The General : సైలెంట్ ఫిలిం హిస్టరీలోనే.. అత్యంత ఖరీదైన సీన్ అదే.. వందేళ్ల క్రితమే..
1926లో రూపొందిన 'ది జనరల్' సినిమాలోని కొన్ని సెకన్ల షాట్ కోసం లక్షలు ఖర్చు చేసారు.
- By News Desk Published Date - 05:05 PM, Wed - 3 April 24
The General : ఇప్పుడంటే డైలాగ్స్ చెప్పి సీన్స్ లో ఎమోషన్స్ పండిస్తున్నారు. కానీ ఒకప్పుడు సైలెంట్ ఫిలింస్ (మూకీ సినిమాలు) తోనే ప్రేక్షకులను ఎమోషనల్ చేసేవారు. 1890 మధ్య కాలం నుంచి 1920 మధ్య కాలం వరకు ఈ సైలెంట్ ఫిలింస్ హవానే నడిచింది. కానీ ఆ తరువాత సౌండ్ టెక్నాలజీలో కొత్త మార్పులు రావడంతో.. టాకీ సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి. కాగా సైలెంట్ ఫిలింస్ చరిత్రలో కూడా భారీ సినిమాలను తెరకెక్కించారు.
అలా తెరకెక్కించిన సినిమాల్లో అత్యంత ఖరీదైన సినిమా అంటే ‘ది జనరల్’. 1926లో రూపొందిన ఈ సినిమాలోని కొన్ని సెకన్ల షాట్ కోసం లక్షలు ఖర్చు చేసారు. ‘బస్టర్ కీటన్’ (Buster Keaton) డైరెక్ట్ చేసిన ఈ చిత్రం యదార్ధ సంఘటనల ఆధారంగా రూపొందింది. అమెరికన్ సివిల్ వార్ సమయంలో జరిగే ఈ కథ లోకోమోటివ్ (Train Locomotive) సర్వీస్ చుట్టూ తిరుగుతుంది. కాగా ఈ సినిమాలో ఓ సీన్ ఉంటుంది. ఆ సీన్ లో ట్రైన్ బ్రిడ్జిపై వెళ్తుంటే.. బ్రిడ్జి కూలిపోయి నదిలో పడిపోతుంది.
ఇక ఈ సీన్ తెరకెక్కించడం కోసం మేకర్స్ నిజమైన లోకోమోటివ్ ని ఉపయోగించారు. నిజమైన ట్రైన్, బ్రిడ్జిని నిర్మించి ఆ సీన్ ని తెరకెక్కించారు. కేవలం కొన్ని సెకెన్ల ఈ షాట్ కోసం మేకర్స్.. దాదాపు ఆ రోజుల్లోనే 100 ఏళ్ళ క్రితమే $50,000 డాలర్స్ ని ఖర్చు చేశారట. అంటే ఇండియన్ కరెన్సీలో ఇప్పటి ప్రకారం అక్షరాలా 41 లక్షల పైనే. సైలెంట్ ఫిలిం హిస్టరీలోనే ఇది అత్యంత ఖరీదైన సీన్. ఈ సీన్ ని చిత్రీకరించిన తరువాత నదిలో పడిపోయిన ఆ లోకోమోటివ్ ని అలాగే వదిలేసారు.
దాదాపు 20ఏళ్ళ పాటు ఆ లోకోమోటివ్ ఆ నదిలో ఉండిపోయింది. దీంతో అది ఒక చిన్న టూరిస్ట్ స్పాట్ లా మారిపోయింది. అయితే సెకండ్ వరల్డ్ వార్ సమయంలో స్క్రాప్ కోసం ఆ లోకోమోటివ్ ని నదిలో నుంచి తీసి.. యుద్ధం కోసం వాడుకున్నారు. కాగా ఈ సినిమా రూపొందించడానికి ఆ రోజుల్లోనే 6 కోట్లకు పైగా ఖర్చు చేసారు. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం 8 కోట్లకు పైగా రాబట్టింది.
Also Read : Kona Venkat : ఎన్టీఆర్ ఇంటిముందు నిరాహార దీక్ష చేస్తానంటున్న రైటర్ కోన వెంకట్