Chiranjeevi : వెంకీ మామ చిరుకి ఫోన్ చేసి.. ఆ మూవీ నేను చేస్తే బాగుండేదని అన్నారట.. ఏ సినిమా?
ఒకసారి విక్టరీ వెంకటేష్, చిరంజీవికి ఫోన్ చేసి.. ఆ మూవీ మీకంటే నాకు బాగా సెట్ అయ్యేదని ముక్కుసూటిగా చెప్పేశారట. ఇంతకీ అది ఏ సినిమా..?
- By News Desk Published Date - 08:31 PM, Tue - 26 December 23
ఇండస్ట్రీలో కొందరు హీరోలు ప్రయోగాలు చేసి కొన్ని సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తారు. ఇక రిలీజ్ అనంతరం ఆ చిత్రాలు చూసిన ఆడియన్స్.. ఈ మూవీ స్టోరీ ఈ హీరో కంటే ఆ హీరోకి బాగా సెట్ అయ్యేదని కామెంట్స్ చేస్తుంటారు. ఈ కామెంట్స్ ప్రేక్షకులు మాత్రమే కాదు. హీరోలు సైతం చేస్తుంటారు. ఇలా ఒకసారి విక్టరీ వెంకటేష్(Venkatesh), చిరంజీవికి(Chiranjeevi) ఫోన్ చేసి.. ఆ మూవీ మీకంటే నాకు బాగా సెట్ అయ్యేదని ముక్కుసూటిగా చెప్పేశారట.
ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ తో పాటు ఫ్రెండ్ ఎమోషన్ ని కూడా చూపించిన ‘డాడీ'(Daddy). 2001లో సురేశ్కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ప్రశంసలు అందుకున్నా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ సినిమా కథ వినగానే మరో ఆలోచన లేకుండా చిరు ఇలా అన్నారట.. ‘ఈ మూవీ నాకంటే వెంకటేష్ కి బాగుంటుందని’ చెప్పారట. కానీ రచయిత భూపతి రాజా, పలువురు ఇండస్ట్రీ వ్యక్తులు.. “వెంకటేష్ చేస్తే పెద్ద కొత్తదనం ఉండదు. ఎందుకంటే ఆయన ఆ జోనర్ లో సినిమాలు చేశారు. మీరు ఈ కథని చేస్తే కొంచెం కొత్తగా ఉంటుంది” అని చెప్పి చిరంజీవిని కన్విన్స్ చేశారట.
ఇక బలవంతంగానే ఒప్పుకున్న చిరంజీవి.. ఆ సినిమా చేశారు. అయితే ఆ మూవీ రిజల్ట్ చిరంజీవి ఊహించినట్లే అయ్యింది. ఇక సినిమా చూసిన తరువాత వెంకటేష్, చిరంజీవికి ఫోన్ చేసి ఇలా అన్నారట.. ‘సినిమా బాగుందండి. కానీ మీకంటే నాకైతే బాగుండేది’ అని అన్నారట. ఆ మాటలకు చిరు బదులిస్తూ.. ‘నేను అదే చెప్పాను వెంకటేష్’ అంటూ జరిగిన విషయం చెప్పారట. ఒకవేళ డాడీ సినిమాని చిరంజీవి ఈ సమయంలో తీసి ఉంటే కచ్చితంగా విజయం సాధించేది. ప్రస్తుతం చిరు ఉన్న ఏజ్ కి ఆడియన్స్ ఈ కథని అంగీకరించే అవకాశం ఉంది. ఇటీవల రజినీకాంత్, కమల్ హాసన్.. జైలర్, విక్రమ్ సినిమాల్లో అలాంటి పాత్రని పోషించే హిట్ కొట్టారు.
Also Read : Kalyan Ram: ఎన్టీఆర్ దేవర గ్లింప్స్ పై కళ్యాణ్ రామ్ అదిరిపోయే అప్డేట్
Related News
Praja Rajyam party: ప్రజారాజ్యం నాశనం కావడానికి కారణం అతనే: పవన్
ప్రజారాజ్యం ... మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన పార్టీ ఇది. ఓ పదిహేనేళ్ళ క్రితం ఈ పేరుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీడీపీ, కాంగ్రెస్ ఏలుతున్న రోజులవి. 2008 ఆగస్టు 26న ఎన్నో ఆశలు, ఆశయాలతో స్థాపించారు మెగాస్టార్ చిరు. ప్రజారాజ్యంలో యువరాజ్యం సగభాగం. యువరాజ్యానికి పవన్ కళ్యాణ్ అధ్యక్షుడిగా ఉన్నారు.