Vyooham : జగన్ కు ఫేవర్ గానే వ్యూహం తీశా – వర్మ
- Author : Sudheer
Date : 03-03-2024 - 9:05 IST
Published By : Hashtagu Telugu Desk
సీఎం జగన్ (CM Jagan) కు ఫేవర్ గానే ‘వ్యూహం'(Vyooham ) సినిమా తీశానని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Varma) చెప్పుకొచ్చారు. సినిమాలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను జోకర్ గా చూపించలేదని.. వాస్తవాలను మాత్రమే తెరకెక్కించానని చెప్పుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు, ఇప్పటి ఏపీ సీఎం జగన్ ఎదుర్కొన్న పరిస్థితుల ఆధారంగా ‘వ్యూహం’ సినిమాను తెరకెక్కించారు. ఎన్ని అడ్డుకులను ఎదుర్కొని ఈ సినిమా మార్చి 01 న ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమాలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), పవన్ కళ్యాణ్ క్యారెక్టర్లను ఓ ఆటాడేసుకున్నాడని సినిమా చూసిన వాళ్లు చెబుతున్నారు. ఇంట్రడక్షన్ దగ్గర నుండి సినిమా ముగిసే వరకూ వ్యూహం సినిమాలో ఆ నాయకుల నిజ స్వరూపాలు ఇవి అని చెప్పడానికే దర్శకుడు టైమ్ ఎక్కువ తీసుకున్నాడని, ఇక మిగిలిన విషయాన్ని ‘శపథం’ సినిమాలో చూపించబోతున్నాడని ప్రేక్షకులు అంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక వర్మ మాత్రం ఏపీ సీఎం జగన్ కు ఫేవర్ గానే ‘వ్యూహం’ సినిమా తీశానని తెలిపారు. సినిమాలో పవన్ కళ్యాణ్ ను జోకర్ గా చూపించలేదని.. వాస్తవాలను మాత్రమే తెరకెక్కించానని చెప్పుకొచ్చారు. ఈ సందర్బంగా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లపై సెటైర్లు వేశారు. జగన్ జైలు నుంచి వచ్చినట్టు.. నేడు లోకేష్ వ్యూహం నుంచి సినిమా రిలీజ్ అయిందన్నారు వర్మ. చంద్రబాబు 53 రోజులు జైల్లో వున్నాడు.. మా వ్యూహం కూడా 53 రోజులు ఆపారన్నారు ఆర్జీవీ. అసలు కంటెంట్ అంతా ‘శపథం’ సినిమాలో ఉంటుందని వర్మ చెప్పుకొచ్చారు. ‘వ్యూహం’ సినిమా ‘శపథం’ సినిమాకు ట్రైలర్ లాంటిదని హైప్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఉంటే ఆ సీన్స్ జనాలకు కామెడీలా అనిపిస్తుందని.. నా సినిమా అంకితం ఇచ్చేది చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ లకేనని అన్నారు.
Read Also : Vastu Tips: ఎంత సంపాదించినా డబ్బులు నిలవడం లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ఫాలో అవ్వండి?