TTD: టీటీడీకి రెండు ఖరీదైన బస్సులు విరాళం
కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
- By Balu J Published Date - 08:14 PM, Fri - 1 December 23
TTD: కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన దర్శనం కోసం ఎంతోమంది బారులు తీరుతారు. ఇక ఆయనకు కానుకలు సమర్పించేందుకు సైతం పోటీ పోడుతుంటారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి శుక్రవారం ఓ దాత రెండు బస్సులను విరాళంగా అందజేశారు. చెన్నైకి చెందిన ప్రముఖ విద్యా సంస్థ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ నారాయణరావు రూ.80 లక్షల విలువైన రెండు బస్సులను అందజేశారు.
ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట వాహనం తాళాలను ఈవో ఏవి ధర్మారెడ్డికి అందజేశారు.ఈ కార్యక్రమంలో టీటీడీ రవాణా విభాగం జిఎం శేషారెడ్డి, తిరుమల డీఐ జానకిరామరెడ్డి పాల్గన్నారు.తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో 5 కంపార్ట్మెంట్లు నిండిపోగా టోకెన్లు లేని యాత్రికులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.
Tags
Related News
TTD: “గోవింద కోటి” రాసిన బెంగుళూరుకు చెందిన కీర్తన, విఐపి బ్రేక్ లో శ్రీవారి దర్శనం
TTD: మొట్టమొదటిసారిగా “గోవింద కోటి”ని రాసిన విద్యార్థిని కీర్తనకు మంగళవారం ఉదయం టిటిడి శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పించింది. బెంగుళూరుకు చెందిన ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కుమారి కీర్తన 10 లక్షల ఒక వెయ్యి 116 సార్లు గోవింద కోటిని రాసింది. ఈ సందర్భంగా కీర్తన మీడియాతో మాట్లాడుతూ, తమ పెద్దలు, ఊరివారు చిన్నతనం నుండి రామకోటి రాయడం చూసేదానినన్నారు. మా కులదై�