Chaya Someswara Temple Mystery: ఛాయా సోమేశ్వరాలయం.. ఇదో మిస్టరీ టెంపుల్..!
ఛాయా సోమేశ్వరాలయం.. భారతీయ వాస్తు శాస్త్రం గొప్పతనానికి నిదర్శనంగా నిలిచే ఈ ఆలయం నల్లగొండలోని పానగల్లులో ఉంది. సుమారు 800 ఏళ్ల కిందట కందూరు చాళుక్య ప్రభువైన ఉదయ భానుడనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు సమాచారం.
- By Gopichand Published Date - 10:48 AM, Sat - 15 October 22
ఛాయా సోమేశ్వరాలయం.. ఇదో మిస్టరీ టెంపుల్. ఈ ఆలయం గర్బగుడి ముఖద్వారం ముందు రెండు స్తంబాలున్నా.. అన్నివేళలా ఒకే నీడ పడుతుంది. వెలుతురు ఉన్నంతసేపు ఆ నీడ కదలకుండా ఒకే స్థానంలో ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత. భారతీయ వాస్తు శాస్త్రం గొప్పతనానికి నిదర్శనంగా నిలిచే ఈ ఆలయం నల్లగొండలోని పానగల్లులో ఉంది. సుమారు 800 ఏళ్ల కిందట కందూరు చాళుక్య ప్రభువైన ఉదయ భానుడనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు సమాచారం.
ఈ ఆలయం త్రికూటాలయంగా మూడు గర్బాలయాలతో ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయం పడమర దిక్కున ఉన్న గర్బగుడిలో ఉన్న శివలింగం మీదుగా ఈ నీడ కనిపిస్తుంది. ఇది వెలుతురు ఉన్నంత సేపు ఒకే చోట స్థిరంగా ఉంటుంది. సూర్యుడి గమనం మారినా ఆ నీడలో ఎలాంటి మార్పు రాదు. సాధారణంగా ‘నీడ’ అనేది వెలుతురుకు వ్యతిరేకంగా పడుతుంది. కానీ, ఈ నీడ సూర్యుడి వెలుతురుతో పనిలేకుండా ఒకే చోట స్థిరంగా కనిపిస్తుంది.
ఛాయా సోమేశ్వరాలయాన్ని త్రికూటాలయం అంటారు. ఈ ఆలయంలో మరో చిత్రమైన విషయం ఏమిటంటే.. ఆ నీడ ఏ వస్తువుదనే విషయం ఇప్పటికీ అంతు చిక్కలేదు. ఆలయంలోని రెండు స్తంబాల్లో ఒకదాని నీడై ఉండొచ్చని భావించినా.. ఒకే నీడ రెండు స్తంబాలకు మధ్యలో ఉండే గర్బగుడిలోని విగ్రహం వెనుక వైపు పడుతోంది. దీంతో ఈ నీడ దేనిదనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఆ ఆలయంలోని మూడు గర్బ గుడులు కూడా ఒకేరీతిగా ఉంటాయి.
Related News
KCR: కేసీఆర్ బస్సును ఆపి తమ గోడు వినిపించిన నల్లగొండ రైతులు
KCR: కేసీఆర్ బస్సును ఆపి తమ గోడు వినిపించారు నల్గొండ మండలం ఆర్జాలబాయి రైతన్నలు. ఐకేపీ సెంటర్ కాంచి గన్నీ బ్యాగుల ప్రదర్శన చేశారు రైతులు. ఇరువై రోజులనుంచి కల్లాల్లో ఓడ్లుపోసుకొని కూసున్నామని ధాన్యం కొంటలేరని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు లేదని రైతు బతుకు అంతా ఆగమైందని కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. మీరున్నప్పుడు నది ఎండాకాలం కుడా నీళ్లు మతల్లు దునికేవని, మీరు ఉన్నప్పుడే అప