HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Ainavilli Siddhi Vinayaka Who Receives Abhishekam With Pens

Ainavilli Siddhi Vinayaka : పెన్నులతో అభిషేకం జరిపించుకునే అయినవిల్లి సిద్ధి వినాయక

అసలు కానిపాకం పుణ్యక్షేత్రం కావడానికి ఈ అయినవిల్లి సిద్ధి వినాయకుడే (Ainavilli Siddhi Vinayaka) కారణమని స్థలపురాణం చెబుతుంది.

  • By Vamsi Chowdary Korata Published Date - 08:00 AM, Wed - 11 October 23
  • daily-hunt
Ainavilli Siddhi Vinayaka Who Receives Abhishekam With Pens
Ainavilli Siddhi Vinayaka Who Receives Abhishekam With Pens

Ainavilli Siddhi Vinayaka : అయినవిల్లిలోని సిద్ధి వినాయకుడు స్వయంభువుడు. ఈయన కానిపాకం వినాయకుడి కంటే ముందే ఇక్కడ కొలువై ఉన్నాడని చెబుతారు. అసలు కానిపాకం పుణ్యక్షేత్రం కావడానికి ఈ అయినవిల్లి సిద్ధి వినాయకుడే కారణమని స్థలపురాణం చెబుతుంది.

ఇక్కడ నిత్యం లక్ష్మీగణపతి హోమం చాలా ఏళ్లుగా జరుగుతూ ఉంది. అదే విధంగా ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో స్వామివారికి పెన్నులతో అభిషేకం చేయించి వాటిని విద్యార్థులకు అందజేస్తారు. ఇంతటి విశిష్టమైన అయినవిల్లి సిద్ధి వినాయకుడికి (Ainavilli Siddhi Vinayaka) సంబంధించిన కథనం మీ కోసం.

స్వయంభువుడు:

అయినవిల్లి గణపతి స్వయంభువుడని చెబుతారు. ఈ క్షేత్రంలోని వినాయకుడు కానిపాకం కంటే పూర్వం నుంచే ఇక్కడ కొలువై ఉన్నాడని పురాణ కథనం. అసలు కానిపాకంలో వినాయకుడు భక్తులకు దర్శనమివ్వడానికి ఇక్కడి సిద్ధి వినాయకుడే కారణమని చెబుతారు. ఇందుకు సంబంధించిన పురాణ కథనం కూడా ఉంది. పూర్వం ఈ ప్రాంతంలో మల్లాది బాపన్నావధులు అనే గొప్ప పండితుడు ఉండేవాడు. ఆయన స్వర్ణగణపతి మహాయాగం నిర్వహించాలనుకొన్నాడు.

యాగం చివరిలో..

అనుకొన్న ప్రకారమే యాగం నిర్విఘ్నంగా పూర్తవుతూ వస్తోంది. అయితే యాగం చివరి రోజున సమర్పించే పూర్ణాహుతి ద్రవ్యాన్ని స్వర్ణమయ కాంతులతో వెలిగే గణపతి తన తొండంతో అందుకోవాలని ఆమల్లాది బాపన్నావధులు వినాయకుడి వేడుకొన్నాడు. పరమ భక్తుడైన మల్లాది బాపన్నావధుల కోరికను తీర్చడానికి యాగం చివరి రోజున వినాయకుడి ఇక్కడ వారికి దర్శనమిచ్చాడు. అయితే ఆ సమయంలో ఆయాగంలో పాల్గొన్న ముగ్గురు వినాయకుడి రూపాన్ని చూసి నవ్వడమే కాకుండా అవహేలనగా మాట్లాడారు.

అలా కానిపాకం కంటే ముందు

దీంతో వచ్చే జన్మలో వారు గుడ్డి, చెవిటి, మూగవాళ్లుగా పుడతారని ఆ వినాయకుడు శాపం పెట్టాడు. దీంతో భయపడిన వారు తమ తప్పును మన్నించాల్సిందిగా వేడుకొన్నారు. కరుణామయుడైన వినాయకుడు మీ వల్ల నా స్వయంభు విగ్రహం భక్తులకు దర్శనమిస్తుందని అప్పుడు మీరు శాపం నుంచి విముక్తులవుతారని చెప్పాడు.

దక్షప్రజాపతి:

అటు పై అక్కడి పండితుల విన్నపం మేరకు స్వామి వారు అయినవిల్లిలో సిద్ధి వినాయకుడిగా కొలువై ఉండిపోయాడు. ఆ ముగ్గురే తరువాతి జన్మలో కాణిపాకం వద్ద గుడ్డి, చెవిటి, మూగవారిగా జన్మించారని చెబుతారు. ఇలా అయినవిల్లి సిద్ధి వినాయకుడు (Ainavilli Siddhi Vinayaka) కానిపాకం వినాయకుడి కంటే ఎన్నో ఏళ్ల ముందు నుంచి ప్రజల చేత నీరాజనాలు అందుకొంటున్నట్లు స్థానిక పురాణ కథనం. ఇదిలా ఉండగా దక్షప్రజాపతి తాను యాగం ప్రారంభించే ముందు ఇక్కడి వినాయకుడినే ప్రార్థించినట్లు కూడా చెబుతారు.

నిత్యం లక్ష్మీ గణపతి హోమం:

ఈ ఆలయ ప్రాంగణంలో నిత్యం లక్ష్మీ గణపతి హోమం నిర్వహిస్తారు. ఇక్కడకు వచ్చిన భక్తులెవరైనా రూ.300 చెల్లించి ఈ హోమంలో పాల్గొనవచ్చు. మామూలుగా అయితే ఈ హోమానికి వేల రుపాయలు ఖర్చవుతుంది. విద్యార్థల కోసం ఏటా వార్షిక పరీక్షల ముందు ఫిబ్రవరిలో లక్ష పెన్నులతో స్వామివారికి అభిషేకం చేసి వాటిని విద్యార్థులకు అందిస్తారు. అమలాపురానికి 12 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. రాజమండ్రి నుంచి ఇక్కడకు 54 కిలోమీటర్లు.

Also Read:  Hawks : మాంసాహారం తినే గద్దలు చక్కెర పొంగలి మాత్రమే తింటాయి. ఏంటా ఆలయం ప్రత్యేకత..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Abhishekam
  • Ainavilli Siddhi Vinayaka
  • devotes
  • devotional
  • history
  • Pens
  • temple

Related News

Pithapuram

Pithapuram : భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠాల్లో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం

Pithapuram : భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠాల్లో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం పిఠాపురంలోని కుక్కుటేశ్వరుడి దేవాలయంలో ఉండేది. ఈ పీఠం మూలంగానే పిఠాపురానికి పీఠికాపురం అనే పేరు వచ్చిందని అంటారు. Pithapuram Charitra : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పిఠాపురం హాట్‌ టాపిక్‌. ఏ నోట విన్నా పిఠాపురం మాటే. ఈ పిఠాపురం.. కాకినాడ జిల్లాలో ఉంది. అయితే.. పిఠాపురాన్ని పూర్వం పీఠికాపురం అనేవారు. ఈ ఊరికి అధిపత

  • CM Chandrababu Naidu

    CM Chandrababu Naidu: తిరుమల బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు.. రేపు, ఎల్లుండి పర్యటన!

  • Engili Pula Bathukamma

    Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ అంటే ఏమిటి? ఏ పూల‌తో త‌యారుచేస్తారు??

Latest News

  • OG Success : OG సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్న పవన్

  • Jubilee Hills Bypoll: బిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్

  • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

  • Boxoffice : అల్లు అర్జున్ రికార్డు ను బ్రేక్ చేయలేకపోయినా పవన్

  • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

Trending News

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    • BCCI: ఇద్ద‌రి ఆటగాళ్ల‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. కారణ‌మిదే?

    • OG Movie Talk : OG టాక్ వచ్చేసిందోచ్..యూఎస్ ప్రేక్షకులు ఏమంటున్నారంటే !!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd