Shikhar Dhawan:సోనాక్షి సిన్హా, హుమా ఖురేషితో శిఖర్ ధావన్ ‘డబుల్ ఎక్స్ఎల్’!!
ఇప్పటికే క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, శ్రీశాంత్, హర్హజన్ సింగ్ సినిమాల్లో నటించారు. ఈ జాబితాలో మరో క్రికెటర్ చేరబోతున్నాడు.
- By Hashtag U Published Date - 05:09 PM, Wed - 12 October 22
ఇప్పటికే క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, శ్రీశాంత్, హర్హజన్ సింగ్ సినిమాల్లో నటించారు. ఈ జాబితాలో మరో క్రికెటర్ చేరబోతున్నాడు. అతడే.. శిఖర్ ధావన్. సోనాక్షి సిన్హా, హుమా ఖురేషి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘డబుల్ ఎక్స్ఎల్’ లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు.హుమా ఖురేషి , శిఖర్ ధావన్ కలిసి డ్యాన్స్ చేస్తున్న ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఫొటోను హుమా రీట్వీట్ చేయడంతో గబ్బర్ వెండితెర ఎంట్రీ ఖాయమనే విషయం స్పష్టమైంది.
అధిక బరువు ఉండే ఆడవాళ్లు ఎదుర్కునే సమస్యల గురించి సున్నితంగా ప్రస్తావిస్తూ ఈ సినిమా తెరకెక్కుతోంది. బొద్దుగుమ్మలు తమ స్వప్నాల వెంట పరుగులు తీసే క్రమంలో.. వాళ్లకి ఎదురైన అనుభవాలే ఈ చిత్ర కథాంశం. ఈ కామెడీ డ్రామాకి సత్రం రమణి దర్శకుడు. వాకూ ఫిల్మ్స్, ముదస్సర్ అజీజ్ నిర్మాతలు. ఈ సినిమాలో జహీర్ ఇక్బాల్, మహత్ రాఘవేంద్ర వంటి స్టార్స్ కూడా ఉన్నారు. గుల్షన్ కుమార్ సమర్పణలో టీ-సిరీస్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది నవంబర్ 4న విడుదల కానున్నట్టు చిత్ర బృందం పేర్కొంది.
ధావన్ ఏమన్నారు?
తన సినిమా అరంగేట్రం గురించి ధావన్ తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడాడు. ”దేశం తరఫున ఆడే నా లాంటి అథ్లెట్ జీవితం క్షణం ఖాళీ లేకుండా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ నేను తీరిక చేసుకుని అప్పుడప్పుడు మంచి సినిమాలు చూస్తుంటాను.ఈ సినిమా అవకాశం నాకు వచ్చినప్పుడు ముందు కథ విన్నాను. అది నా మనసును తాకింది. ఈ చిత్రం సమాజానికి మంచి సందేశాన్నిస్తుంది. మనం ఎలా ఉన్నా.. మన కలలను నెరవేర్చుకోవచ్చన్న విశ్వాసాన్ని నింపుతుంది” అని ధావన్ చెప్పుకొచ్చాడు.
Related News
PBKS vs SRH: నేడు సన్రైజర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్.. గణంకాలు ఏం చెబుతున్నాయంటే..?
ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ (PBKS vs SRH) మధ్య మ్యాచ్ జరగనుంది.