Tripti Dimri: యానిమల్ మూవీలో నా పాత్ర సక్సెస్ అవ్వడానికి కారణం అదే: తృప్తి డిమ్రి
బాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన చిత్రం యానిమల్. గత ఏడాది విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆ
- By Nakshatra Published Date - 05:06 PM, Thu - 28 March 24
బాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన చిత్రం యానిమల్. గత ఏడాది విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఎన్నో విమర్శలను ఎదుర్కొని చివరికి బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ గా నిలిచింది యానిమల్ మూవీ. తండ్రి ప్రేమ కోసం ఆరాటపడే కొడుకు కథే ఈ చిత్రం. ఇందులో అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి డిమ్రి కీలకపాత్రల్లో నటించారు. కాగా ఈ మూవీతో త్రిప్తి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.
ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించినప్పటికీ ఆమె కంటే త్రిప్తి డిమ్రినే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమాలో ఆమె పాత్ర ఫుల్ గా సక్సెస్ అయిందని చెప్పాలి. అయితే సినిమాలో ఆమె పాత్ర సక్సెస్ అవ్వడానికి కారణం ఇదే అని అసలు కారణమని చెప్పుకొచ్చింది డిమ్రి. ఈ మూవీతో తృప్తి డిమ్రి యువతకి క్రష్ గా మారిపోయింది. యానిమల్ చిత్రం సక్సెస్ తో తృప్తి డిమ్రికి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. తృప్తి డిమ్రి 2017లో శ్రీదేవి నటించిన మామ్ చిత్రంలో చిన్న పాత్రలో మెరిసింది. అప్పటి నుంచే తృప్తి సినీ ప్రయాణం మొదలైంది. అంతకు ముందు తృప్తి నాగిన్ సిరీస్ 3లో మెరిసింది.
ఇప్పుడిప్పుడే తృప్తిగా వెండితెరపై ఆఫర్స్ వస్తున్నాయి. యానిమల్ మూవీలో తృప్తి గ్లామర్ లుక్స్ తో పాటు ఆమె ఇన్నోసెన్స్ కూడా ఆకట్టుకుంది. తాజాగా తృప్తి జాతీయ మీడియాతో మాట్లాడుతూ యానిమల్ లో తన పాత్ర అంతలా సక్సెస్ కావడానికి గల కారణాన్ని వివరించింది. జోయా పాత్ర నాకు ఎప్పటికీ ప్రత్యేకమే. ఆ పాత్రలో ఉన్న అమాయకత్వం, బోల్డ్ నెస్, డిఫికల్ట్ కండిషన్స్ లో కూడా సైలెంట్ గా ఉండగలగడం లాంటి లక్షణాల వల్ల ఆడియన్స్ కి జోయా పాత్ర బాగా నచ్చేసింది అని తృప్తి తెలిపింది. యానిమల్ చిత్రం తర్వాత త్రిపాఠి సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయింది. క్రేజీ ఆ ఆఫర్స్ ఆమెకి దక్కుతున్నాయి. బ్యాడ్ న్యూస్, వికీ విద్య కా ఓ వాలా వీడియో, భూల్ భులాయ 3 లాంటి చిత్రాల్లో తృప్తి ఆఫర్స్ దక్కించుకుంది.
Related News
Keerthy Suresh : కీర్తి సురేష్ బాలీవుడ్ గ్లామర్.. డోస్ పెంచిన మహానటి..!
Keerthy Suresh మహానటి కీర్తి సురేష్ సౌత్ నుంచి అలా బాలీవుడ్ వెళ్లిందో లేదో గ్లామర్ డోస్ పెంచేసింది. నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కీర్తి సురేష్ ఆ సినిమా తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది