Sneha : ఓ చీటింగ్ కేసులో ఇద్దరు వ్యాపారులపై స్నేహ కేసు!
నటి స్నేహ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. 25 లక్షలతో తనను మోసం చేసినందుకు ఓ ప్రైవేట్ సంస్థ, ఇద్దరు వ్యాపారులపై స్నేహ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్నేహితురాలి సలహా మేరకు నటి సిమెంట్ కంపెనీలో
- By Balu J Published Date - 04:37 PM, Fri - 19 November 21
నటి స్నేహ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. 25 లక్షలతో తనను మోసం చేసినందుకు ఓ ప్రైవేట్ సంస్థ, ఇద్దరు వ్యాపారులపై స్నేహ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్నేహితురాలి సలహా మేరకు నటి సిమెంట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. సంస్థ ప్రతినిధి ఆమెకు ప్రతి నెలా అధిక రాబడిని వాగ్దానం చేశాడు. కానీ కంపెనీ ఆమెకు ఎలాంటి మొత్తాన్ని చెల్లించలేదు. కంపెనీపై, ఇద్దరు వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్నేహ కానత్తూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో పేర్కొన్న వ్యక్తులకు నోటీసులు జారీ చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
ప్రముఖ నటి స్నేహ 90వ దశకంలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పాపులర్ అయిన నటీమణులలో ఒకరు. హనుమాన్ జంక్షన్, శ్రీరామదాసు, S/O సత్యమూర్తి తదితర చిత్రాలతో సౌత్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె చివరిగా ధనుష్ నటించిన పట్టాస్ చిత్రంలో కనిపించింది. అచ్చముండు సినిమా షూటింగ్ సమయంలో స్నేహ, ఆమె భర్త ప్రసన్న ఒకరినొకరు ప్రేమించుకున్నారు! మే 11, 2012న వివాహం చేసుకున్నారు. ఈ జంట జనవరి 24, 2020న రెండో బిడ్డ కు జన్మినిచ్చారు. ఆద్యంత తో పాటు విహాన్ అనే నాలుగేళ్ల కొడుకు కూడా ఉన్నాడు.
Tags
Related News
Hyderabad: డీజీల్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్.. 10 లక్షల విలువ డీజీల్ పట్టివేత
Hyderabad: కర్ణాటక నుండి డీజిల్ స్మగ్లింగ్ చేస్తున్న ముఠా ను పోలీసులు పట్టుకుననారు. 10 లక్షల విలువ చేసే 10800 లీటర్ల డీజిల్, 35 లక్షల విలువ చేసే 7 చిన్న డీజిల్ ట్యాంకర్లు లను స్వాధీన పర్చుకున్నారు సైబరాబాద్ SOT పోలీసులు. బుధవారం మాదాపూర్ టీం మరియు గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా గచ్చిబౌలి PS పరిది లోని వట్టినాగులపల్లి శ్రీదేవి ఇంజినీర్ కళాశాల ముందు నిఘా వేసి పట్టుకున్నారు. కర్ణాటక నుండ�