TTD: టీటీడీకి రెండు ఖరీదైన బస్సులు విరాళం
కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
- By Balu J Published Date - 08:14 PM, Fri - 1 December 23
![TTD: టీటీడీకి రెండు ఖరీదైన బస్సులు విరాళం](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/06/ttd.jpg)
TTD: కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన దర్శనం కోసం ఎంతోమంది బారులు తీరుతారు. ఇక ఆయనకు కానుకలు సమర్పించేందుకు సైతం పోటీ పోడుతుంటారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి శుక్రవారం ఓ దాత రెండు బస్సులను విరాళంగా అందజేశారు. చెన్నైకి చెందిన ప్రముఖ విద్యా సంస్థ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ నారాయణరావు రూ.80 లక్షల విలువైన రెండు బస్సులను అందజేశారు.
ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట వాహనం తాళాలను ఈవో ఏవి ధర్మారెడ్డికి అందజేశారు.ఈ కార్యక్రమంలో టీటీడీ రవాణా విభాగం జిఎం శేషారెడ్డి, తిరుమల డీఐ జానకిరామరెడ్డి పాల్గన్నారు.తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో 5 కంపార్ట్మెంట్లు నిండిపోగా టోకెన్లు లేని యాత్రికులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Tags
Related News
![Ashok Gajapati Raju : ఇది నిజమైతే.. తిరుమలకు గేమ్ ఛేంజర్ అవుతుంది](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/Ashok-Gajapati-Raju.jpg)
Ashok Gajapati Raju : ఇది నిజమైతే.. తిరుమలకు గేమ్ ఛేంజర్ అవుతుంది
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ పదవి దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నామినేటెడ్ పదవి. బోర్డులో చోటు కోసం దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులపై ఒత్తిడి తీసుకురావడం చూస్తున్నాం.