OTT Release: ఓటీటీలోకి ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’
శర్వానంద్, రష్మిక జంటగా నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ఇటీవలే థియేటర్లలో విడుదలైంది.
- By Balu J Published Date - 11:22 AM, Tue - 8 March 22
శర్వానంద్, రష్మిక జంటగా నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఓకే అనిపించుకుంది. ఇప్పటికే థియేటర్లలో రన్ అవుతున్న ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు మూవీ మేకర్స్. ఈ మేరకు సోనీలైవ్ త్వరలో ప్రీమియర్కు సిద్ధమవుతున్నట్టు టాలీవుడ్ టాక్. సాధారణంగా.. ఏ సినిమా అయినా థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత మాత్రమే ఓటీటీ విడుదలను ప్లాన్ చేస్తారు. అయితే ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ నిర్మాతలు మాత్రం ముందే నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ ఓటీటీ డీల్ కుదిరితే ఈ మూవీ ఏప్రిల్ మొదటివారంలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయి. అయితే ఈ నెలలో ‘రాధే శ్యామ్’, ‘RRR’ వంటి భారీ చిత్రాలు విడుదలకు సిద్ధంకానుండటంతో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ నిర్మాతలకు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ దొరకడం కష్టమనే చెప్పాలి. ఈ కారణంతోనే ఈ చిత్ర నిర్మాతలు ముందుగానే ఓటీటీ డీల్ కుదుర్చుకోనున్నట్టు తెలుస్తోంది.
Related News
Sabari: ‘శబరి’ టైటిల్ పెట్టడం వెనుక అసలు ఉద్దేశం అదే – దర్శకుడు అనిల్ కాట్జ్ ఇంటర్వ్యూ
Sabari: విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన సినిమా ‘శబరి’. ఈ చిత్రాన్ని మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. దర్శకులు బి గోపాల్, ఏఎస్ రవికుమార్ చౌదరి, మదన్ దగ్గర పలు చిత్రాలకు పని చేసిన అనిల్ కాట్జ్ ‘శబరి’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మే 3న సినిమా పాన్ ఇండియా రిలీజ్ కానున్న నేపథ్యంలో దర్శకుడు అనిల్ కా�