Krishna Statue : సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం ఆవిష్కరించిన కమల్ హాసన్.. వైసీపీ నాయకుడి ఆధ్వర్యంలో..
నవంబర్ 15న కృష్ణ మొదటి వర్ధంతి వస్తుండటంతో విజయవాడలోని వైసీపీ నాయకులు, కృష్ణ, మహేష్ బాబు అభిమానులు సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
- By News Desk Published Date - 06:43 AM, Sat - 11 November 23
దివంగత నటుడు, సూపర్ స్టార్ కృష్ణ(Krishna) విగ్రహాన్ని తాజాగా విజయవాడలో(Vijayawada) వైసీపీ(YCP) నేత దేవినేని అవినాష్(Devineni Avinash) ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. నవంబర్ 15న కృష్ణ మొదటి వర్ధంతి వస్తుండటంతో విజయవాడలోని వైసీపీ నాయకులు, కృష్ణ, మహేష్ బాబు అభిమానులు సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి లోకనాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) రావడం విశేషం. ప్రస్తుతం కమల్ హాసన్ విజయవాడలో ఇండియన్ 2 షూటింగ్ లో ఉన్నారు. దీంతో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని దేవినేని అవినాష్ దగ్గరుండి నిర్వహించారు.
ఇక కమల్ హాసన్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కమల్ కి, దేవినేని అవినాష్ కి థ్యాంక్స్ చెప్తూ మహేష్ బాబు ట్వీట్ కూడా చేశారు.
Heartfelt gratitude to @ikamalhaasan Sir and @DevineniAvi Garu for gracing the inaugural event of Krishna garu's statue in Vijayawada. Truly honoured to have them unveil Nanna garu's statue, a homage to the legacy he left behind. Also, a big thank you to all the fans from the… pic.twitter.com/4YUOidCR8d
— Mahesh Babu (@urstrulyMahesh) November 10, 2023
Also Read : Anil Ravipudi Raviteja మాస్ రాజాతో అనిల్ ఫిక్స్.. రాజా డబుల్ గ్రేట్ లైన్ చేస్తారా..?
Related News
Ram Charan : కమల్, రజినితో పాటు ఒకే స్టేజిపై కనిపించబోతున్న రామ్ చరణ్..
కమల్, రజినితో పాటు ఒకే స్టేజిపై కనిపించబోతున్న రామ్ చరణ్. దర్శకుడు శంకర్ తన భారీ ప్లాన్తో..