అని నైవేద్యే పానీయం సమర్పయామి అని నైవదే్యం మీద మళ్ళ నీటిబిందువుల్ని ప్రోక్షించాలి. నమస్కరోమి అని సాస్టాంగం చేసి లేవాలి. నైవేద్యం కోసం ఏ పదార్థాలను వేడిగా తయారుచేసినా అవి గోరువెచ్చగా వున్నప్పుడు మాత్రమే దైవానికి సమర్పించాలని స్పష్టం చేస్తోంది. నైవేద్యం ఇలా పెడితే చాలా మంచిది. ఈ నియమాలను పాటించకుండా నైవేద్యాలను సమర్పించడం వలన ఉత్తమగతులు పొందే అవకాశాలు కోల్పోవడం జరుగుతుందని పండితులు చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • food
  • god
  • mistakes
  • naivedyam
  • rules

Related News

Gismat Jail Mandi

Food Safety : మదీనగూడలో ఫుడ్ సేఫ్టీ దాడులు.. గిస్మత్ జైల్ మండీకి షోకాజ్ నోటీసు

సైబరాబాద్ పరిధిలో కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో భాగంగా మదీనగూడలోని గిస్మత్ జైల్ మండీ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు ఆహార భద్రతా ఉల్లంఘనలు బయటపడటంతో అధికారులు షోకాజ్ నోటీసు జారీ చేశారు. తనిఖీల్లో భాగంగా లేబుల్స్ లేకుండా ముడి ప‌దార్థాలు, నాన్‌వెజ్ ఆహార పదార్థాలను నిల్వ ఉంచినట్లు గుర్తించారు. చికెన్, మటన్, చేపల

  • Food safety

    HYD : హోటళ్లలో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. వెలుగులోకి ఆందోళనకర అంశాలు

Latest News

  • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

  • Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

  • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

  • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd