Samajavaragamana: ఓటీటీలోకి వచ్చేస్తోన్న సామజవరగమన, స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ఈ సంవత్సరంలో అత్యంత వినోదాత్మకమైన మూవీగా సామజవరగమన నిలిచింది.
- By Balu J Published Date - 12:18 PM, Fri - 21 July 23
ఈ సంవత్సరంలో అత్యంత వినోదాత్మకమైన మూవీగా సామజవరగమన నిలిచింది. కుటుంబ ప్రేక్షకులను అలరించిన ఈ మూవీ త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. జూలై 28 నుంచి ఆహాలోకి ఈ మూవీ రాబోతోంది. సామజవరగమన వినోదం, శృంగారం, నాటకం, హాస్యం అనేక అంశాలతో రూపుదిద్దుకున్న మూవీ. టాలెంటెడ్ శ్రీవిష్ణు, రెబా మోనికా జోగన్, నరేష్ తదితరులు నటించారు. హైదరాబాద్లోని ప్రముఖ మల్టీప్లెక్స్లో టికెట్ విక్రేతగా పనిచేసే బాలుగా నటిస్తాడు. అతని తండ్రి, ఉమా మహేశ్వర రావు (నరేష్), తన డిగ్రీని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాడు. పరీక్ష హాలులో సరయు (రెబా మోనికా జాన్)ని కలుస్తాడు.
సరయు తర్వాత ఉమ ఇంటికి పేయింగ్ గెస్ట్గా వస్తుంది. సాధారణంగా అమ్మాయిలందరినీ అక్కాచెల్లెళ్లలా చూసుకునే బాలుతో ప్రేమలో పడుతుంది. చివరికి, బాలు కూడా ఆమె పట్ల భావాలను పెంచుకుంటాడు. తర్వాత ఏమి జరుగుతుంది అనే స్టోరీ ఈ మూవీ తెరకెక్కింది. 2023 ద్వితియార్ధంలో విడుదలైన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్లోనే రూ.19.8 కోట్లు వసూళ్ చేసి మంచి విజయం సాధించింది. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహా (AHA) దక్కించుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ.. “నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, సామజవరగమన దానికి చక్కటి రూపం, ఇక నో ఆలస్యం…ఈ నెల 28 న ఆహాలో కలుద్దాం” అంటూ ట్విట్టర్లో తెలిపింది.
Also Read: Kishan Reddy: నేడు బీజేపీ పార్టీ పగ్గాలు చేపట్టనున్న కిషన్ రెడ్డి
Related News
Sabari: ‘శబరి’ టైటిల్ పెట్టడం వెనుక అసలు ఉద్దేశం అదే – దర్శకుడు అనిల్ కాట్జ్ ఇంటర్వ్యూ
Sabari: విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన సినిమా ‘శబరి’. ఈ చిత్రాన్ని మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. దర్శకులు బి గోపాల్, ఏఎస్ రవికుమార్ చౌదరి, మదన్ దగ్గర పలు చిత్రాలకు పని చేసిన అనిల్ కాట్జ్ ‘శబరి’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మే 3న సినిమా పాన్ ఇండియా రిలీజ్ కానున్న నేపథ్యంలో దర్శకుడు అనిల్ కా�