#Drushyam2 : ప్రైమ్లో విడుదల కానున్న విక్టరీ వెంకటేష్ ‘దృశ్యం 2’
వెంకటేష్ దగ్గుబాటి నటించిన తెలుగు థ్రిల్లర్ దృశ్యం 2 సినిమా నవంబర్ 25న విడుదల కాబోతోన్నట్టు అమెజాన్ వీడియో నేడు ప్రకటించింది. ఇండియాతో పాటుగా 240 దేశాల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.
- By Balu J Published Date - 05:11 PM, Sat - 13 November 21
వెంకటేష్ దగ్గుబాటి నటించిన తెలుగు థ్రిల్లర్ దృశ్యం 2 సినిమా నవంబర్ 25న విడుదల కాబోతోన్నట్టు అమెజాన్ వీడియో నేడు ప్రకటించింది. ఇండియాతో పాటుగా 240 దేశాల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రాన్ని.. ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి, సురేష్ బాబు కలిసి సురేష్ ప్రొడక్షన్స్, రాజ్ కుమార్ థియేటర్స్ అండ్ మ్యాక్స్ మూవీస్ బ్యానర్ల మీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సూపర్ హిట్ థ్రిల్లర్ దృశ్యం సినిమాకు సీక్వెల్గా ఈ చిత్రం రాబోతోంది. వెంకటేష్తో పాటుగా ఈ చిత్రంలో మీనా, నదియ, నరేష్, కృతిక, ఈస్తర్ అనిల్, సంపత్ రాజ్, పూర్ణ తదితరులు నటించారు.
ఆరేళ్ల తరువాత రాంబాబు జీవితంలో మళ్లీ ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి.. కేస్ ఇన్వెస్టిగేషన్ ఎలా మలుపు తిరిగింది.. తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు రాంబాబు ఎలాంటి ఎత్తులు వేశాడు? ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? కథలో ప్రతీ మలుపు అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. సీటు అంచున కూర్చోబెట్టేలా కథనం ఉంటుంది. ఈ చిత్రం నవంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా 240 దేశాల్లో విడుదల కాబోతోంది.
Related News
Samantha: అల్లుఅర్జున్ పై భారీ ఆశలు పెట్టుకున్న సమంత.. ఎందుకంటే
Samantha: ఎన్నో ఆఫర్లు వస్తున్నప్పటికీ సమంత రూత్ ప్రభు వ్యూహాత్మకంగా వెండితెరకు రీఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు అట్లీతో చేయబోయే సినిమాలో ఈ టాలెంటెడ్ నటి నటిస్తున్నట్లు సమాచారం. పవర్ ఫుల్ రీఎంట్రీ ఇచ్చే సినిమా కోసం చూస్తున్న సమంత, అట్లీతో అల్లు అర్జున్ చేయబోయే నెక్ట్స్ మూవీ తనకు బెస్ట్ ఛాయిస్ అని నమ్ముతోంది. అల్లు అర్జున్ కు పా�